ETV Bharat / bharat

టీఎంసీ మేనిఫెస్టో విడుదల వాయిదా.. కారణమిదే..

బంగాల్​లో తృణమూల్​ కాంగ్రెస్​.. తన ఎన్నికల మేనిఫెస్టో విడుదలను వాయిదా వేసింది. టీఎంసీ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బుధవారం దాడి జరిగిన నేపథ్యంలో.. ఆ పార్టీ వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

author img

By

Published : Mar 11, 2021, 11:31 AM IST

Updated : Mar 11, 2021, 12:16 PM IST

TMC defers its manifesto release following attack on Mamata
టీఎంసీ మేనిఫెస్టో విడుదల వాయిదా

బంగాల్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. అధికార తృణమూల్​ కాంగ్రెస్(టీఎంసీ)​ పార్టీ మేనిఫెస్టో విడుదల వాయిదా పడింది. ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై స్పష్టత లేదు. ప్రణాళిక ప్రకారం.. మేనిఫెస్టోను గురువారం ప్రకటించాల్సి ఉండగా.. ఆ పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీపై బుధవారం దుండగులు దాడి చేసిన నేపథ్యంలో టీఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది.

నందిగ్రామ్​ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్న దీదీ.. బుధవారం నామినేషన్​ వేశారు. ఈ క్రమంలో అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు తనను నెట్టివేశారని మమత ఆరోపించారు. ఈ ఘటనలో ఆమె ఎడమ కాలి ఎముక, చీలమండలో పగులు వచ్చిందని వైద్యులు వెల్లడించారు. అంతేకాకుండా.. మెడ, కుడి భుజం, మోచేయికి దెబ్బలు తగిలాయని వివరించారు. ఆమె కాలికి ఎంఆర్​ఐ స్కానింగ్​ చేసినట్టు తెలిపిన వైద్యులు.. సీటీ స్కాన్​, ఇతర పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం.. దీదీ ఎస్​ఎస్​కేఎమ్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

294 అసెంబ్లీ స్థానాలున్న బంగాల్​లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.

ఇదీ చదవండి: దీదీ అస్తిత్వ పోరు- టీఎంసీకి 'చావో-రేవో'!

బంగాల్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. అధికార తృణమూల్​ కాంగ్రెస్(టీఎంసీ)​ పార్టీ మేనిఫెస్టో విడుదల వాయిదా పడింది. ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై స్పష్టత లేదు. ప్రణాళిక ప్రకారం.. మేనిఫెస్టోను గురువారం ప్రకటించాల్సి ఉండగా.. ఆ పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీపై బుధవారం దుండగులు దాడి చేసిన నేపథ్యంలో టీఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది.

నందిగ్రామ్​ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్న దీదీ.. బుధవారం నామినేషన్​ వేశారు. ఈ క్రమంలో అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు తనను నెట్టివేశారని మమత ఆరోపించారు. ఈ ఘటనలో ఆమె ఎడమ కాలి ఎముక, చీలమండలో పగులు వచ్చిందని వైద్యులు వెల్లడించారు. అంతేకాకుండా.. మెడ, కుడి భుజం, మోచేయికి దెబ్బలు తగిలాయని వివరించారు. ఆమె కాలికి ఎంఆర్​ఐ స్కానింగ్​ చేసినట్టు తెలిపిన వైద్యులు.. సీటీ స్కాన్​, ఇతర పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం.. దీదీ ఎస్​ఎస్​కేఎమ్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

294 అసెంబ్లీ స్థానాలున్న బంగాల్​లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.

ఇదీ చదవండి: దీదీ అస్తిత్వ పోరు- టీఎంసీకి 'చావో-రేవో'!

Last Updated : Mar 11, 2021, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.