ETV Bharat / business

లాక్​డౌన్​తో ఏటీఎంల వినియోగం 50 శాతం డౌన్​! - సగానికి తగ్గిన ఏటీఎం లావాదేవీలు

కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్​డౌన్​తో ఏప్రిల్​లో ఏటీఎంల వినియోగం భారీగా పడిపోయింది. ఏటీఎం ద్వారా మొత్తం లావాదేవీలు మార్చిలో రూ.54.71 కోట్లుగా ఉండగా.. అవి ఏప్రిల్​లో రూ.28.66 కోట్లకు పడిపోయాయి. ఆర్​బీఐ విడుదల చేసి తాజా నివేదికలో ఈ విషయం తెలిసింది.

lock down impact on Atm usage
ఏటీఎంల వాడకంపై లాక్​డౌన్ ప్రభావం
author img

By

Published : Jun 11, 2020, 2:02 PM IST

లాక్​డౌన్ కారణంగా ఏప్రిల్​లో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలు దాదాపు సగానికి తగ్గాయి. భారతీయ రిజర్వు బ్యాంక్ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఏప్రిల్​లో ఏటీఎంల ద్వారా రూ.1.27 లక్షల కోట్ల నగదు తీసుకున్నారు వినియోగదారులు. మార్చి నెలలో రూ.2.51 లక్షల కోట్లు ఉపసంహరించుకున్నారు.

ఆర్​బీఐ వెల్లడించిన మరిన్ని విషయాలు..

  • ఏటీఎంల ద్వారా లావాదేవీలు ఏప్రిల్​లో రూ.28.66 కోట్లకు పడిపోయాయి. మార్చిలో ఇవి రూ.54.71 కోట్లుగా ఉన్నాయి.
  • డెబిట్​ కార్డుల ద్వారా ఏప్రిల్​లో రూ.28.52 కోట్ల లావాదేవీలు జరగ్గా.. మార్చిలో రూ.54.41 కోట్లు జరిగాయి.
  • ఏప్రిల్ నాటికి దేశవ్యాప్తంగా 82.94 కోట్ల డెబిట్ కార్డులు, 5.73 కోట్ల క్రెడిట్ కార్డులు (మొత్తం 88.68 కోట్లు కార్డులు) ఉన్నాయి. మార్చిలో మొత్తం కార్డుల సంఖ్య 88.63 కోట్లుగా ఉంది.
  • దేశవ్యాప్తంగా ఏప్రిల్ నాటికి మొత్తం 2.34 లక్షల ఏటీఎంలు, 50.85 లక్షల పాయింట్​ ఆఫ్​ సేల్ (పీఓఎస్​) టెర్మినల్స్ ఉన్నాయి.
  • పీఓఎస్​ల ద్వారా మార్చిలో 33.69 లక్షల లావాదేవీలు (రూ.110 కోట్లు) జరగ్గా.. ఏప్రిల్​ నాటికి అవి 40.87 లక్షలకు (రూ.111 కోట్లకు) పెరిగాయి.

ఇదీ చూడండి:ఏటీఎం టచ్​ చేయకుండానే క్యాష్ విత్​డ్రా!

లాక్​డౌన్ కారణంగా ఏప్రిల్​లో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలు దాదాపు సగానికి తగ్గాయి. భారతీయ రిజర్వు బ్యాంక్ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఏప్రిల్​లో ఏటీఎంల ద్వారా రూ.1.27 లక్షల కోట్ల నగదు తీసుకున్నారు వినియోగదారులు. మార్చి నెలలో రూ.2.51 లక్షల కోట్లు ఉపసంహరించుకున్నారు.

ఆర్​బీఐ వెల్లడించిన మరిన్ని విషయాలు..

  • ఏటీఎంల ద్వారా లావాదేవీలు ఏప్రిల్​లో రూ.28.66 కోట్లకు పడిపోయాయి. మార్చిలో ఇవి రూ.54.71 కోట్లుగా ఉన్నాయి.
  • డెబిట్​ కార్డుల ద్వారా ఏప్రిల్​లో రూ.28.52 కోట్ల లావాదేవీలు జరగ్గా.. మార్చిలో రూ.54.41 కోట్లు జరిగాయి.
  • ఏప్రిల్ నాటికి దేశవ్యాప్తంగా 82.94 కోట్ల డెబిట్ కార్డులు, 5.73 కోట్ల క్రెడిట్ కార్డులు (మొత్తం 88.68 కోట్లు కార్డులు) ఉన్నాయి. మార్చిలో మొత్తం కార్డుల సంఖ్య 88.63 కోట్లుగా ఉంది.
  • దేశవ్యాప్తంగా ఏప్రిల్ నాటికి మొత్తం 2.34 లక్షల ఏటీఎంలు, 50.85 లక్షల పాయింట్​ ఆఫ్​ సేల్ (పీఓఎస్​) టెర్మినల్స్ ఉన్నాయి.
  • పీఓఎస్​ల ద్వారా మార్చిలో 33.69 లక్షల లావాదేవీలు (రూ.110 కోట్లు) జరగ్గా.. ఏప్రిల్​ నాటికి అవి 40.87 లక్షలకు (రూ.111 కోట్లకు) పెరిగాయి.

ఇదీ చూడండి:ఏటీఎం టచ్​ చేయకుండానే క్యాష్ విత్​డ్రా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.