ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​- జైషే టాప్ కమాండర్ హతం

author img

By

Published : Oct 13, 2021, 3:12 PM IST

Updated : Oct 13, 2021, 3:22 PM IST

జమ్ముకశ్మీర్​ పుల్వామా​ జిల్లాలో ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఘటనలో జైషే మహ్మద్​ ఉగ్రసంస్థకు చెందిన టాప్ కమాండర్​ షామ్​ సోఫీని బలగాలు మట్టుబెట్టాయి.

encounter
ఎన్​కౌంటర్​

జమ్ముకశ్మీర్​లో ఉగ్రఏరివేత కొనసాగుతోంది. పుల్వామా ​జిల్లా అవంతిపోరాలోని త్రాల్​ ప్రాంతంలో ఎన్​కౌంటర్ జరిగింది. ఈ ఘటన​లో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ​కు చెందిన టాప్​ కమాండర్ షామ్ సోఫీని ​భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

ముష్కరులు ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా.. భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ మేరకు కశ్మర్ ఇన్​స్పెక్టర్ జనరల్ ఆఫ్​ పోలీస్(ఐజీపీ)​ విజయ్ కుమార్​ తెలిపారు. ముష్కరులకు, భద్రతాసిబ్బందికి మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

జమ్ముకశ్మీర్​లో ఉగ్రఏరివేత కొనసాగుతోంది. పుల్వామా ​జిల్లా అవంతిపోరాలోని త్రాల్​ ప్రాంతంలో ఎన్​కౌంటర్ జరిగింది. ఈ ఘటన​లో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ​కు చెందిన టాప్​ కమాండర్ షామ్ సోఫీని ​భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

ముష్కరులు ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా.. భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ మేరకు కశ్మర్ ఇన్​స్పెక్టర్ జనరల్ ఆఫ్​ పోలీస్(ఐజీపీ)​ విజయ్ కుమార్​ తెలిపారు. ముష్కరులకు, భద్రతాసిబ్బందికి మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి

Last Updated : Oct 13, 2021, 3:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.