ETV Bharat / bharat

గుజరాత్​లో ప్రకంపనలు.. భవిష్యత్​లో 7.5 తీవ్రతతో భూకంపం వచ్చే ఛాన్స్!

author img

By

Published : Feb 11, 2023, 12:36 PM IST

Updated : Feb 11, 2023, 1:33 PM IST

గుజరాత్​లో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేల్​పై దీని తీవ్రత 3.8గా నమోదైంది. శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత ఘటన జరిగింది.

గుజరాత్​లో భూకంపం
గుజరాత్​లో భూకంపం

గుజరాత్​లో స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్​ స్కేల్​పై 3.8గా నమోదైంది. శుక్రవారం అర్థరాత్రి తరువాత ఈ భూకంపం సంభవించింది. సూరత్​ జిల్లాలో 12.52 గంటల ప్రాంతంలో ప్రకంపనలు వచ్చినట్లు ఇన్​స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ అధికారులు తెలిపారు. సూరత్‌కు పశ్చిమ నైరుతి తీరాన 27 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు వారు వెల్లడించారు. ఇది హజీర జిల్లా సమీపాన.. అరేబియా సముద్రంలో ఉన్నట్లు గుర్తించారు. 5.2 కిలోమీటర్ల లోతులు భూకంపం కేంద్రం ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.

భవిష్యత్​లో మరిన్ని భూకంపాలు..
మరోవైపు, భారత్​లో భూకంపాలు వచ్చే అవకాశాలపై ఐఐటీ కాన్పూర్​కు చెందిన ప్రొఫెసర్ జావెద్​ మాలిక్​ కీలక వ్యాఖ్యలు చేశారు. సైన్స్​ డిపార్ట్​మెంట్​లో ప్రొఫెసర్​గా పనిచేస్తున్న ఆయన.. భారత్​లో రాబోయే రోజుల్లో మరిన్ని భూకంపాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో రిక్టర్​ స్కేల్​పై 7.5 తీవ్రతతో భూకంపాలు వచ్చే సూచనలు ఉన్నాయని తెలిపారు. ఈ మధ్య కాలంలోనే దిల్లీ, లక్నోలో వచ్చిన భూకంపాల గురించి గుర్తుచేశారు.

భవిష్యత్​లో హిమలయాలు, కచ్​ ప్రాంతం, అండమాన్​ నికోబార్​ దీవుల్లో భూకంపం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 2004లో రిక్టర్​ స్కేల్​పై 9.1 తీవ్రతతో అండమాన్​ నికోబార్​ దీవుల్లో భూకంపం వచ్చినట్లు ఆయన వెల్లడించారు. అదే విధంగా రిక్టర్​ స్కేల్​పై 7.5 నుంచి 8.7 తీవ్రతతో మధ్య హిమాలయాలలోని కుమావోన్ హిమాచల్ ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు తెలిపారు.

59 శాతం భూభాగానికి ముప్పు..
తుర్కియే, సిరియాలో భూప్రళయంతో యావత్​ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. ఈ నేపథ్యంలో.. మన దేశంలో భూకంపం సంభవించే అవకాశాలు ఉన్నాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 59 శాతం భూభాగం.. భూకంపాలకు గురయ్యే అవకాశముందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మన దేశంలో భూకంపాలు సంభవించడానికి ప్రధాన కారణం.. భారత భూఫలకం ఏడాదికి 47 మిల్లీమీటర్ల వేగంతో ఆసియా ఫలకంలోకి చొచ్చుకుపోవడమేనని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

గుజరాత్​లోనూ..
ఈ భూకంప ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో గుజరాత్​లోని రాన్‌ ఆఫ్‌ కచ్‌ కూడా ఉంది. గుజరాత్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో​ 1819, 1845, 1847,1848, 1864, 1903, 1938, 1956, 2001లో అతిపెద్ద భూకంపాలు సంభవించాయి. 2001లో వచ్చిన కచ్​ భూకంపం గత రెండు దశాబ్దాల్లో వచ్చిన అతిపెద్దది. ఈ ఘటనలో 13,800 మంది మృతి చెందారు. 1.67 లక్షల మంది గాయపడ్డారు.

గుజరాత్​లో స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్​ స్కేల్​పై 3.8గా నమోదైంది. శుక్రవారం అర్థరాత్రి తరువాత ఈ భూకంపం సంభవించింది. సూరత్​ జిల్లాలో 12.52 గంటల ప్రాంతంలో ప్రకంపనలు వచ్చినట్లు ఇన్​స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ అధికారులు తెలిపారు. సూరత్‌కు పశ్చిమ నైరుతి తీరాన 27 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు వారు వెల్లడించారు. ఇది హజీర జిల్లా సమీపాన.. అరేబియా సముద్రంలో ఉన్నట్లు గుర్తించారు. 5.2 కిలోమీటర్ల లోతులు భూకంపం కేంద్రం ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.

భవిష్యత్​లో మరిన్ని భూకంపాలు..
మరోవైపు, భారత్​లో భూకంపాలు వచ్చే అవకాశాలపై ఐఐటీ కాన్పూర్​కు చెందిన ప్రొఫెసర్ జావెద్​ మాలిక్​ కీలక వ్యాఖ్యలు చేశారు. సైన్స్​ డిపార్ట్​మెంట్​లో ప్రొఫెసర్​గా పనిచేస్తున్న ఆయన.. భారత్​లో రాబోయే రోజుల్లో మరిన్ని భూకంపాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో రిక్టర్​ స్కేల్​పై 7.5 తీవ్రతతో భూకంపాలు వచ్చే సూచనలు ఉన్నాయని తెలిపారు. ఈ మధ్య కాలంలోనే దిల్లీ, లక్నోలో వచ్చిన భూకంపాల గురించి గుర్తుచేశారు.

భవిష్యత్​లో హిమలయాలు, కచ్​ ప్రాంతం, అండమాన్​ నికోబార్​ దీవుల్లో భూకంపం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 2004లో రిక్టర్​ స్కేల్​పై 9.1 తీవ్రతతో అండమాన్​ నికోబార్​ దీవుల్లో భూకంపం వచ్చినట్లు ఆయన వెల్లడించారు. అదే విధంగా రిక్టర్​ స్కేల్​పై 7.5 నుంచి 8.7 తీవ్రతతో మధ్య హిమాలయాలలోని కుమావోన్ హిమాచల్ ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు తెలిపారు.

59 శాతం భూభాగానికి ముప్పు..
తుర్కియే, సిరియాలో భూప్రళయంతో యావత్​ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. ఈ నేపథ్యంలో.. మన దేశంలో భూకంపం సంభవించే అవకాశాలు ఉన్నాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 59 శాతం భూభాగం.. భూకంపాలకు గురయ్యే అవకాశముందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మన దేశంలో భూకంపాలు సంభవించడానికి ప్రధాన కారణం.. భారత భూఫలకం ఏడాదికి 47 మిల్లీమీటర్ల వేగంతో ఆసియా ఫలకంలోకి చొచ్చుకుపోవడమేనని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

గుజరాత్​లోనూ..
ఈ భూకంప ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో గుజరాత్​లోని రాన్‌ ఆఫ్‌ కచ్‌ కూడా ఉంది. గుజరాత్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో​ 1819, 1845, 1847,1848, 1864, 1903, 1938, 1956, 2001లో అతిపెద్ద భూకంపాలు సంభవించాయి. 2001లో వచ్చిన కచ్​ భూకంపం గత రెండు దశాబ్దాల్లో వచ్చిన అతిపెద్దది. ఈ ఘటనలో 13,800 మంది మృతి చెందారు. 1.67 లక్షల మంది గాయపడ్డారు.

Last Updated : Feb 11, 2023, 1:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.