కార్యకర్తల మనోభావాలను సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్తానని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. ధనమే ప్రధానంగా పార్టీ అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని ఆరోపించారు. హస్తం కార్యకర్తల ఇళ్లపై దాడి చేసిన తెరాస గూటికి చేరేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్తున్నారని ఆవేదన చెందారు. అసలైన కార్యకర్తలు గ్రామాల్లో ఉన్నారని , వాళ్లని దగ్గరకు తీసుకోవాలని సూచించారు. కోవర్టులను నమ్ముకుంటే పార్టీ నష్టపోతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అధైర్యపడవద్దని భరోసా కల్పించారు.
ఇదీ చూడండి : విలీన వ్యవహారంపై కాంగ్రెస్ నిరసన