ETV Bharat / bharat

హిమాచల్​ప్రదేశ్​ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జాం!

author img

By

Published : Jun 14, 2021, 5:12 AM IST

తమ రాష్ట్రంలోకి రోడ్డుమార్గం ద్వారా వచ్చేవారు ఇకపై కరోనా 'ఆర్టీపీసీఆర్‌' నెగటివ్‌ రిపోర్టును చూపించాల్సిన అవసరం లేదని హిమాచల్‌ప్రదేశ్​ ప్రభుత్వం ప్రకటించింది. దీనితో కొద్ది గంటల్లోనే ఆ రాష్ట్ర సరిహద్దుల్లో రహదారులు కిక్కిరిసిపోయాయి. భారీగా ట్రాఫిక్​ జాం ఏర్పడింది.

himachal pradesh
హిమాచల్​ప్రదేశ్​

రాష్ట్రంలోకి ప్రవేశించేవారు కొవిడ్‌-19 ఆర్టీపీసీఆర్‌ నెగటివ్‌ రిపోర్టును చూపించాల్సిన అవసరం లేదంటూ హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించడంతో గంటల వ్యవధిలోనే ఆ రాష్ట్ర సరిహద్దులో రహదారులు కిక్కిరిసిపోయాయి. వేలాది వాహనాలు కిలోమీటర్ల మీర బారులు తీరాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పర్యాటకులను అనుమతిస్తూ రాష్ట్ర సరిహద్దులను అక్కడి ప్రభుత్వం శనివారం తెరిచింది. దీంతో సరిహద్దు ప్రాంతమైన సోలాన్‌ జిల్లాలోని పార్వానో వద్ద వేలాది వాహనాలు క్యూ కట్టాయి. అయితే కొవిడ్‌ ఈ-పాస్‌ను లేనిదే రాష్ట్రంలోని అనుమతివ్వడం లేదు.

  • As Himachal Pradesh has now allowed entry without RT-PCR test report, this is hw the decision was welcomed.... pic.twitter.com/JVotyxSIlF

    — Mohammad Ghazali (@ghazalimohammad) June 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పర్యటకులకు అనుమతి..

మరోవైపు కొవిడ్ నిబంధనలను పాటించాల్సిందిగా పర్యాటకులకు హిమాచల్‌ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మాస్కు ధరిస్తూ, సామాజిక దూరం పాటించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చిరించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పర్యాటక రాష్ట్రమైన హిమాచల్‌ ప్రదేశ్‌ ఆంక్షలను సడలిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. శనివారం నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యటకులను అనుమతిస్తోంది. అయితే ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఇవీ చదవండి: అత్యంత ఎత్తైన గ్రామంలో 100% వ్యాక్సినేషన్!

వైరల్​: షికారుకు వెళ్తున్న మంచు చిరుత!

Viral: పిడుగు పడటం లైవ్​లో చూశారా?

రాష్ట్రంలోకి ప్రవేశించేవారు కొవిడ్‌-19 ఆర్టీపీసీఆర్‌ నెగటివ్‌ రిపోర్టును చూపించాల్సిన అవసరం లేదంటూ హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించడంతో గంటల వ్యవధిలోనే ఆ రాష్ట్ర సరిహద్దులో రహదారులు కిక్కిరిసిపోయాయి. వేలాది వాహనాలు కిలోమీటర్ల మీర బారులు తీరాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పర్యాటకులను అనుమతిస్తూ రాష్ట్ర సరిహద్దులను అక్కడి ప్రభుత్వం శనివారం తెరిచింది. దీంతో సరిహద్దు ప్రాంతమైన సోలాన్‌ జిల్లాలోని పార్వానో వద్ద వేలాది వాహనాలు క్యూ కట్టాయి. అయితే కొవిడ్‌ ఈ-పాస్‌ను లేనిదే రాష్ట్రంలోని అనుమతివ్వడం లేదు.

  • As Himachal Pradesh has now allowed entry without RT-PCR test report, this is hw the decision was welcomed.... pic.twitter.com/JVotyxSIlF

    — Mohammad Ghazali (@ghazalimohammad) June 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పర్యటకులకు అనుమతి..

మరోవైపు కొవిడ్ నిబంధనలను పాటించాల్సిందిగా పర్యాటకులకు హిమాచల్‌ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మాస్కు ధరిస్తూ, సామాజిక దూరం పాటించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చిరించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పర్యాటక రాష్ట్రమైన హిమాచల్‌ ప్రదేశ్‌ ఆంక్షలను సడలిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. శనివారం నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యటకులను అనుమతిస్తోంది. అయితే ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఇవీ చదవండి: అత్యంత ఎత్తైన గ్రామంలో 100% వ్యాక్సినేషన్!

వైరల్​: షికారుకు వెళ్తున్న మంచు చిరుత!

Viral: పిడుగు పడటం లైవ్​లో చూశారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.