ETV Bharat / briefs

నేడు తెరాస కార్యవర్గ సమావేశం

author img

By

Published : Jun 19, 2019, 5:17 AM IST

నేడు తెరాస పార్టీ కార్యవర్గ సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్​లో మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్​ అధ్యక్షతన భేటీ నిర్వహించనున్నారు. సమావేశం అనంతరం కేసీఆర్​ మీడియా సమావేశంలో పలు నిర్ణయాలను వెల్లడించనున్నారు.

నేడు తెరాస కార్యవర్గ సమావేశం
నేడు తెరాస కార్యవర్గ సమావేశం

ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్​లో తెరాస కార్యవర్గ సమావేశం జరగనుంది. పార్టీ అధినేత కేసీఆర్​ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో... తెరాస సభ్యత్వ నమోదు, జిల్లా, రాష్ట్ర కార్యవర్గాల పునర్వ్యవస్థీకరణ, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం తదితర అంశాలపై చర్చించనున్నారు.

ఈనెల 27లోగా భూమి పూజ

రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు స్థలాన్ని కేటాయిస్తూ నిన్న మంత్రి మండలి తీర్మానం చేసింది. కార్యాలయాల నిర్మాణానికి ఈనెల 27లోగా భూమి పూజ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న మున్సిపాల్టీల ఎన్నికలకు కూడా పార్టీ శ్రేణులను సిద్ధం చేసే దిశగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.

ఇదీ చూడండి : 'కాళేశ్వరం ప్రారంభోత్సవానికి 5 హెలిక్యాప్టర్​లు'

నేడు తెరాస కార్యవర్గ సమావేశం

ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్​లో తెరాస కార్యవర్గ సమావేశం జరగనుంది. పార్టీ అధినేత కేసీఆర్​ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో... తెరాస సభ్యత్వ నమోదు, జిల్లా, రాష్ట్ర కార్యవర్గాల పునర్వ్యవస్థీకరణ, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం తదితర అంశాలపై చర్చించనున్నారు.

ఈనెల 27లోగా భూమి పూజ

రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు స్థలాన్ని కేటాయిస్తూ నిన్న మంత్రి మండలి తీర్మానం చేసింది. కార్యాలయాల నిర్మాణానికి ఈనెల 27లోగా భూమి పూజ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న మున్సిపాల్టీల ఎన్నికలకు కూడా పార్టీ శ్రేణులను సిద్ధం చేసే దిశగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.

ఇదీ చూడండి : 'కాళేశ్వరం ప్రారంభోత్సవానికి 5 హెలిక్యాప్టర్​లు'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.