ETV Bharat / bharat

ఎల్లో ఫంగస్ వ్యాప్తి..​ యూపీ​లో తొలి కేసు - yellow fungus case in india

దేశంలో తొలిసారిగా ఉత్తర్​ప్రదేశ్​లోని గాజియాబాద్​లో ఎల్లో ఫంగస్​ కేసు నమోదైంది. సంజయ్​ నగర్​కు చెందిన 45ఏళ్ల వ్యక్తి శరీరంలో ఎల్లో ఫంగస్​ను గుర్తించినట్లు హర్ష ఈఎన్​టీ ఆస్పత్రి వైద్యులు డాక్టర్​ బీపీ త్యాగి తెలిపారు. ఈ వ్యాధి బ్లాక్​, వైట్ ఫంగస్​ల కన్నా ప్రమాదకరమన్నారు.

ghaziabad
యెల్లో ఫంగస్​
author img

By

Published : May 24, 2021, 2:05 PM IST

Updated : May 24, 2021, 4:45 PM IST

దేశంలో బ్లాక్​, వైట్​ ఫంగస్​లు క్రమంగా విస్తరిస్తున్న వేళ ఉత్తర్​ప్రదేశ్​లోని గాజియాబాద్​లో తొలిసారిగా ఎల్లో ఫంగస్​ కేసు నమోదైంది. దేశంలో ఇదే మొట్టమొదటి ఎల్లో ఫంగస్​ కేసు. సంజయ్​ నగర్​కు చెందిన 45ఏళ్ల వ్యక్తి శరీరంలో ఈ ఫంగస్​ను గుర్తించారు హర్ష ఈఎన్​టీ ఆస్పత్రి వైద్యులు డాక్టర్​ బీపీ త్యాగి. ఇతర ఫంగస్​ల కంటే ఈ వ్యాధి ప్రమాదకరమైనదని తెలిపారు. సిటీ స్కాన్‌లో.. అతడి సైనస్‌ సాధారణంగానే ఉందని, ఎండోస్కోపీలో మాత్రం.. రోగిలో బ్లాక్‌, వైట్‌, ఎల్లో ఫంగన్‌ను గుర్తించామని వివరించారు. ఎల్లో ఫంగస్‌ సహజంగా భూమి మీద పాకే జంతువుల్లో ఉంటుందని, మనుషుల్లో తొలిసారి గుర్తించామని పేర్కొన్నారు.

లక్షణాలు..

ఎల్లో ఫంగస్‌ సోకిన వ్యక్తికి విపరీతమైన నీరసం, ఆకలి బాగా తగ్గిపోవడం లేదా అసలు ఆకలి లేకపోవడం, క్రమంగా బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. తీవ్రత ఎక్కువగా ఉన్న కేసుల్లో గాయాలు త్వరగా తగ్గకపోవడం, వాటి నుంచి చీము కారడం, శరీరంలోని కీలక అవయవాలు విఫలం కావడం, కళ్లు పీక్కుపోవడం వంటి లక్షణాలు ఉంటాయని తెలిపారు. ఎల్లో ఫంగస్‌ సమస్య శరీరం లోపల ప్రారంభం అవుతుందని, లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నారు.

ఎల్లో ఫంగస్‌ ప్రధానంగా వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రతను పాటించకపోవడం వల్ల వస్తుందని భావిస్తున్నారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, ఫంగస్‌ చేరే అవకాశం ఉన్న, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు పడేయడం ఉత్తమమని చెబుతున్నారు. ఎల్లో ఫంగస్‌ చికిత్సకు ప్రస్తుతం ఆంఫోటెరిసిన్‌-బీ ఇంజక్షన్‌ ఒక్కటే ఉందని తెలిపారు.

కేరళలో నలుగురు..

కేరళలో మ్యూకర్​మైకోసిస్​( బ్లాక్​ ఫంగస్​) బారిన పడి మరో నలుగురు ఆదివారం మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు ఎర్నాకుళం, మరో ఇద్దరు పతనంతిట్టకు చెందిన వారుగా అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి : కుక్కల నుంచి మనుషులకు కరోనా.. నిజమేనా?

దేశంలో బ్లాక్​, వైట్​ ఫంగస్​లు క్రమంగా విస్తరిస్తున్న వేళ ఉత్తర్​ప్రదేశ్​లోని గాజియాబాద్​లో తొలిసారిగా ఎల్లో ఫంగస్​ కేసు నమోదైంది. దేశంలో ఇదే మొట్టమొదటి ఎల్లో ఫంగస్​ కేసు. సంజయ్​ నగర్​కు చెందిన 45ఏళ్ల వ్యక్తి శరీరంలో ఈ ఫంగస్​ను గుర్తించారు హర్ష ఈఎన్​టీ ఆస్పత్రి వైద్యులు డాక్టర్​ బీపీ త్యాగి. ఇతర ఫంగస్​ల కంటే ఈ వ్యాధి ప్రమాదకరమైనదని తెలిపారు. సిటీ స్కాన్‌లో.. అతడి సైనస్‌ సాధారణంగానే ఉందని, ఎండోస్కోపీలో మాత్రం.. రోగిలో బ్లాక్‌, వైట్‌, ఎల్లో ఫంగన్‌ను గుర్తించామని వివరించారు. ఎల్లో ఫంగస్‌ సహజంగా భూమి మీద పాకే జంతువుల్లో ఉంటుందని, మనుషుల్లో తొలిసారి గుర్తించామని పేర్కొన్నారు.

లక్షణాలు..

ఎల్లో ఫంగస్‌ సోకిన వ్యక్తికి విపరీతమైన నీరసం, ఆకలి బాగా తగ్గిపోవడం లేదా అసలు ఆకలి లేకపోవడం, క్రమంగా బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. తీవ్రత ఎక్కువగా ఉన్న కేసుల్లో గాయాలు త్వరగా తగ్గకపోవడం, వాటి నుంచి చీము కారడం, శరీరంలోని కీలక అవయవాలు విఫలం కావడం, కళ్లు పీక్కుపోవడం వంటి లక్షణాలు ఉంటాయని తెలిపారు. ఎల్లో ఫంగస్‌ సమస్య శరీరం లోపల ప్రారంభం అవుతుందని, లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నారు.

ఎల్లో ఫంగస్‌ ప్రధానంగా వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రతను పాటించకపోవడం వల్ల వస్తుందని భావిస్తున్నారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, ఫంగస్‌ చేరే అవకాశం ఉన్న, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు పడేయడం ఉత్తమమని చెబుతున్నారు. ఎల్లో ఫంగస్‌ చికిత్సకు ప్రస్తుతం ఆంఫోటెరిసిన్‌-బీ ఇంజక్షన్‌ ఒక్కటే ఉందని తెలిపారు.

కేరళలో నలుగురు..

కేరళలో మ్యూకర్​మైకోసిస్​( బ్లాక్​ ఫంగస్​) బారిన పడి మరో నలుగురు ఆదివారం మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు ఎర్నాకుళం, మరో ఇద్దరు పతనంతిట్టకు చెందిన వారుగా అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి : కుక్కల నుంచి మనుషులకు కరోనా.. నిజమేనా?

Last Updated : May 24, 2021, 4:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.