ఎస్ బ్యాంక్ వివాదంలో వాధ్వాన్ సోదరుల మెడకు ఉచ్చు బిగుస్తోంది. డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్ కపిల్ వాధ్వాన్, ఆర్కేడబ్ల్యూ డెవలపర్ ప్రమోటర్ ధీరజ్ వాధ్వాన్లను సీబీఐ అదుపులోకి తీసుకుంది. వారిపై నాన్ బెయిలబుల్ వారెంటు జారీ ప్రక్రియ కొనసాగుతున్నట్లు సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.
ఎస్ బ్యాంక్ మాజీ సీఈఓ రానా కపూర్తో కలిసి వాధ్వాన్లు పలు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో మార్చి 7న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
లాక్డౌన్ ఉల్లంఘన..
ఓ వైపు ఎస్ బ్యాంక్ వివాదంలో నిందితులుగా ఉన్న వాధ్వాన్ సోదరులపై ఈ నెల ఆరంభంలో లాక్డౌన్ ఉల్లంఘన అభియోగాలు నమోదయ్యాయి. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తూ కేంద్రం గత నెల కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నెల ఆరంభంలో వాధ్వాన్ సోదరులు కుటుంబ సభ్యులతో కలిసి సతారా జిల్లా మహాబలేశ్వర్లోని వారి ఫామ్హౌజ్కు చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా అక్కడకు చేరుకున్నారనే కారణంతో వారిని మహాబలేశ్వర్లోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు అధికారులు.
ఇదే విషయమై సతారా జిల్లా పోలీసులకు సీబీఐ లేఖ రాసింది. తమ అనుమతి లేకుండా వారిని బయటకు వెళేందుకు అనుమతించొద్దని అందులో పేర్కొంది.
ఇదీ చూడండి:వాట్సాప్లో జియోమార్ట్ సేవలు ప్రారంభం