ETV Bharat / bharat

'పెగాసస్​ గుట్టు తేల్చేందుకు విచారణ కమిషన్' - పెగాసస్ విచారణ కమిషన్ బంగాల్

పెగాసస్​ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టేందుకు విచారణ కమిషన్​ను ఏర్పాటు చేస్తున్నట్లు బంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ పని కేంద్రమే చేయాల్సిందని పేర్కొన్నారు.

pegasus enquiry commission
పెగాసస్ విచారణ కమిషన్
author img

By

Published : Jul 26, 2021, 2:03 PM IST

పెగాసస్ నిఘా వ్యవహారంపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు బంగాల్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు.

దీనిపై కేంద్ర ప్రభుత్వమే కమిషన్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టాల్సిందని దీదీ అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై మోదీ సర్కారు మౌనంగా ఉండిపోయిందని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేసినట్లు వివరణ ఇచ్చారు.

"పెగాసస్ ద్వారా న్యాయవ్యవస్థ, పౌర సమాజంతో పాటు ప్రతి ఒక్కరినీ నిఘా నీడలో ఉంచారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తుందని భావించాం. కానీ వారు అలా చేయలేదు. పెగాసస్​పై దర్యాప్తు ప్రారంభించిన తొలి రాష్ట్రం బంగాల్. రాష్ట్రానికి చెందిన కొందరి పేర్లు పెగాసస్ లక్షిత జాబితాలో ఉన్నాయి. చట్టవిరుద్ధంగా హ్యాకింగ్​కు పాల్పడటంపై కమిషన్ విచారణ చేపడుతుంది."

-మమతా బెనర్జీ, బంగాల్ సీఎం

ఈ కమిషన్​లో.. కలకత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయ్ భట్టాచార్య, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బీ లోకూర్​ సభ్యులుగా ఉన్నారు.

ఇవీ చదవండి:

పెగాసస్ నిఘా వ్యవహారంపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు బంగాల్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు.

దీనిపై కేంద్ర ప్రభుత్వమే కమిషన్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టాల్సిందని దీదీ అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై మోదీ సర్కారు మౌనంగా ఉండిపోయిందని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేసినట్లు వివరణ ఇచ్చారు.

"పెగాసస్ ద్వారా న్యాయవ్యవస్థ, పౌర సమాజంతో పాటు ప్రతి ఒక్కరినీ నిఘా నీడలో ఉంచారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తుందని భావించాం. కానీ వారు అలా చేయలేదు. పెగాసస్​పై దర్యాప్తు ప్రారంభించిన తొలి రాష్ట్రం బంగాల్. రాష్ట్రానికి చెందిన కొందరి పేర్లు పెగాసస్ లక్షిత జాబితాలో ఉన్నాయి. చట్టవిరుద్ధంగా హ్యాకింగ్​కు పాల్పడటంపై కమిషన్ విచారణ చేపడుతుంది."

-మమతా బెనర్జీ, బంగాల్ సీఎం

ఈ కమిషన్​లో.. కలకత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయ్ భట్టాచార్య, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బీ లోకూర్​ సభ్యులుగా ఉన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.