కేరళ సీఎం పినరయి విజయన్పై మండిపడ్డారు విదేశాంగ శాఖ సహాయమంత్రి వీ మురళీధరన్. విజయన్.. 'కొవిడియట్' అని ఘాటుగా విమర్శించారు. ఆయనకు కొవిడ్ సోకినప్పటికీ నిబంధనలను పాటించలేదని ఆరోపించారు.
"కొవిడియట్ అర్థం ఏమిటో మీకు తెలుసు. కరోనా నిబంధనలు ఉల్లంఘించే ముఖ్యమంత్రికీ అదే పదం వర్తిస్తుంది. ఏప్రిల్ 4న కేరళ ముఖ్యమంత్రికి వైరస్ సోకినట్లు కాలికట్ వైద్య కళాశాల వైద్యులు నిర్ధరించారు. అయితే ఎలాంటి కొవిడ్ నిబంధనలు పాటించకుండా.. ఏప్రిల్ 6న జరిగిన ఎన్నికల్లో ఓటు వేశారు."అని మురళీధరన్ పేర్కొన్నారు.
కొవిడ్తో ఈ నెల 8న ఆసుపత్రిలో చేరిన విజయన్.. ఏడు రోజుల తర్వాత జరిపిన పరీక్షల్లో కరోనా నెగిటివ్గా తేలింది. దీంతో ఆయన్ని వైద్యులు డిశ్చార్చ్ చేశారు. అయితే కొవిడ్ నిబంధన వివాదానికి తెరలేపింది. 'ఎవరైనా వైరస్ బారినపడితే.. వారికి 10 రోజుల తర్వాత మళ్లీ పరీక్షలు చేయాలి. కానీ సీఎం విషయంలో ఈ ప్రోటోకాల్ పాటించలేదు' అని ధ్వజమెత్తారు మురళీధరన్.
ఇదీ చూడండి: బంగాల్ భాజపా అధ్యక్షుడిపై ఈసీ ఆంక్షలు