ETV Bharat / business

Adani Group: ఆస్ట్రేలియా గని నుంచి అదానీ బొగ్గు ఉత్పత్తి - adani group news

అదానీ గ్రూప్​(adani group) ఆస్ట్రేలియాలోని కార్మిఖేల్​ బొగ్గు గనిలో తవ్వకాలు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదికి 15 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి కానుంది. అనంతరం ఉత్పత్తి సామర్థ్యాన్ని 27.5 మిలియన్‌ టన్నులకు పెంచుకోవాలని అదానీ గ్రూపు భావిస్తోంది. ఈ గనుల వల్ల భారతీయ విద్యుత్​ ప్రాజెక్టులకు తక్కువ ధరకే బొగ్గు అందుబాటులోకి రానుంది.

adani group australia, అదానీ బొగ్గు గనులు ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా గని నుంచి అదానీ బొగ్గు ఉత్పత్తి
author img

By

Published : Jun 25, 2021, 6:41 AM IST

ఆస్ట్రేలియాలోని కార్మిఖేల్‌ గని నుంచి బొగ్గు తవ్వకాలను అదానీ గ్రూప్‌(adani group) గురువారం ప్రారంభించింది. అనుకున్న సమయానికే వినియోగదార్లకు బొగ్గును ఎగుమతి చేయడం ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్టుతో ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలగడమే కాకుండా.. భారతీయ విద్యుత్‌ ప్రాజెక్టులకు తక్కువ ధరకే బొగ్గు అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టుకు పలు వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురవ్వడమే కాకుండా..రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ముందుకు రాలేదనే విషయం తెలిసిందే. ఈ అవరోధాలన్నింటినీ అధిగమిస్తూ.. ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు అదానీ గ్రూపు శ్రమించింది.

క్వీన్స్‌ల్యాండ్‌కు 300 కి.మీల దూరంలో ఉన్న ఈ గనిని ఆస్ట్రేలియాలోని ఓ పోర్టుకు అనుసంధానం చేస్తూ కొత్త రైల్వే లైన్‌ కూడా నిర్మించారు. 16.5 బిలియన్‌ ఆస్ట్రేలియా డాలర్ల పెట్టుబడి అంచనాతో 2010లో ఈ ప్రాజెక్టుకు అదానీ గ్రూపు ప్రణాళిక రూపొందించుకుంది. ఆ తర్వాత దీనిని 2 ఆస్ట్రేలియా బిలియన్‌ డాలర్లకు తగ్గించుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రారంభంలో ఏడాదికి 15 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి కానుంది. అనంతరం ఉత్పత్తి సామర్థ్యాన్ని 27.5 మిలియన్‌ టన్నులకు పెంచుకోవాలని అదానీ గ్రూపు భావిస్తోంది. ఈ ఏడాదిలోనే బొగ్గు ఎగుమతులను ప్రారంభించేందుకూ సిద్ధమవుతుంది. కార్మిఖేల్‌ గనికి మొదటి వినియోగదారు భారతేనని సంస్థ ఉన్నతాధికారి తెలిపారు. ఏటా 10 మిలియన్‌ టన్నుల బొగ్గును ఎగుమతి చేసేందుకు భారత్‌ రూపంలో ఓ విపణిని ఇప్పటికే ఈ గని దక్కించుకుందని తెలిపారు. సూచీల ధరల ఆధారంగానే బొగ్గు విక్రయిస్తామని.. పన్నులు, రాయల్టీలను ఆస్ట్రేలియాలోనే చెల్లిస్తామని పేర్కొన్నారు.

ఆస్ట్రేలియాలోని కార్మిఖేల్‌ గని నుంచి బొగ్గు తవ్వకాలను అదానీ గ్రూప్‌(adani group) గురువారం ప్రారంభించింది. అనుకున్న సమయానికే వినియోగదార్లకు బొగ్గును ఎగుమతి చేయడం ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్టుతో ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలగడమే కాకుండా.. భారతీయ విద్యుత్‌ ప్రాజెక్టులకు తక్కువ ధరకే బొగ్గు అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టుకు పలు వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురవ్వడమే కాకుండా..రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ముందుకు రాలేదనే విషయం తెలిసిందే. ఈ అవరోధాలన్నింటినీ అధిగమిస్తూ.. ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు అదానీ గ్రూపు శ్రమించింది.

క్వీన్స్‌ల్యాండ్‌కు 300 కి.మీల దూరంలో ఉన్న ఈ గనిని ఆస్ట్రేలియాలోని ఓ పోర్టుకు అనుసంధానం చేస్తూ కొత్త రైల్వే లైన్‌ కూడా నిర్మించారు. 16.5 బిలియన్‌ ఆస్ట్రేలియా డాలర్ల పెట్టుబడి అంచనాతో 2010లో ఈ ప్రాజెక్టుకు అదానీ గ్రూపు ప్రణాళిక రూపొందించుకుంది. ఆ తర్వాత దీనిని 2 ఆస్ట్రేలియా బిలియన్‌ డాలర్లకు తగ్గించుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రారంభంలో ఏడాదికి 15 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి కానుంది. అనంతరం ఉత్పత్తి సామర్థ్యాన్ని 27.5 మిలియన్‌ టన్నులకు పెంచుకోవాలని అదానీ గ్రూపు భావిస్తోంది. ఈ ఏడాదిలోనే బొగ్గు ఎగుమతులను ప్రారంభించేందుకూ సిద్ధమవుతుంది. కార్మిఖేల్‌ గనికి మొదటి వినియోగదారు భారతేనని సంస్థ ఉన్నతాధికారి తెలిపారు. ఏటా 10 మిలియన్‌ టన్నుల బొగ్గును ఎగుమతి చేసేందుకు భారత్‌ రూపంలో ఓ విపణిని ఇప్పటికే ఈ గని దక్కించుకుందని తెలిపారు. సూచీల ధరల ఆధారంగానే బొగ్గు విక్రయిస్తామని.. పన్నులు, రాయల్టీలను ఆస్ట్రేలియాలోనే చెల్లిస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి : రూ.75వేల కోట్లతో రిలయన్స్ 'హరిత వెలుగులు'!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.