ETV Bharat / business

దిగొస్తున్న ఉల్లి ధర... ఆంధ్ర, తెలంగాణకు కొత్త సరుకు

author img

By

Published : Jan 7, 2020, 7:24 PM IST

ఆకాశాన్నంటిన ఉల్లి ధరలను దారిలోకి తేవడానికి కేంద్రం ఇప్పటివరకు 12,000 టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకున్నట్లు కేంద్రం మంత్రి రామ్ విలాస్ పాసవాన్ తెలిపారు. ఇందులో 1,000 టన్నులను ఇప్పటికే పలు రాష్ట్రాలకు రూ.49-రూ.58 మధ్య విక్రయించడానికి సరఫరా చేసినట్లు వెల్లడించారు.

12,000 tonne onion imported so far;states to get at Rs 49-58/kg for retail sale: Paswan
దిగొస్తున్న ఉల్లి ధర... ఆంధ్ర, తెలంగాణకు కొత్త సరుకు

కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 12,000 టన్నుల ఉల్లి దిగుమతి చేసుకున్నట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్​ విలాస్ పాసవాన్ తెలిపారు. ఆ సరుకును రాష్ట్రాలకు రూ.49-రూ.58 మధ్య విక్రయించడానికి సరఫరా చేసినట్లు వెల్లడించారు.

దిగుమతి చేసుకున్న ఉల్లిలో 1,000 టన్నులను దిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు పాసవాన్ తెలిపారు. అదనంగా దిగుమతి చేసుకుంటున్న 36,000 టన్నుల ఉల్లి జనవరి చివరినాటికి స్వదేశానికి చేరుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. దీంతో ధరలు మరింత తగ్గుముఖం పడతాయని అన్నారు.

దారికొస్తున్న ఉల్లి ధరలు

దేశంలో ఉన్న ఉల్లి డిమాండ్​ సహా ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో విదేశాల నుంచి కేంద్రం ఉల్లి దిగుమతి చేస్తోంది. గత రెండు నెలలుగా పలు ప్రధాన నగరాల్లో రూ.100కు పైగా పలికిన ఉల్లి ధర ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. 2019 డిసెంబర్​ 19న దేశ రాజధాని దిల్లీలో రూ.118గా ఉన్న కేజీ ఉల్లి ధర ప్రస్తుతం రూ.70 పలుకుతోంది. ఇదే సమయంలో ముంబయిలో రూ.120 నుంచి రూ.80కి చేరినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఖరీఫ్​ సీజన్​లో ఉత్పత్తి 25 శాతం తగ్గినందున దేశంలో ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 12,000 టన్నుల ఉల్లి దిగుమతి చేసుకున్నట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్​ విలాస్ పాసవాన్ తెలిపారు. ఆ సరుకును రాష్ట్రాలకు రూ.49-రూ.58 మధ్య విక్రయించడానికి సరఫరా చేసినట్లు వెల్లడించారు.

దిగుమతి చేసుకున్న ఉల్లిలో 1,000 టన్నులను దిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు పాసవాన్ తెలిపారు. అదనంగా దిగుమతి చేసుకుంటున్న 36,000 టన్నుల ఉల్లి జనవరి చివరినాటికి స్వదేశానికి చేరుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. దీంతో ధరలు మరింత తగ్గుముఖం పడతాయని అన్నారు.

దారికొస్తున్న ఉల్లి ధరలు

దేశంలో ఉన్న ఉల్లి డిమాండ్​ సహా ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో విదేశాల నుంచి కేంద్రం ఉల్లి దిగుమతి చేస్తోంది. గత రెండు నెలలుగా పలు ప్రధాన నగరాల్లో రూ.100కు పైగా పలికిన ఉల్లి ధర ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. 2019 డిసెంబర్​ 19న దేశ రాజధాని దిల్లీలో రూ.118గా ఉన్న కేజీ ఉల్లి ధర ప్రస్తుతం రూ.70 పలుకుతోంది. ఇదే సమయంలో ముంబయిలో రూ.120 నుంచి రూ.80కి చేరినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఖరీఫ్​ సీజన్​లో ఉత్పత్తి 25 శాతం తగ్గినందున దేశంలో ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి.

AP Video Delivery Log - 1300 GMT Horizons
Tuesday, 7 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1251: HZ US CES Cannabis Tech AP Clients Only 4248044
CES gadget show stubs out cannabis tech
AP-APTN-1154: HZ US CES Casino Tech AP Clients Only 4248021
Facial recognition and AI coming to Vegas casinos
AP-APTN-1123: HZ US CES Intel AP Clients Only 4248015
Intel showcases foldable display laptop concept
AP-APTN-1107: HZ US CES LG Displays AP Clients Only 4248007
The screens of the future - bendable, rollable and transparent
AP-APTN-1025: HZ US CES Audi AP Clients Only 4247996
AI:ME autonomous car takes laps at CES
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.