ETV Bharat / briefs

ప్రచారంలోనూ చంద్రబాబు ట్రెండ్ సెట్టర్

ముఖ్యమంత్రి చంద్రబాబు.. సీఎంగానే కాదు.. టెక్ గురూగానూ కనిపిస్తారు. ఆయన ఆలోచలన్నీ హైటెక్​ రేంజులోనే ఉంటాయి. టెక్నాలజీ విస్తరిస్తున్న తొలిదశలోనే హెదరాబాద్ నగరాన్ని నాలెడ్జ్ సెంటర్​గా మలిచేందుకు శ్రమించారు. ఆ విజనే ఆయన్ను అందరిలోకి సెపరేట్​గా నిలిపింది. ఇప్పుడు ప్రచారంలోనూ బాబు ట్రెండ్ సెట్టర్​గా నిలుస్తున్నారు. హై టెక్నాలజీ వాడుతూ అందరిని ఔరా అనిపిస్తున్నారు. ఇంటింటి ప్రచారంతోపాటు నెట్టింటి ప్రచారంతో దూసుకుపోతున్నారు.

author img

By

Published : Mar 29, 2019, 4:14 PM IST

ట్రెండ్​ సృష్టిస్తా..
ట్రెండ్​ సృష్టిస్తా..
చంద్రబాబు..టెక్నాలజీ...ఈ రెండు పేర్లు నాణానికి బొమ్మాబొరుసు. సాంకేతికతను వాడకంలో ఆయనకు ఆయనే సాటి. ఆలోచనల్లో ఆయన పదేళ్ల ముందుంటారు. ఒక్కోసారి బాబును చూస్తే టెక్నాలజీతో అవినాభావ సంబంధముందేమో అనిపిస్తోంది. అప్పట్లో కంప్యూటర్ విప్లవాన్ని ముందే గ్రహించి సాఫ్ట్​వేర్​కి పెద్దపీట వేశారు. హైటెక్​ బాబుగా కీర్తి గడించారు.

అదిరిందయ్యా చంద్రం
ఈ ఎన్నికల ప్రచారంలోనూ ట్రెండ్ సెట్టర్​గా మారిపోయారు చంద్రబాబు. పాతకాలం నాటి మైక్​ను పక్కనపడేసి పాప్ హెడ్​తో కొత్తగా కనిపిస్తున్నారు. కేవలం చెవిలో మైక్ పెట్టుకుని తన హావభావాలు, ముఖ కవలికలతో ఓటర్లతో కనెక్ట్ అవుతున్నారు. కంటెంట్ జనాలకు చేరేలా మ్యాజిక్ చేస్తున్నారాయన. తాను చెప్పాల్సినది సూటిగా చెప్తున్నారు. తన ప్రసంగానికి ప్రాసలు, పంచ్‌లూ జత చేసి ఆకట్టుకుంటున్నారు.

నెట్టింటి ప్రచారం
అంతేనా..ఇంటింటి ప్రచారంతో పాటు నెట్టింటి ప్రచారం షురూ చేశారు. నినాదాలే కవర్ పేజీలుగా ఫేస్​బుక్​, ట్విట్టర్​లో పార్టీ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2009 నుంచి చంద్రబాబు సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఈ మధ్య ట్వీట్లతో ఫాలోవర్లకు టచ్​లో ఉంటున్నారు. ప్రచారంలో డైలాగులు, సంక్షేమ పథకాలను తెలుగులో పోస్ట్ చేస్తున్నారు. వైకాపాపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కేంద్రాన్ని టార్గెట్ చేసేప్పుడు మాత్రం ఇంగ్లీష్‌ ఉపయోగిస్తున్నారు.

అన్నింటికీ టెక్నాలజీనే
ప్రజల్లోకి వెళ్లడానికే పార్టీ నేతలతో అనుసంధానికీ ఆయన టెక్నాలజీనే వాడతారు. 20ఏళ్ల క్రితం ముఖ్యమంత్రిగా టెలీకాన్ఫరెన్స్ ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత అధికారంలో లేనప్పుడు పార్టీ కార్యకలాపాలకు కూడా సాంకేతికతను వాడారు. ఇప్పటికీ తెదేపా కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్.. వీడియో కాన్ఫరెన్స్​లతో దగ్గరగా ఉంటారు. పార్టీ అభ్యర్థుల ఎంపిక కూడా IVRS విధానంలో చేపట్టారు. ముఖ్యమైన కార్యకర్తలకు స్మార్ట్​ఫోన్లు ఇచ్చి ప్రత్యేక యాప్​ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యకలాపాలన్నింటినీ కంప్యూటరీకరించారు. ఈ దఫా ముఖ్యమంత్రి అయ్యాక.. ప్రభుత్వాన్నే పేపర్​లెస్​గా మార్చేశారు. దాదాపు నాలుగేళ్లుగా మంత్రివర్గ సమావేశాలన్నీ ఫైళ్లు.. పేపర్లు లేకుండానే జరుగుతున్నాయి.

ఇవీ చూడండి: పాలమూరు ప్రజలందరికీ నమస్సుమాంజలి: మోదీ

ట్రెండ్​ సృష్టిస్తా..
చంద్రబాబు..టెక్నాలజీ...ఈ రెండు పేర్లు నాణానికి బొమ్మాబొరుసు. సాంకేతికతను వాడకంలో ఆయనకు ఆయనే సాటి. ఆలోచనల్లో ఆయన పదేళ్ల ముందుంటారు. ఒక్కోసారి బాబును చూస్తే టెక్నాలజీతో అవినాభావ సంబంధముందేమో అనిపిస్తోంది. అప్పట్లో కంప్యూటర్ విప్లవాన్ని ముందే గ్రహించి సాఫ్ట్​వేర్​కి పెద్దపీట వేశారు. హైటెక్​ బాబుగా కీర్తి గడించారు.

అదిరిందయ్యా చంద్రం
ఈ ఎన్నికల ప్రచారంలోనూ ట్రెండ్ సెట్టర్​గా మారిపోయారు చంద్రబాబు. పాతకాలం నాటి మైక్​ను పక్కనపడేసి పాప్ హెడ్​తో కొత్తగా కనిపిస్తున్నారు. కేవలం చెవిలో మైక్ పెట్టుకుని తన హావభావాలు, ముఖ కవలికలతో ఓటర్లతో కనెక్ట్ అవుతున్నారు. కంటెంట్ జనాలకు చేరేలా మ్యాజిక్ చేస్తున్నారాయన. తాను చెప్పాల్సినది సూటిగా చెప్తున్నారు. తన ప్రసంగానికి ప్రాసలు, పంచ్‌లూ జత చేసి ఆకట్టుకుంటున్నారు.

నెట్టింటి ప్రచారం
అంతేనా..ఇంటింటి ప్రచారంతో పాటు నెట్టింటి ప్రచారం షురూ చేశారు. నినాదాలే కవర్ పేజీలుగా ఫేస్​బుక్​, ట్విట్టర్​లో పార్టీ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2009 నుంచి చంద్రబాబు సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఈ మధ్య ట్వీట్లతో ఫాలోవర్లకు టచ్​లో ఉంటున్నారు. ప్రచారంలో డైలాగులు, సంక్షేమ పథకాలను తెలుగులో పోస్ట్ చేస్తున్నారు. వైకాపాపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కేంద్రాన్ని టార్గెట్ చేసేప్పుడు మాత్రం ఇంగ్లీష్‌ ఉపయోగిస్తున్నారు.

అన్నింటికీ టెక్నాలజీనే
ప్రజల్లోకి వెళ్లడానికే పార్టీ నేతలతో అనుసంధానికీ ఆయన టెక్నాలజీనే వాడతారు. 20ఏళ్ల క్రితం ముఖ్యమంత్రిగా టెలీకాన్ఫరెన్స్ ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత అధికారంలో లేనప్పుడు పార్టీ కార్యకలాపాలకు కూడా సాంకేతికతను వాడారు. ఇప్పటికీ తెదేపా కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్.. వీడియో కాన్ఫరెన్స్​లతో దగ్గరగా ఉంటారు. పార్టీ అభ్యర్థుల ఎంపిక కూడా IVRS విధానంలో చేపట్టారు. ముఖ్యమైన కార్యకర్తలకు స్మార్ట్​ఫోన్లు ఇచ్చి ప్రత్యేక యాప్​ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యకలాపాలన్నింటినీ కంప్యూటరీకరించారు. ఈ దఫా ముఖ్యమంత్రి అయ్యాక.. ప్రభుత్వాన్నే పేపర్​లెస్​గా మార్చేశారు. దాదాపు నాలుగేళ్లుగా మంత్రివర్గ సమావేశాలన్నీ ఫైళ్లు.. పేపర్లు లేకుండానే జరుగుతున్నాయి.

ఇవీ చూడండి: పాలమూరు ప్రజలందరికీ నమస్సుమాంజలి: మోదీ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.