ETV Bharat / business

'కస్టమర్ల సమ్మతి లేకుండా 84 వేల రుణాలిచ్చాం'

author img

By

Published : Nov 7, 2021, 5:16 AM IST

సాంకేతిక సమస్యల కారణంగా రుణగ్రహీతల సమ్మతి లేకుండా ఈ ఏడాది మే నెలలో 84 వేల రుణాలను మంజూరు చేసినట్లు ప్రముఖ ప్రైవేటు బ్యాంకు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ తెలిపింది. ఈ రుణాలు తమ అనుబంధ సంస్థ భారత్‌ ఫినాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ లిమిటెడ్‌(బీఎఫ్‌ఐఎల్‌) మంజూరు చేసినట్లు పేర్కొంది.

indusind bank
ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌

రుణగ్రహీతల సమ్మతి లేకుండా ఈ ఏడాది మే నెలలో తమ అనుబంధ సంస్థ భారత్‌ ఫినాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ లిమిటెడ్‌(బీఎఫ్‌ఐఎల్‌) 84 వేల రుణాలను మంజూరు చేసినట్లు ప్రముఖ ప్రైవేటు బ్యాంకు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ వెల్లడించింది. సాంకేతిక సమస్యల వల్లే ఈ సమస్య తలెత్తిందని వివరించింది. 'ఎవర్‌గ్రీనింగ్‌'(శాశ్వత పునరుద్ధరణ)లో భాగంగానే బ్యాంకు ఈ అక్రమ పద్ధతులను అవలంబించిందని వస్తున్న ఆరోపణలను ఖండించింది.

ఎవరైనా రుణం తీసుకొని తిరిగి చెల్లించే పరిస్థితిలో లేకపోతే.. బ్యాంకులు మరోసారి వారికి అదనపు రుణం ఇచ్చి పాత రుణం ఖాతాలో జమచేసుకుంటాయి. రుణ కాలపరిమితి ముగిసిన ప్రతిసారీ ఇలాగే పునరుద్ధరిస్తూ వెళ్తాయి. దీని వల్ల రుణగ్రహీతకు రుణం పొందే అర్హత పెరుగుతుంది. అలాగే బ్యాంకుల పద్దు పుస్తకాల్లో మొండి బకాయిల మొత్తం తగ్గుతుంది. బ్యాంకు మంజూరు చేసిన రుణం మాత్రం ఎప్పటికీ వసూలు కాదు. దీన్నే ఎవర్‌గ్రీనింగ్‌ అంటారు. ఇది భారత బ్యాంకింగ్‌ వ్యవస్థలో తరచూ జరుగుతుంటుంది! నియంత్రణ సంస్థలు మాత్రం ఈ విధానాన్ని అస్సలు అనుమతించవు. తాజాగా ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ మంజూరు చేసిన 84 వేల రుణాలు కూడా ఎవగ్రీనింగ్‌లో భాగమేనని ఓ ప్రజావేగు ఆరోపించారు.

దీనిపై స్పందించిన ఇండస్ఇండ్‌ బ్యాంక్‌ అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేసింది. సాంకేతిక సమస్య వల్లే మే నెలలో రుణగ్రహీతల అనుమతి లేకుండా రుణాలు మంజూరయ్యాయని తెలిపింది. పైగా 84 వేల రుణాల్లో కేవలం 26,073 మాత్రమే క్రియాశీలకంగా ఉన్న పాత రుణగ్రహీతలకు అందాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎవర్‌గ్రీనింగ్‌కు అవకాశమే లేదని తెలిపింది. క్షేత్రస్థాయిలో ఉండే తమ సిబ్బంది రెండు రోజుల్లో సమస్యను గుర్తించారని వెల్లడించింది. దీంతో వెంటనే సమస్యను పరిష్కరించామని పేర్కొంది. దీనిపై స్వతంత్ర సమీక్ష జరుగుతోందని తెలిపింది. అవసరమైన చర్యలు తీసుకొని రుణాలు వసూలు చేస్తామని తెలిపింది.

ఇదీ చూడండి: ఆరోగ్య బీమా పాలసీలో ఈ రైడర్లు ఉంటే మేలు

రుణగ్రహీతల సమ్మతి లేకుండా ఈ ఏడాది మే నెలలో తమ అనుబంధ సంస్థ భారత్‌ ఫినాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ లిమిటెడ్‌(బీఎఫ్‌ఐఎల్‌) 84 వేల రుణాలను మంజూరు చేసినట్లు ప్రముఖ ప్రైవేటు బ్యాంకు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ వెల్లడించింది. సాంకేతిక సమస్యల వల్లే ఈ సమస్య తలెత్తిందని వివరించింది. 'ఎవర్‌గ్రీనింగ్‌'(శాశ్వత పునరుద్ధరణ)లో భాగంగానే బ్యాంకు ఈ అక్రమ పద్ధతులను అవలంబించిందని వస్తున్న ఆరోపణలను ఖండించింది.

ఎవరైనా రుణం తీసుకొని తిరిగి చెల్లించే పరిస్థితిలో లేకపోతే.. బ్యాంకులు మరోసారి వారికి అదనపు రుణం ఇచ్చి పాత రుణం ఖాతాలో జమచేసుకుంటాయి. రుణ కాలపరిమితి ముగిసిన ప్రతిసారీ ఇలాగే పునరుద్ధరిస్తూ వెళ్తాయి. దీని వల్ల రుణగ్రహీతకు రుణం పొందే అర్హత పెరుగుతుంది. అలాగే బ్యాంకుల పద్దు పుస్తకాల్లో మొండి బకాయిల మొత్తం తగ్గుతుంది. బ్యాంకు మంజూరు చేసిన రుణం మాత్రం ఎప్పటికీ వసూలు కాదు. దీన్నే ఎవర్‌గ్రీనింగ్‌ అంటారు. ఇది భారత బ్యాంకింగ్‌ వ్యవస్థలో తరచూ జరుగుతుంటుంది! నియంత్రణ సంస్థలు మాత్రం ఈ విధానాన్ని అస్సలు అనుమతించవు. తాజాగా ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ మంజూరు చేసిన 84 వేల రుణాలు కూడా ఎవగ్రీనింగ్‌లో భాగమేనని ఓ ప్రజావేగు ఆరోపించారు.

దీనిపై స్పందించిన ఇండస్ఇండ్‌ బ్యాంక్‌ అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేసింది. సాంకేతిక సమస్య వల్లే మే నెలలో రుణగ్రహీతల అనుమతి లేకుండా రుణాలు మంజూరయ్యాయని తెలిపింది. పైగా 84 వేల రుణాల్లో కేవలం 26,073 మాత్రమే క్రియాశీలకంగా ఉన్న పాత రుణగ్రహీతలకు అందాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎవర్‌గ్రీనింగ్‌కు అవకాశమే లేదని తెలిపింది. క్షేత్రస్థాయిలో ఉండే తమ సిబ్బంది రెండు రోజుల్లో సమస్యను గుర్తించారని వెల్లడించింది. దీంతో వెంటనే సమస్యను పరిష్కరించామని పేర్కొంది. దీనిపై స్వతంత్ర సమీక్ష జరుగుతోందని తెలిపింది. అవసరమైన చర్యలు తీసుకొని రుణాలు వసూలు చేస్తామని తెలిపింది.

ఇదీ చూడండి: ఆరోగ్య బీమా పాలసీలో ఈ రైడర్లు ఉంటే మేలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.