ETV Bharat / bharat

లారీలో మంటలు- ముగ్గురు చిన్నారులు మృతి - లారీలో మంటలు చెలరేగి చిన్నారులు మృతి

లారీలో ఆకస్మికంగా మంటలు చెలరేగిన ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. ఆడుకునేందుకు లారీ క్యాబిన్​లోకి చిన్నారులు వెళ్లిన సమయంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది.

fire in a lorry
లారీలో మంటలు, చిన్నారులు మృతి
author img

By

Published : May 9, 2021, 12:45 PM IST

లారీ క్యాబిన్​లో ఆకస్మికంగా మంటలు చెలరేగి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన రాజస్థాన్​ అల్వార్ జిల్లా రామ్​గఢ్​లో జరిగింది.

ఆడుకునేందుకు వెళ్లి...

గోవింద్​గఢ్ ఠాణా పరిధిలోని చౌమ గ్రామానికి చెందిన ఓ డ్రైవర్ దిల్లీ నుంచి తిరిగివచ్చి తన లారీని రోడ్డుకు ఓ పక్కన పార్క్ చేశాడు. అయితే.. నలుగురు పిల్లలు ఆడుకునేందుకు ఆ లారీ ఎక్కారు. ఇంతలోనే ఆ లారీ క్యాబిన్​లో మంటలు చెలరేగాయి.

fire accident
దగ్దమైన లారీ ముందు భాగం

మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన స్థానికులు.. పిల్లలను వాహనం నుంచి బయటకు తీసి అల్వార్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడం వల్ల వారిని జైపూర్​కు తీసుకెళ్లమని అల్వార్ ఆసుపత్రి వైద్యులు సూచించారు. ఈ క్రమంలో జైపూర్​కు తరలిస్తుండగా ముగ్గురు చిన్నారులు మృతి చెందారు.

లారీ ముందు భాగం కూడా పూర్తిగా దగ్ధమైనట్లు పోలీసులు స్పష్టం చేశారు. రామ్​గఢ్​ పోలీసు అధికారి రామ్​నివాస్, డీఎస్పీ ఓంప్రకాశ్ మీనా ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:మారువేషంలో పోలీస్ స్టేషన్లకు కమిషనర్.. కారణం?

లారీ క్యాబిన్​లో ఆకస్మికంగా మంటలు చెలరేగి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన రాజస్థాన్​ అల్వార్ జిల్లా రామ్​గఢ్​లో జరిగింది.

ఆడుకునేందుకు వెళ్లి...

గోవింద్​గఢ్ ఠాణా పరిధిలోని చౌమ గ్రామానికి చెందిన ఓ డ్రైవర్ దిల్లీ నుంచి తిరిగివచ్చి తన లారీని రోడ్డుకు ఓ పక్కన పార్క్ చేశాడు. అయితే.. నలుగురు పిల్లలు ఆడుకునేందుకు ఆ లారీ ఎక్కారు. ఇంతలోనే ఆ లారీ క్యాబిన్​లో మంటలు చెలరేగాయి.

fire accident
దగ్దమైన లారీ ముందు భాగం

మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన స్థానికులు.. పిల్లలను వాహనం నుంచి బయటకు తీసి అల్వార్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడం వల్ల వారిని జైపూర్​కు తీసుకెళ్లమని అల్వార్ ఆసుపత్రి వైద్యులు సూచించారు. ఈ క్రమంలో జైపూర్​కు తరలిస్తుండగా ముగ్గురు చిన్నారులు మృతి చెందారు.

లారీ ముందు భాగం కూడా పూర్తిగా దగ్ధమైనట్లు పోలీసులు స్పష్టం చేశారు. రామ్​గఢ్​ పోలీసు అధికారి రామ్​నివాస్, డీఎస్పీ ఓంప్రకాశ్ మీనా ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:మారువేషంలో పోలీస్ స్టేషన్లకు కమిషనర్.. కారణం?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.