ETV Bharat / bharat

మోదీతో దీదీ భేటీ- కీలకాంశాలపై చర్చ - Mamata Banerjee

ప్రధాని నరేంద్ర మోదీతో బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిల్లీలో సమావేశమయ్యారు. బంగాల్ వాటాగా రావాల్సిన టీకాలపై చర్చించినట్లు దీదీ చెప్పారు.

Mamata Banerjee met Prime Minister Narendra Modi
మోదీతో దీదీ సమావేశం
author img

By

Published : Jul 27, 2021, 5:19 PM IST

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీతో దిల్లీలో భేటీ అయ్యారు. కరోనా టీకాలపై ప్రధానంగా చర్చించినట్లు దీదీ తెలిపారు. జనాభా దామాషా ప్రకారం బంగాల్​కు మరిన్ని టీకాలు కేటాయించాలని కోరినట్లు పేర్కొన్నారు.

కరోనా మూడో వేవ్​కు కంటే ముందుగా వ్యాక్సిన్​లను పంపిణీ చేయాలని ప్రధానికి సూచించినట్లు మమత తెలిపారు. మోదీ సానుకూలంగా స్పందించినట్లు చెప్పుకొచ్చారు.

సుమారు 30 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో పెగాసస్ వ్యవహారంపై కూడా ఇరువురు చర్చించినట్లు మమత వివరించారు. దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని దీదీ కోరినట్లు తెలిపారు.

బుధవారం కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీని బంగాల్​ సీఎం కలవనున్నారు.

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీతో దిల్లీలో భేటీ అయ్యారు. కరోనా టీకాలపై ప్రధానంగా చర్చించినట్లు దీదీ తెలిపారు. జనాభా దామాషా ప్రకారం బంగాల్​కు మరిన్ని టీకాలు కేటాయించాలని కోరినట్లు పేర్కొన్నారు.

కరోనా మూడో వేవ్​కు కంటే ముందుగా వ్యాక్సిన్​లను పంపిణీ చేయాలని ప్రధానికి సూచించినట్లు మమత తెలిపారు. మోదీ సానుకూలంగా స్పందించినట్లు చెప్పుకొచ్చారు.

సుమారు 30 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో పెగాసస్ వ్యవహారంపై కూడా ఇరువురు చర్చించినట్లు మమత వివరించారు. దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని దీదీ కోరినట్లు తెలిపారు.

బుధవారం కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీని బంగాల్​ సీఎం కలవనున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.