ETV Bharat / bharat

మోదీ పర్యటనకు ముందు మరో ఎన్​కౌంటర్.. భద్రత కట్టుదిట్టం

author img

By

Published : Apr 23, 2022, 7:36 PM IST

Modi JK visit security: జమ్ముకశ్మీర్​లో మరో ఎన్​కౌంటర్ జరిగింది. కుల్గాం జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ప్రధాని జమ్ముకశ్మీర్ పర్యటనకు ముందు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు.

heavy security for Prime Minister visit
heavy security for Prime Minister visit

Modi JK visit security: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందు జమ్ముకశ్మీర్​లో మరో ఎన్​కౌంటర్ జరిగింది. కుల్గాం జిల్లాలోని మిర్హమ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరులను బలగాలు మట్టుబెట్టాయి. పోలీసులు, ఆర్మీ జవాన్లు.. ముష్కరుల ఏరివేత కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రధాని పర్యటనకు ముందు ఉగ్రమూకలు దాడులకు పాల్పడుతున్నందున అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. జమ్ముకశ్మీర్‌ మొత్తం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన భద్రతా దళాలు.. రహదారుల వద్ద వేల సంఖ్యలో సీఐఎస్ఎఫ్ బలగాలను మోహరించాయి. సమస్యాత్మక ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్ముకశ్మీర్‌లో ఆదివారం పలు అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించనున్నారు. ఇందుకోసం లక్ష మందికి సరిపడేలా సభ ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. 30 వేల మందికి పైగా వివిధ పంచాయతీల సభ్యులు ఇందుకు హాజరుకానున్నట్లు సమాచారం.

మరోవైపు, ఎన్ఐఏ చీఫ్, సీఆర్​పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్ శనివారం.. జమ్ములోని సుంజ్వాన్ ప్రాంతంలో పర్యటించారు. జమ్ము సెక్టార్ సీఆర్​పీఎఫ్ ఐజీ పీఎస్ రాన్​పీసే సైతం ఆయన వెంట ఉన్నారు. జైషే మహమ్మద్ ముఠాకు చెందిన ఇద్దరు సూసైడ్ బాంబర్లను భద్రతా బలగాలు శుక్రవారం ఇక్కడే మట్టుబెట్టాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కుల్దీప్​కు అధికారులు వివరించారు. మోదీ బహిరంగ సభ జరిగే పాలి పంచాయత్​ను సైతం సందర్శించారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.

కాగా, పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాదులు భారత్​లోకి చొరబడేందుకు సరిహద్దుల్లో పొంచి ఉన్నారని నిఘా వర్గాలు వెల్లడించాయి. 80-100 మంది ఉగ్రవాదులు లాంచ్ ప్యాడ్​ల వద్ద సిద్ధంగా ఉన్నారని తెలిపాయి. వీరంతా అఫ్గానిస్థాన్​లో శిక్షణ పొందారని నిఘా అధికారులు తెలిపారు. ఉగ్రవాదులను భారత్​లోకి పంపించేందుకు ఉపయోగించే లాంచ్ ప్యాడ్​లు తిరిగి క్రియాశీలంగా మారినట్లు పేర్కొన్నారు. అమర్​నాథ్ యాత్రపైనా ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. జూన్ 30న అమర్​నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. 43 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. రెండేళ్ల తర్వాత అమర్​నాథ్ యాత్ర జరగనుండటం గమనార్హం. అయితే, ఉగ్రవాదుల దాడులను అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు భద్రతా దళాలు స్పష్టం చేశాయి. 'అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేసుకున్నాం' అని సీఆర్​పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్ తెలిపారు.

Modi JK visit security: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందు జమ్ముకశ్మీర్​లో మరో ఎన్​కౌంటర్ జరిగింది. కుల్గాం జిల్లాలోని మిర్హమ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరులను బలగాలు మట్టుబెట్టాయి. పోలీసులు, ఆర్మీ జవాన్లు.. ముష్కరుల ఏరివేత కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రధాని పర్యటనకు ముందు ఉగ్రమూకలు దాడులకు పాల్పడుతున్నందున అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. జమ్ముకశ్మీర్‌ మొత్తం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన భద్రతా దళాలు.. రహదారుల వద్ద వేల సంఖ్యలో సీఐఎస్ఎఫ్ బలగాలను మోహరించాయి. సమస్యాత్మక ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్ముకశ్మీర్‌లో ఆదివారం పలు అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించనున్నారు. ఇందుకోసం లక్ష మందికి సరిపడేలా సభ ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. 30 వేల మందికి పైగా వివిధ పంచాయతీల సభ్యులు ఇందుకు హాజరుకానున్నట్లు సమాచారం.

మరోవైపు, ఎన్ఐఏ చీఫ్, సీఆర్​పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్ శనివారం.. జమ్ములోని సుంజ్వాన్ ప్రాంతంలో పర్యటించారు. జమ్ము సెక్టార్ సీఆర్​పీఎఫ్ ఐజీ పీఎస్ రాన్​పీసే సైతం ఆయన వెంట ఉన్నారు. జైషే మహమ్మద్ ముఠాకు చెందిన ఇద్దరు సూసైడ్ బాంబర్లను భద్రతా బలగాలు శుక్రవారం ఇక్కడే మట్టుబెట్టాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కుల్దీప్​కు అధికారులు వివరించారు. మోదీ బహిరంగ సభ జరిగే పాలి పంచాయత్​ను సైతం సందర్శించారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.

కాగా, పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాదులు భారత్​లోకి చొరబడేందుకు సరిహద్దుల్లో పొంచి ఉన్నారని నిఘా వర్గాలు వెల్లడించాయి. 80-100 మంది ఉగ్రవాదులు లాంచ్ ప్యాడ్​ల వద్ద సిద్ధంగా ఉన్నారని తెలిపాయి. వీరంతా అఫ్గానిస్థాన్​లో శిక్షణ పొందారని నిఘా అధికారులు తెలిపారు. ఉగ్రవాదులను భారత్​లోకి పంపించేందుకు ఉపయోగించే లాంచ్ ప్యాడ్​లు తిరిగి క్రియాశీలంగా మారినట్లు పేర్కొన్నారు. అమర్​నాథ్ యాత్రపైనా ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. జూన్ 30న అమర్​నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. 43 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. రెండేళ్ల తర్వాత అమర్​నాథ్ యాత్ర జరగనుండటం గమనార్హం. అయితే, ఉగ్రవాదుల దాడులను అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు భద్రతా దళాలు స్పష్టం చేశాయి. 'అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేసుకున్నాం' అని సీఆర్​పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్ తెలిపారు.

ఇదీ చదవండి:

ఫోన్​ మాట్లాడుతూ మ్యాన్​హోల్​లో పడిన మహిళ- అదృష్టం కొద్దీ..

ఘనంగా 'ఐఏఎస్​ టాపర్​' టీనా దాబి రెండో పెళ్లి.. ఫొటోలు వైరల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.