ETV Bharat / bharat

మావోయిస్టులపై పోరులో జవాన్లకు అండగా ఉంటాం: షా

author img

By

Published : Apr 5, 2021, 9:27 AM IST

Updated : Apr 5, 2021, 7:07 PM IST

Union Home Minister Amit Shah will visit today the site where Naxals attacked security personnel at Sukma-Bijapur border in Chhattisgarh
బీజాపుర్ ఎన్​కౌంటర్ ప్రాంతానికి అమిత్​ షా

18:59 April 05

జవాన్లతో షా సమావేశం

ఛత్తీస్​గఢ్​ బీజాపుర్​లోని సీఆర్​పీఎఫ్​ క్యాంపు వద్ద జవాన్లతో హోం మంత్రి అమిత్​ షా సమావేశమయ్యారు.  

జవాన్లు ఎంతో ధైర్య సాహసాలతో పోరాడన్నారు షా. మావోయిస్టు సమస్య వల్లే ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదన్నారు. లోంగిపోవాలనుకునే వారు జనజీవన స్రవంతిలోకి వస్తే స్వాగతిస్తామని పేర్కొన్నారు.    

మావోయిస్టులపై పోరులో జవాన్లకు కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జవాన్ల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు.

14:28 April 05

బీజాపుర్​ ఎన్​కౌంటర్​ సమయంలో కోబ్రా దళానికి చెందిన ఓ జవానును ఎత్తుకెళ్లామన్న నక్సలైట్ల ప్రకటనలో నిజానిజాలు తేల్చేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. 

జవానును కిడ్నాప్ చేశామని ఆదివారం సాయంత్రం బీజాపుర్​కు చెందిన ఓ జర్నలిస్టుకు నక్సలైట్లు ఫోన్​ చేసి చెప్పారు. వారి ప్రకటన నిజమయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని సదరు అధికారి తెలిపారు. ఎన్​కౌంటర్​ జరిగినప్పటి నుంచి కనిపించకుండాపోయిన 210వ కోబ్రా దళ జవాను రాకేశ్వర్ సింగ్​ మిన్హాస్ ఆచూకీ ఇంకా తెలియలేదని వివరించారు. 

13:02 April 05

  • On behalf of PM, & Central govt & the country, I pay tributes to the security personnel who lost their lives in the Naxal attack. The country will always remember their sacrifice for taking the fight against Naxals to a decisive turn: Union Home Minister Amit Shah in Jagdalpur pic.twitter.com/udeqci127C

    — ANI (@ANI) April 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

నక్సల్స్​పై జరిగే పోరాటంలో విజయం సాధిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రం తరఫున బీజాపుర్​ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు తాను నివాళి అర్పిస్తున్నానని తెలిపారు. జవాన్ల త్యాగాలు చిరస్మరణీయం,  వారి త్యాగాలు వృథా కావన్నారు. ఛత్తీస్​గఢ్​లోని ఉన్నతాధికారులతో సమావేశమైన అనంతరం షా మీడియాతో మాట్లాడారు.   

12:05 April 05

  • Chhattisgarh: Union Home Minister Amit Shah and CM Bhupesh Baghel hold a meeting with top officials in Jagdalpur, over the naxal attack in which 14 security personnel lost their lives. pic.twitter.com/sF5FPp4Hr8

    — ANI (@ANI) April 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఛత్తీస్​గఢ్​ జగదల్​పుర్​లోని ఉన్నతాధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు.  ఈ కార్యక్రమంలో ఛత్తీస్​గఢ్​ సీఎం భూపేశ్ బఘేల్​ పాల్గొన్నారు.  

11:19 April 05

  • #WATCH: Union Home Minister Amit Shah and Chhattisgarh Chief Minister Bhupesh Baghel lay wreath at the coffins of 14 security personnel who lost their lives in the Naxal attack, in Jagdalpu pic.twitter.com/fyHZSE6mjG

    — ANI (@ANI) April 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బీజాపుర్ ఎన్​కౌంట​ర్​లో వీర మరణం పొందిన జవాన్లకు నివాళి అర్పించారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. అనంతరం జగదల్​పుర్​లోని ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. గాయపడ్డ జవాన్లను పరామర్శించనున్నారు. ఆ తర్వాత సీర్​పీఎఫ్​ క్యాంపు కార్యాలయాన్ని సందర్శించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

11:13 April 05

ఛత్తీస్​గఢ్ ఎన్​కౌంటర్​లో వీర మరణం పొందిన జవాన్లకు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా పుష్ప గుచ్ఛాలతో నివాళులు అర్పించారు. మరికాసేపట్లో ఉన్నత అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. 

10:46 April 05

  • Chhattisgarh Naxal attack: Wreath-laying ceremony for 14 security personnel to be held in Jagdalpur, Union Home Minister Amit Shah and Chief Minister Bhupesh Baghel to attend the ceremony. pic.twitter.com/JhguqzGi4h

    — ANI (@ANI) April 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మావోయిస్టుల కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్లకు కాసేపట్లో ఛత్తీస్​గఢ్​లోని జగ్​దల్​పుర్​లో కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, ఛత్తీస్​గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ ఘన నివాళులు అర్పించనున్నారు.

10:20 April 05

  • Chhattisgarh: Wreath laying ceremony of soldiers who lost their lives in the Naxal attack at Sukma-Bijapur border, is being held in Bijapur pic.twitter.com/pkXHyZwdEX

    — ANI (@ANI) April 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అధికార లాంఛనాలతో..

మావోయిస్టుల ఘాతుకంతో.. వీర మరణం పొందిన జవాన్లకు భద్రతా దళాలు అంజలి ఘటించాయి. ఛత్తీస్​గఢ్​ బీజాపుర్​లో అమర జవాన్లకు అధికార లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. జవాన్ల పార్థీవ దేహాలపై జాతీయ పతాకాన్ని కప్పి.. పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. 

వీర జవాన్ల కుటుంబీకుల రోదనలు అందరినీ కలచివేస్తున్నాయి. 

09:10 April 05

లైవ్​: బీజాపుర్ ఎన్​కౌంటర్ ప్రాంతానికి అమిత్​ షా

ఛత్తీస్‌గఢ్‌లో బస్తర్ అడవుల్లో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పరిశీలించనున్నారు. మరికాసేపట్లో అక్కడికి చేరుకోనున్నారు.

భద్రతా దళాలపై మావోయిస్టులు దాడి చేసిన ప్రాంతాన్ని ఆయన ఉన్నతాధికారులతో కలిసి పరిశీలిస్తారు. అనంతరం.. నక్సల్స్​ కాల్పుల్లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను పరామర్శించనున్నారు. మారణకాండపై ఇప్పటికే ఉన్నతస్ధాయి సమీక్ష నిర్వహించారు హోం మంత్రి. మావోయిస్టులకు సరైన సమాధానం ఇస్తామని తెలిపారు. 

బీజాపుర్​- సుక్మా జిల్లా సరిహద్దుల్లో జరిగిన మావోయిస్టుల దాడిలో 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 400 మంది నక్సల్స్​ జరిపిన ఈ దాడిలో మరో 30కి పైగా సైనికులు గాయాలపాలయ్యారు.

18:59 April 05

జవాన్లతో షా సమావేశం

ఛత్తీస్​గఢ్​ బీజాపుర్​లోని సీఆర్​పీఎఫ్​ క్యాంపు వద్ద జవాన్లతో హోం మంత్రి అమిత్​ షా సమావేశమయ్యారు.  

జవాన్లు ఎంతో ధైర్య సాహసాలతో పోరాడన్నారు షా. మావోయిస్టు సమస్య వల్లే ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదన్నారు. లోంగిపోవాలనుకునే వారు జనజీవన స్రవంతిలోకి వస్తే స్వాగతిస్తామని పేర్కొన్నారు.    

మావోయిస్టులపై పోరులో జవాన్లకు కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జవాన్ల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు.

14:28 April 05

బీజాపుర్​ ఎన్​కౌంటర్​ సమయంలో కోబ్రా దళానికి చెందిన ఓ జవానును ఎత్తుకెళ్లామన్న నక్సలైట్ల ప్రకటనలో నిజానిజాలు తేల్చేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. 

జవానును కిడ్నాప్ చేశామని ఆదివారం సాయంత్రం బీజాపుర్​కు చెందిన ఓ జర్నలిస్టుకు నక్సలైట్లు ఫోన్​ చేసి చెప్పారు. వారి ప్రకటన నిజమయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని సదరు అధికారి తెలిపారు. ఎన్​కౌంటర్​ జరిగినప్పటి నుంచి కనిపించకుండాపోయిన 210వ కోబ్రా దళ జవాను రాకేశ్వర్ సింగ్​ మిన్హాస్ ఆచూకీ ఇంకా తెలియలేదని వివరించారు. 

13:02 April 05

  • On behalf of PM, & Central govt & the country, I pay tributes to the security personnel who lost their lives in the Naxal attack. The country will always remember their sacrifice for taking the fight against Naxals to a decisive turn: Union Home Minister Amit Shah in Jagdalpur pic.twitter.com/udeqci127C

    — ANI (@ANI) April 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

నక్సల్స్​పై జరిగే పోరాటంలో విజయం సాధిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రం తరఫున బీజాపుర్​ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు తాను నివాళి అర్పిస్తున్నానని తెలిపారు. జవాన్ల త్యాగాలు చిరస్మరణీయం,  వారి త్యాగాలు వృథా కావన్నారు. ఛత్తీస్​గఢ్​లోని ఉన్నతాధికారులతో సమావేశమైన అనంతరం షా మీడియాతో మాట్లాడారు.   

12:05 April 05

  • Chhattisgarh: Union Home Minister Amit Shah and CM Bhupesh Baghel hold a meeting with top officials in Jagdalpur, over the naxal attack in which 14 security personnel lost their lives. pic.twitter.com/sF5FPp4Hr8

    — ANI (@ANI) April 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఛత్తీస్​గఢ్​ జగదల్​పుర్​లోని ఉన్నతాధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు.  ఈ కార్యక్రమంలో ఛత్తీస్​గఢ్​ సీఎం భూపేశ్ బఘేల్​ పాల్గొన్నారు.  

11:19 April 05

  • #WATCH: Union Home Minister Amit Shah and Chhattisgarh Chief Minister Bhupesh Baghel lay wreath at the coffins of 14 security personnel who lost their lives in the Naxal attack, in Jagdalpu pic.twitter.com/fyHZSE6mjG

    — ANI (@ANI) April 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బీజాపుర్ ఎన్​కౌంట​ర్​లో వీర మరణం పొందిన జవాన్లకు నివాళి అర్పించారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. అనంతరం జగదల్​పుర్​లోని ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. గాయపడ్డ జవాన్లను పరామర్శించనున్నారు. ఆ తర్వాత సీర్​పీఎఫ్​ క్యాంపు కార్యాలయాన్ని సందర్శించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

11:13 April 05

ఛత్తీస్​గఢ్ ఎన్​కౌంటర్​లో వీర మరణం పొందిన జవాన్లకు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా పుష్ప గుచ్ఛాలతో నివాళులు అర్పించారు. మరికాసేపట్లో ఉన్నత అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. 

10:46 April 05

  • Chhattisgarh Naxal attack: Wreath-laying ceremony for 14 security personnel to be held in Jagdalpur, Union Home Minister Amit Shah and Chief Minister Bhupesh Baghel to attend the ceremony. pic.twitter.com/JhguqzGi4h

    — ANI (@ANI) April 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మావోయిస్టుల కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్లకు కాసేపట్లో ఛత్తీస్​గఢ్​లోని జగ్​దల్​పుర్​లో కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, ఛత్తీస్​గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ ఘన నివాళులు అర్పించనున్నారు.

10:20 April 05

  • Chhattisgarh: Wreath laying ceremony of soldiers who lost their lives in the Naxal attack at Sukma-Bijapur border, is being held in Bijapur pic.twitter.com/pkXHyZwdEX

    — ANI (@ANI) April 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అధికార లాంఛనాలతో..

మావోయిస్టుల ఘాతుకంతో.. వీర మరణం పొందిన జవాన్లకు భద్రతా దళాలు అంజలి ఘటించాయి. ఛత్తీస్​గఢ్​ బీజాపుర్​లో అమర జవాన్లకు అధికార లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. జవాన్ల పార్థీవ దేహాలపై జాతీయ పతాకాన్ని కప్పి.. పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. 

వీర జవాన్ల కుటుంబీకుల రోదనలు అందరినీ కలచివేస్తున్నాయి. 

09:10 April 05

లైవ్​: బీజాపుర్ ఎన్​కౌంటర్ ప్రాంతానికి అమిత్​ షా

ఛత్తీస్‌గఢ్‌లో బస్తర్ అడవుల్లో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పరిశీలించనున్నారు. మరికాసేపట్లో అక్కడికి చేరుకోనున్నారు.

భద్రతా దళాలపై మావోయిస్టులు దాడి చేసిన ప్రాంతాన్ని ఆయన ఉన్నతాధికారులతో కలిసి పరిశీలిస్తారు. అనంతరం.. నక్సల్స్​ కాల్పుల్లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను పరామర్శించనున్నారు. మారణకాండపై ఇప్పటికే ఉన్నతస్ధాయి సమీక్ష నిర్వహించారు హోం మంత్రి. మావోయిస్టులకు సరైన సమాధానం ఇస్తామని తెలిపారు. 

బీజాపుర్​- సుక్మా జిల్లా సరిహద్దుల్లో జరిగిన మావోయిస్టుల దాడిలో 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 400 మంది నక్సల్స్​ జరిపిన ఈ దాడిలో మరో 30కి పైగా సైనికులు గాయాలపాలయ్యారు.

Last Updated : Apr 5, 2021, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.