ETV Bharat / bharat

ఇద్దరు కూతుళ్లను సజీవదహనం చేసిన తల్లి.. 7నెలల చిన్నారిని బావిలో పడేసి!

author img

By

Published : Jun 22, 2023, 9:33 AM IST

Woman Burns Daughters Alive : ఓ మహిళ తన ఇద్దరు కూమార్తెలకు నిప్పంటించి సజీవ దహనం చేసింది. అనంతరం తాను కూడా నిప్పు అంటించుకుంది. ఈ ఘటన బిహార్​లో జరిగింది. మరోవైపు, ఝార్ఖండ్​లో ఏడు నెలల తన కుమార్తెను బావిలో పడేసింది ఓ మహిళ.

Woman Burns Daughters Alive
Woman Burns Daughters Alive

Woman Burns Daughters Alive : బిహార్​లోని నవాదా జిల్లాలో ఓ మహిళ.. రెండు, ఎనిమిదేళ్ల వయసున్న తన ఇద్దరు కుమార్తెలను సజీవ దహనం చేసింది. అనంతరం తాను కూడా నిప్పు అంటించుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నమ్​దర్​గంజ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఓ మహిళ తన కుటుంబంతో నివసిస్తోంది. ఆమెకు 2, 8 ఏళ్ల వయసు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గ్యాస్​ సిలిండర్​ను.. స్టవ్​ నుంచి వేరు చేసి.. మరొక గదిలోకి తీసుకెళ్లింది. అనంతరం తన ఇద్దరు కుమార్తెలకు నిప్పంటించింది. అనంతరం తాను కూడా నిప్పుపెట్టుకుంది. ఇంటిలోంచి ఎగసిపడుతున్న మంటలను గమనించిన స్థానికులు.. షాట్​ సర్క్యూట్​తో అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు అసలు విషయం తెలిసింది.

మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్​డీపీఓ పంకజ్​ కుమార్​ స్పందించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆ మహిళే తన ఇద్దరు కుమార్తెలకు నిప్పు అంటించిందని తెలిపారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి అసలు కారణం ఇంకా తెలియలేదని.. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత విషయం తెలుస్తుందని చెప్పారు. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

7 నెలల పసికందును బావిలో పడేసిన తల్లి..
ఝార్ఖండ్​లోని గిరిడి జిల్లాలో ఓ కన్న తల్లి ఏడు నెలల చిన్నారిని బావిలో పడేసింది. ఈ విషయం తెలిసిన స్థానికులు ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గవాన్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని తెరాయ్​ ప్రాంతానికి చెందిన అనుజ్​ యాదవ్ దిల్లీలో పనిచేస్తున్నాడు. అతడికి భార్య పాపలా దేవి, ఏడు నెలల కుమార్తె ఉన్నారు. కొద్ది రోజుల క్రితం అనూజ్​ తల్లి చనిపోయింది. దీంతో నిందితురాలు తన ఏడు నెలల చిన్నారితో ఇంట్లో ఉంటోంది. బుధవారం ఒంటరిగా ఇంటివైపు వస్తున్న పాపలా దేవిని.. గమనించిన స్థానికుడొకరు.. 'నీ కుమార్తె ఏది' అని అడిగాడు. దీనికి.. బావిలో పడేసినట్లు చెప్పింది నిందుతురాలు. దీంతో స్థానికులు ఆ మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసున్నారు. గ్రామస్థుల సహాయంతో చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని డీఎస్పీ సంజయన్ రాణా తెలిపారు.

Woman through daughter in well
కుమార్తెను బావిలో పడేసిన మహిళ

పిడుగుపాటుకు ఏడుగురు బలి..
బంగాల్​లోని మాల్దా జిల్లాలో పిడుగుపాటుకు గురై ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మృతిచెందారు. 9 పశువులు కూడా చనిపోయినట్లు గురువారం అధికారులు తెలిపారు. మృతులను కృష్ణో చౌదరి (65), ఉమ్మి కుల్సుం (6), దెబొశ్రీ మండల్​ (27), సోమిత్ మండల్ (10), నజ్రుల్​ ఎస్​కే (32), రోబిజాన్​ బీబీ (54), ఏసా సర్కార్ (8)గా గుర్తించారు. ఓల్డ్​ మాల్దాలో ఒకరు చనిపోగా.. కాలియాచక్​ ప్రాంతలో మిగతా వారు మృతిచెందినట్లు డీఎమ్​ తెలిపారు. ఈ మేరకు డిస్ట్రిక్ట్​ మేజిస్ట్రేట్​ నితిన్ సింఘానియా వివరాలు వెల్లడించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించామని తెలిపారు.

మండుతున్న ఎండలు.. నలుగురు మృతి..
ఉత్తర్​ప్రదేశ్​లోని గోరఖ్​పుర్​ జిల్లాలో వడదెబ్బతో నలుగురు మృతిచెందారు. ఈ మేరకు గోరఖ్​పుర్​ జిల్లా ఆస్పత్రి చీఫ్​ మెడికల్​ సూపరింటెండెంట్ డాక్టర్​ రాజేంద్ర ఠకూర్​​ మరణాలను ధ్రువీకరించారు. ఎండ తీవ్రత పెరుగుతండటం వల్ల.. రోగుల సంఖ్య ఎక్కువ అవుతుందని ఆస్పత్రుల్లో బెడ్లు కూడా పెంచామని తెలిపారు. ఇక, ఎండల తీవ్రత కారణంగా సీహెచ్​సీ (కమ్యూనిటీ హెల్త్​ సెంటర్), పీహెచ్​సీ (ప్రైమరీ హెల్త్​ సెంటర్)లలో సౌకర్యాలు పెంచామని.. వడదెబ్బ బాధితులకు చికిత్స అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని సీఎమ్​ఓ డాక్టర్​ అశుతోశ్​ కుమార్​ దుబే తెలిపారు. ప్రజల జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

Woman Burns Daughters Alive : బిహార్​లోని నవాదా జిల్లాలో ఓ మహిళ.. రెండు, ఎనిమిదేళ్ల వయసున్న తన ఇద్దరు కుమార్తెలను సజీవ దహనం చేసింది. అనంతరం తాను కూడా నిప్పు అంటించుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నమ్​దర్​గంజ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఓ మహిళ తన కుటుంబంతో నివసిస్తోంది. ఆమెకు 2, 8 ఏళ్ల వయసు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గ్యాస్​ సిలిండర్​ను.. స్టవ్​ నుంచి వేరు చేసి.. మరొక గదిలోకి తీసుకెళ్లింది. అనంతరం తన ఇద్దరు కుమార్తెలకు నిప్పంటించింది. అనంతరం తాను కూడా నిప్పుపెట్టుకుంది. ఇంటిలోంచి ఎగసిపడుతున్న మంటలను గమనించిన స్థానికులు.. షాట్​ సర్క్యూట్​తో అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు అసలు విషయం తెలిసింది.

మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్​డీపీఓ పంకజ్​ కుమార్​ స్పందించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆ మహిళే తన ఇద్దరు కుమార్తెలకు నిప్పు అంటించిందని తెలిపారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి అసలు కారణం ఇంకా తెలియలేదని.. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత విషయం తెలుస్తుందని చెప్పారు. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

7 నెలల పసికందును బావిలో పడేసిన తల్లి..
ఝార్ఖండ్​లోని గిరిడి జిల్లాలో ఓ కన్న తల్లి ఏడు నెలల చిన్నారిని బావిలో పడేసింది. ఈ విషయం తెలిసిన స్థానికులు ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గవాన్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని తెరాయ్​ ప్రాంతానికి చెందిన అనుజ్​ యాదవ్ దిల్లీలో పనిచేస్తున్నాడు. అతడికి భార్య పాపలా దేవి, ఏడు నెలల కుమార్తె ఉన్నారు. కొద్ది రోజుల క్రితం అనూజ్​ తల్లి చనిపోయింది. దీంతో నిందితురాలు తన ఏడు నెలల చిన్నారితో ఇంట్లో ఉంటోంది. బుధవారం ఒంటరిగా ఇంటివైపు వస్తున్న పాపలా దేవిని.. గమనించిన స్థానికుడొకరు.. 'నీ కుమార్తె ఏది' అని అడిగాడు. దీనికి.. బావిలో పడేసినట్లు చెప్పింది నిందుతురాలు. దీంతో స్థానికులు ఆ మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసున్నారు. గ్రామస్థుల సహాయంతో చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని డీఎస్పీ సంజయన్ రాణా తెలిపారు.

Woman through daughter in well
కుమార్తెను బావిలో పడేసిన మహిళ

పిడుగుపాటుకు ఏడుగురు బలి..
బంగాల్​లోని మాల్దా జిల్లాలో పిడుగుపాటుకు గురై ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మృతిచెందారు. 9 పశువులు కూడా చనిపోయినట్లు గురువారం అధికారులు తెలిపారు. మృతులను కృష్ణో చౌదరి (65), ఉమ్మి కుల్సుం (6), దెబొశ్రీ మండల్​ (27), సోమిత్ మండల్ (10), నజ్రుల్​ ఎస్​కే (32), రోబిజాన్​ బీబీ (54), ఏసా సర్కార్ (8)గా గుర్తించారు. ఓల్డ్​ మాల్దాలో ఒకరు చనిపోగా.. కాలియాచక్​ ప్రాంతలో మిగతా వారు మృతిచెందినట్లు డీఎమ్​ తెలిపారు. ఈ మేరకు డిస్ట్రిక్ట్​ మేజిస్ట్రేట్​ నితిన్ సింఘానియా వివరాలు వెల్లడించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించామని తెలిపారు.

మండుతున్న ఎండలు.. నలుగురు మృతి..
ఉత్తర్​ప్రదేశ్​లోని గోరఖ్​పుర్​ జిల్లాలో వడదెబ్బతో నలుగురు మృతిచెందారు. ఈ మేరకు గోరఖ్​పుర్​ జిల్లా ఆస్పత్రి చీఫ్​ మెడికల్​ సూపరింటెండెంట్ డాక్టర్​ రాజేంద్ర ఠకూర్​​ మరణాలను ధ్రువీకరించారు. ఎండ తీవ్రత పెరుగుతండటం వల్ల.. రోగుల సంఖ్య ఎక్కువ అవుతుందని ఆస్పత్రుల్లో బెడ్లు కూడా పెంచామని తెలిపారు. ఇక, ఎండల తీవ్రత కారణంగా సీహెచ్​సీ (కమ్యూనిటీ హెల్త్​ సెంటర్), పీహెచ్​సీ (ప్రైమరీ హెల్త్​ సెంటర్)లలో సౌకర్యాలు పెంచామని.. వడదెబ్బ బాధితులకు చికిత్స అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని సీఎమ్​ఓ డాక్టర్​ అశుతోశ్​ కుమార్​ దుబే తెలిపారు. ప్రజల జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.