ETV Bharat / briefs

ఎన్నికల అధికారికి రేణుకా చౌదరి ఫిర్యాదు

author img

By

Published : Apr 8, 2019, 8:00 PM IST

ఖమ్మంలోని ఓ హోటల్​లో తమ బంధువులు బస చేసిన గదులపై దాడులు చేశారని... మహిళలనే గౌరవం లేకుండా ప్రవర్తించారంటూ ఖమ్మం ఎంపీ కాంగ్రెస్​ అభ్యర్థి రేణుకా చౌదరి స్థానిక ఎన్నికల రిటర్నింగ్​ అధికారికి ఫిర్యాదు చేశారు.

ఖమ్మంలో మాట్లాడుతున్న రేణుకా చౌదరి

అప్రజాస్వామిక విధానాలతో నియంతలా వ్యవహరిస్తూ... దాడులతో ప్రతిపక్ష పార్టీలను బెదిరిస్తున్నారంటూ సీఎం కేసీఆర్​పై ఖమ్మం ఎంపీ కాంగ్రెస్​ అభ్యర్థి రేణుకా చౌదరి తీవ్రంగా మండిపడ్డారు. ఖమ్మంలోని ఓ హోటల్​లో తమ బంధువులు బస చేసిన గదులపై దాడులు చేశారని... మహిళలని చూడకుండా ఇష్టానుసారం వ్యవహరించారని విమర్శించారు. ఖమ్మం లోక్​సభ ఎన్నికల రిటర్నింగ్​ అధికారిని కలిసి దాడులపై ఫిర్యాదు చేశారు. ఎన్నికల పరిశీలకులకు కూడా తెలియజేయనున్నట్లు వెల్లడించారు. ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్​ ఇలాంటి బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని రేణుకా ఆరోపించారు. తను ఎవరి బెదిరింపులకు భయపడనని చెప్పారు.

ఖమ్మంలో మాట్లాడుతున్న రేణుకా చౌదరి

ఇదీ చదవండిః ఇందూరు రైతుల పిటిషన్​ విచారణ రెండువారాలకు వాయిదా

అప్రజాస్వామిక విధానాలతో నియంతలా వ్యవహరిస్తూ... దాడులతో ప్రతిపక్ష పార్టీలను బెదిరిస్తున్నారంటూ సీఎం కేసీఆర్​పై ఖమ్మం ఎంపీ కాంగ్రెస్​ అభ్యర్థి రేణుకా చౌదరి తీవ్రంగా మండిపడ్డారు. ఖమ్మంలోని ఓ హోటల్​లో తమ బంధువులు బస చేసిన గదులపై దాడులు చేశారని... మహిళలని చూడకుండా ఇష్టానుసారం వ్యవహరించారని విమర్శించారు. ఖమ్మం లోక్​సభ ఎన్నికల రిటర్నింగ్​ అధికారిని కలిసి దాడులపై ఫిర్యాదు చేశారు. ఎన్నికల పరిశీలకులకు కూడా తెలియజేయనున్నట్లు వెల్లడించారు. ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్​ ఇలాంటి బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని రేణుకా ఆరోపించారు. తను ఎవరి బెదిరింపులకు భయపడనని చెప్పారు.

ఖమ్మంలో మాట్లాడుతున్న రేణుకా చౌదరి

ఇదీ చదవండిః ఇందూరు రైతుల పిటిషన్​ విచారణ రెండువారాలకు వాయిదా

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.