ETV Bharat / business

'ట్రాన్సాక్షన్ ఫెయిలైతే...​ రీఫండ్​లో జాప్యమేల?'

author img

By

Published : Jan 1, 2021, 2:44 PM IST

బ్యాంక్​ లావాదేవీలు విఫలమవటం, రద్దై డబ్బు జమ కాకపోవటం వంటి సందర్భాల్లో నగదు రీఫండ్​ ఆలస్యం కావడంపై ఆర్బీఐకి లేఖ రాసింది సీసీపీఏ. ఈ అంశంలో జోక్యం చేసుకొని, త్వరగా డబ్బులు తిరిగి జమచేసేందుకు ఆదేశించాలని కోరింది.

CCPA seeks RBI intervention
బ్యాంక్​ లావాదేవీల రీఫండ్​లో జాప్యంపై ఆర్బీఐకి లేఖ

బ్యాంకింగ్​ లావాదేవీలు విఫలమైన సమయంలో ఖాతా నుంచి కట్​ అయిన నగదును తిరిగి జమ చేయడంలో జాప్యంపై ఆందోళన వ్యక్తం చేసింది కొత్తగా ఏర్పాటైన వినియోగదారుల భద్రతా ప్రాధికార సంస్థ (సీసీపీఏ). ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని రిజర్వ్​ బ్యాంక్​ను కోరింది.

ఈ మేరకు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్​ ఎంకే జైన్​కు లేఖ రాశారు సీసీపీఏ చీఫ్​ కమిషనర్​ నిధి ఖేర్. ఖాతాల నుంచి డిడక్ట్ అయిన మొత్తాన్ని త్వరగా ఖాతాదారునికి తిరిగి పంపించేలా బ్యాంకులను ఆదేశించాలని కోరారు. లావాదేవీలు విఫలమవడం, రద్దై డబ్బు జమ కాకపోవడటం వంటి అంశాలపై ఇప్పటి వరకు 2,850 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని జాతీయ వినియోగదారుల హెల్ప్​లైన్​ (ఎన్​సీహెచ్​) ద్వారా వచ్చిన వాటిల్లో 20 శాతం సమస్యలు బ్యాంకింగ్​ రంగానికి చెందినవే ఉంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

" బ్యాంకులు నగదును ఖాతాల్లో జమ చేస్తున్నప్పటికీ.. ఆర్బీఐ మార్గదర్శకాల్లో సూచించిన మేరకు త్వరగా అందించటం లేదు. ఈ తరహా ఫిర్యాదుల పరిష్కారానికి ఆర్బీఐ సూచనలకు బ్యాంకులు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని ఆర్బీఐని కోరుతున్నాం. త్వరగా నగదు జమచేసేలా బ్యాంకులను ఆదేశించాలి. "

- నిధి ఖేర్​, సీసీపీఏ చీఫ్​ కమిషనర్​​

ఈ అంశంలో ఆర్బీఐకి పూర్తిస్థాయిలో సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు నిధి ఖేర్​.

ఇదీ చూడండి: ''లైట్​హౌస్'తో గృహ నిర్మాణాలకు కొత్త దిశ'

బ్యాంకింగ్​ లావాదేవీలు విఫలమైన సమయంలో ఖాతా నుంచి కట్​ అయిన నగదును తిరిగి జమ చేయడంలో జాప్యంపై ఆందోళన వ్యక్తం చేసింది కొత్తగా ఏర్పాటైన వినియోగదారుల భద్రతా ప్రాధికార సంస్థ (సీసీపీఏ). ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని రిజర్వ్​ బ్యాంక్​ను కోరింది.

ఈ మేరకు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్​ ఎంకే జైన్​కు లేఖ రాశారు సీసీపీఏ చీఫ్​ కమిషనర్​ నిధి ఖేర్. ఖాతాల నుంచి డిడక్ట్ అయిన మొత్తాన్ని త్వరగా ఖాతాదారునికి తిరిగి పంపించేలా బ్యాంకులను ఆదేశించాలని కోరారు. లావాదేవీలు విఫలమవడం, రద్దై డబ్బు జమ కాకపోవడటం వంటి అంశాలపై ఇప్పటి వరకు 2,850 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని జాతీయ వినియోగదారుల హెల్ప్​లైన్​ (ఎన్​సీహెచ్​) ద్వారా వచ్చిన వాటిల్లో 20 శాతం సమస్యలు బ్యాంకింగ్​ రంగానికి చెందినవే ఉంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

" బ్యాంకులు నగదును ఖాతాల్లో జమ చేస్తున్నప్పటికీ.. ఆర్బీఐ మార్గదర్శకాల్లో సూచించిన మేరకు త్వరగా అందించటం లేదు. ఈ తరహా ఫిర్యాదుల పరిష్కారానికి ఆర్బీఐ సూచనలకు బ్యాంకులు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని ఆర్బీఐని కోరుతున్నాం. త్వరగా నగదు జమచేసేలా బ్యాంకులను ఆదేశించాలి. "

- నిధి ఖేర్​, సీసీపీఏ చీఫ్​ కమిషనర్​​

ఈ అంశంలో ఆర్బీఐకి పూర్తిస్థాయిలో సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు నిధి ఖేర్​.

ఇదీ చూడండి: ''లైట్​హౌస్'తో గృహ నిర్మాణాలకు కొత్త దిశ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.