మహారాష్ట్ర పాల్గఢ్ జిల్లాలో విషాదం జరిగింది. భర్త మరణవార్త విని.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్య గుండెపోటుతో మరణించింది.
అసలేం జరిగింది?
కుమార్ జోషీ(45).. పాల్గఢ్ జిల్లా వాసాయిలోని విజయ్ వల్లభ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆసుపత్రి రెండో అంతస్తులోని ఐసీయూలో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఐసీయూలో చికిత్స పొందుతున్న 14 మంది సజీవదహనమయ్యారు. వీరిలో కుమార్ జోషీ కూడా ఉన్నాడు.
ఈ వార్త విని విరార్లోని జీవ్ధార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుమార్ భార్య చాందినీ జోషీ.. గుండెపోటుతో మరణించింది.
ఇదీ చదవండి : వైరస్ సోకినా.. కొవిడ్ రోగుల సేవలో వైద్యులు