మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. 2వేల మందికిపైగా బ్లాక్ ఫంగస్ సోకినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ శిలీంధ్ర వ్యాధి కారణంగా 10 మంది మరణించినట్లు స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:బ్లాక్ ఫంగస్పై జాగ్రత్త సుమా!
కొవిడ్ నుంచి కోలుకున్నవారిలోనే ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని, కొంత మందికి కంటిచూపు పోయిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ ఫంగస్ లక్షణాలు, అది ఎలా వ్యాప్తిస్తుందనే దానిపై కొవిడ్ బాధితులకు సమాచారం అందిస్తోంది.
ఇదీ చదవండి:బ్లాక్ ఫంగస్ చికిత్సకు రూ.1200కే ఇంజెక్షన్
డయాబెటిస్వంటి రోగాలున్న వారు పలు జాగ్రత్తలు వహించాల్సి ఉందని ఐసీఎంఆర్ పేర్కొంది. స్టెరాయిడ్లు అతిగా వాడటం వల్ల ఇమ్యూనిటీపై అది ప్రభావం చూపిస్తుందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలున్నవారు తప్పనిసరిగా డాక్టర్ల సలహాలు తీసుకోవాలని అన్నారు.