దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్ భవన్లోని పరిపాలన విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కొవిడ్-19ను కట్టడి చేయడంలో భాగంగా థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లు వాడుతున్నప్పటికీ... హైదరాబాద్ భవన్లో పనిచేసే ఉద్యోగికి పాజిటివ్ రావడం అధికారులను విస్మయానికి గురిచేసింది.
ఈ వార్తతో... హైదరాబాద్ భవన్ను పూర్తిగా శానిటైజేషన్ చేస్తున్నారు. నాలుగు రోజులపాటు మూసివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తిరిగి సోమవారం నుంచి హైదరాబాద్ భవన్ లో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.