ETV Bharat / business

లాక్​డౌన్​ ఎఫెక్ట్: 23% పెరిగిన రేడియో శ్రోతల సంఖ్య

భారత్​లో లాక్​డౌన్​ కారణంగా రేడియోను అనుసరిస్తున్నవారి సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అసోసియేషన్​ ఆఫ్​ రేడియో ఆపరేటర్స్​ ఫర్​ ఇండియా(ఏఆర్​ఓఐ) ఓ అధ్యాయనంలో వెల్లడించింది. ప్రస్తుతం టీవీ తర్వాత స్థానంలో రేడియో ఉన్నట్లు తెలిపింది.

author img

By

Published : Apr 13, 2020, 8:06 PM IST

COVID-19 lockdown: Radio listenership increases by 23 per cent : Study
లాక్​డౌన్​ ఎఫెక్ట్: 23 శాతం పెరిగిన రేడియో శ్రోతల సంఖ్య

లాక్​డౌన్​ వేళ రేడియో శ్రోతల సంఖ్య పెరిగినట్లు తెలిపింది అసోషియేషన్​ ఆఫ్​ రేడియో ఆపరేటర్స్​ ఫర్​ ఇండియా(ఏఆర్​ఓఐ). రేడియో వింటూ ప్రతిరోజూ 2.36 గంటలు అధికంగా గడుపుతున్నారని, రేడియోను అనుసరించేవారి సంఖ్య 23 శాతం పెరిగిందని తెలిపింది. ప్రస్తుతం ఇది టీవీ తర్వాత స్థానంలో ఉంది.

లాక్​డౌన్​ వల్ల విసుగును అధిగమించే ప్రయత్నంలో ఎక్కువ మంది ప్రజలు సమాచారం, వినోదం కోసం రేడియోను అనుసరిస్తున్నట్లు తెలిపింది ఏఆర్​ఓఐ. టీవీని 56 మిలియన్లు, సోషల్​ మీడియాను 57 మిలియన్ల మంది అనుసరిస్తుండగా... రేడియోను 51 మిలియన్ల మంది వింటున్నారని వెల్లడించింది.

"సాధారణ, రద్దీ సమయాల్లో రేడియో ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగా అట్టడుగు స్థాయి నుంచి మెట్రో స్థాయి వరకు అందరూ ఆదరించే మాధ్యమం. "

-- ఏఆర్​ఓఐ

సుమారు 3,300 మందిపై ఏజెడ్​ నిర్వహించిన పరిశోధన ప్రకారం 82 శాతం మంది రేడియోను ట్యూన్​ చేస్తున్నారు. ఈ కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో రెండో అత్యంత విశ్వసనీయ సమాచార వనరుగా ఎఫ్​ఎమ్​ ఛానెళ్లు అవతరించాయి. రేడియో విశ్వసనీయత 6.27 గా నమోదైంది. ఇంటర్నెట్​ 6.44, టీవీ 5.74గా ఉన్నాయి. రేడియో ఎఫ్​ఎమ్​ వినేవారి సంఖ్య 64 శాతం నుంచి 22 శాతం పెరిగి 84 శాతానికి చేరుకుంది.

" రేడియో ద్వారా వచ్చే సమాచారాన్ని విశ్వసించేవారి సంఖ్య అధికంగా పెరుగుతోంది. విశ్వసనీయ సమాచార వనరుగా రేడియో అభివృద్ధి చెందడం మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఈ కరోనా సమయంలో రేడియోను అనుసరించేవారి సంఖ్య 23 శాతం పెరిగింది."

-- అనురాధ ప్రసాద్​, ఏఆర్​ఓఐ ప్రెసిడెంట్​

ఇదీ చదవండి: వాట్సాప్​లో ఈ కొత్త ఫీచర్ల గురించి తెలుసా?

లాక్​డౌన్​ వేళ రేడియో శ్రోతల సంఖ్య పెరిగినట్లు తెలిపింది అసోషియేషన్​ ఆఫ్​ రేడియో ఆపరేటర్స్​ ఫర్​ ఇండియా(ఏఆర్​ఓఐ). రేడియో వింటూ ప్రతిరోజూ 2.36 గంటలు అధికంగా గడుపుతున్నారని, రేడియోను అనుసరించేవారి సంఖ్య 23 శాతం పెరిగిందని తెలిపింది. ప్రస్తుతం ఇది టీవీ తర్వాత స్థానంలో ఉంది.

లాక్​డౌన్​ వల్ల విసుగును అధిగమించే ప్రయత్నంలో ఎక్కువ మంది ప్రజలు సమాచారం, వినోదం కోసం రేడియోను అనుసరిస్తున్నట్లు తెలిపింది ఏఆర్​ఓఐ. టీవీని 56 మిలియన్లు, సోషల్​ మీడియాను 57 మిలియన్ల మంది అనుసరిస్తుండగా... రేడియోను 51 మిలియన్ల మంది వింటున్నారని వెల్లడించింది.

"సాధారణ, రద్దీ సమయాల్లో రేడియో ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగా అట్టడుగు స్థాయి నుంచి మెట్రో స్థాయి వరకు అందరూ ఆదరించే మాధ్యమం. "

-- ఏఆర్​ఓఐ

సుమారు 3,300 మందిపై ఏజెడ్​ నిర్వహించిన పరిశోధన ప్రకారం 82 శాతం మంది రేడియోను ట్యూన్​ చేస్తున్నారు. ఈ కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో రెండో అత్యంత విశ్వసనీయ సమాచార వనరుగా ఎఫ్​ఎమ్​ ఛానెళ్లు అవతరించాయి. రేడియో విశ్వసనీయత 6.27 గా నమోదైంది. ఇంటర్నెట్​ 6.44, టీవీ 5.74గా ఉన్నాయి. రేడియో ఎఫ్​ఎమ్​ వినేవారి సంఖ్య 64 శాతం నుంచి 22 శాతం పెరిగి 84 శాతానికి చేరుకుంది.

" రేడియో ద్వారా వచ్చే సమాచారాన్ని విశ్వసించేవారి సంఖ్య అధికంగా పెరుగుతోంది. విశ్వసనీయ సమాచార వనరుగా రేడియో అభివృద్ధి చెందడం మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఈ కరోనా సమయంలో రేడియోను అనుసరించేవారి సంఖ్య 23 శాతం పెరిగింది."

-- అనురాధ ప్రసాద్​, ఏఆర్​ఓఐ ప్రెసిడెంట్​

ఇదీ చదవండి: వాట్సాప్​లో ఈ కొత్త ఫీచర్ల గురించి తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.