ETV Bharat / bharat

నెమలి ఢీకొని యువకుడు​ మృతి

author img

By

Published : Jul 21, 2021, 10:21 AM IST

Updated : Jul 21, 2021, 11:40 AM IST

నెమలి ఢీకొని స్కూటీపై వెళ్తున్న ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది. మరో ఘటనలో ఉత్తర్​ప్రదేశ్​లో భీకర వర్షాల ధాటికి గోడ కూలి ఆరుగురు మృతి చెందారు. ​

peacock hit biker died
నెమలిని ఢీకొని రైడర్​ మృతి

స్కూటీపై వెళ్తున్న ఓ యువకుడు.. నెమలి ఢీకొని మృతి చెందాడు. కర్ణాటక ఉడుపిలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నెమలి కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

ఏం జరిగింది?

peacock hit biker died
మృతి చెందిన నెమలి
peacock hit person died
మృతుడు అబ్దుల్లా
peacock hit biker died
అబ్దుల్లా స్కూటీ

బెలాపు గ్రామానికి చెందిన అబ్దుల్లా(24).. పాదుబ్దిరికి బైక్​పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో జాతీయ రహదారి 66పై రోడ్డు దాటేందుకు నెమలి యత్నిస్తూ.. అతడి బైక్​ను ఢీకొంది. దాంతో అతని వాహనం నియంత్రణ కోల్పోయింది. స్థానికులు అబ్దుల్లాను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ, అతడు అప్పటికే మృతి చెందాడని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పాదుబిద్రి పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది.

గోడ కూలి ఆరుగురు మృతి

ఉత్తర్​ప్రదేశ్​ సీతాపుర్ జిల్లా​లో రెండు వేర్వేరు ఘటనల్లో గోడ కూలి ఆరుగురు మృతి చెందారు. అక్కడ మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లక్ష్మణ్​పుర్​ గ్రామంలోని ఓ ఇంటి గోడ మంగళవారం అర్ధరాత్రి కూలింది. ఈ ఘటనలో రెండు నెలల చిన్నారి సహా నలుగురు మృతి చెందారు. ఇంట్లోని వారంతా నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

మృతులను లల్లీదేవీ(50), శైలేంద్ర(10)​, శివ(8), మేహక్​(2 నెలలు)గా అధికారులు గుర్తించారు. మరో ఇద్దరు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

మరో ఘటనలో...

బిలౌలీ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి.. ఇంటి గోడ కూలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. శిథిలాలను తొలగించేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి: Bird flu in India: భారత్‌లో తొలి బర్డ్‌ ఫ్లూ మరణం

ఇదీ చూడండి: ఉగ్ర చెర నుంచి విడిపించి.. తల్లిదండ్రుల చెంతకు చేర్చి..

స్కూటీపై వెళ్తున్న ఓ యువకుడు.. నెమలి ఢీకొని మృతి చెందాడు. కర్ణాటక ఉడుపిలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నెమలి కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

ఏం జరిగింది?

peacock hit biker died
మృతి చెందిన నెమలి
peacock hit person died
మృతుడు అబ్దుల్లా
peacock hit biker died
అబ్దుల్లా స్కూటీ

బెలాపు గ్రామానికి చెందిన అబ్దుల్లా(24).. పాదుబ్దిరికి బైక్​పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో జాతీయ రహదారి 66పై రోడ్డు దాటేందుకు నెమలి యత్నిస్తూ.. అతడి బైక్​ను ఢీకొంది. దాంతో అతని వాహనం నియంత్రణ కోల్పోయింది. స్థానికులు అబ్దుల్లాను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ, అతడు అప్పటికే మృతి చెందాడని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పాదుబిద్రి పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది.

గోడ కూలి ఆరుగురు మృతి

ఉత్తర్​ప్రదేశ్​ సీతాపుర్ జిల్లా​లో రెండు వేర్వేరు ఘటనల్లో గోడ కూలి ఆరుగురు మృతి చెందారు. అక్కడ మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లక్ష్మణ్​పుర్​ గ్రామంలోని ఓ ఇంటి గోడ మంగళవారం అర్ధరాత్రి కూలింది. ఈ ఘటనలో రెండు నెలల చిన్నారి సహా నలుగురు మృతి చెందారు. ఇంట్లోని వారంతా నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

మృతులను లల్లీదేవీ(50), శైలేంద్ర(10)​, శివ(8), మేహక్​(2 నెలలు)గా అధికారులు గుర్తించారు. మరో ఇద్దరు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

మరో ఘటనలో...

బిలౌలీ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి.. ఇంటి గోడ కూలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. శిథిలాలను తొలగించేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి: Bird flu in India: భారత్‌లో తొలి బర్డ్‌ ఫ్లూ మరణం

ఇదీ చూడండి: ఉగ్ర చెర నుంచి విడిపించి.. తల్లిదండ్రుల చెంతకు చేర్చి..

Last Updated : Jul 21, 2021, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.