ETV Bharat / bharat

ముష్కరుల గుట్టురట్టు- భారీగా ఆయుధాలు స్వాధీనం

author img

By

Published : Feb 27, 2021, 2:25 AM IST

జమ్ముకశ్మీర్​లో ఓ ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని భద్రతా బలగాలు కనుగొన్నాయి. భారీ స్థాయిలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. సీఆర్​పీఎఫ్​, ఆర్మీ సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో ఇవి బయటపడ్డాయి.

Terrorist hideout busted in J&K
ముష్కరుల గుట్టురట్టు- భారీగా ఆయుధాలు స్వాధీనం

జమ్ముకశ్మీర్​లో ఉగ్రముఠా గుట్టురట్టు చేశాయి భద్రతా బలగాలు. రియాసీ జిల్లాలో శుక్రవారం భారీ ఎత్తును మందుగుండు సామగ్రి, ఆయుధాలు, పేలుడు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

తనిఖీలు నిర్వహించగా..

సిల్దార్​ ఎగువ ప్రాంతాలు, రంజాటి, రౌసవాలి కొండ ప్రాంతాల్లో ముష్కరులు సంచరిస్తున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారంతో సీఆర్​పీఎఫ్​, ఆర్మీ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాయి. శుక్రవారం ఉదయం.. ఉగ్రవాదులకు చెందిన భూగర్భ రహస్య స్థావరాన్ని అధికారులు కనుగొన్నారు. రెండు మేగజైన్లతో ఉన్న ఏకే-47 రైఫిల్​ సహా 150 మందు గుండ్లు, ఒక రాకెట్​ లాంఛర్​, 16 యూబీజీఎల్​ గ్రెనేడ్లు, నాలుగు హ్యాండ్​ గ్రెనేడ్లతో పాటు రేడియో సెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఆయుధాలను సకాలంలో స్వాధీనం చేసుకోవడం ద్వారా దక్షిణ పిర్​ పంజాల్ పర్వత శ్రేణుల్లో​ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అడ్డుకోగలిగామని ఓ సీనియర్​ అధికారి తెలిపారు. ఈ ఘటనపై.. పేలుడు పదార్థాల చట్టం, ఇతర సంబంధిత చట్టాల కింద మహార్​ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:అంబానీ ఇంటి వద్ద 'బాంబుల కారు' కేసులో ట్విస్ట్!

జమ్ముకశ్మీర్​లో ఉగ్రముఠా గుట్టురట్టు చేశాయి భద్రతా బలగాలు. రియాసీ జిల్లాలో శుక్రవారం భారీ ఎత్తును మందుగుండు సామగ్రి, ఆయుధాలు, పేలుడు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

తనిఖీలు నిర్వహించగా..

సిల్దార్​ ఎగువ ప్రాంతాలు, రంజాటి, రౌసవాలి కొండ ప్రాంతాల్లో ముష్కరులు సంచరిస్తున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారంతో సీఆర్​పీఎఫ్​, ఆర్మీ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాయి. శుక్రవారం ఉదయం.. ఉగ్రవాదులకు చెందిన భూగర్భ రహస్య స్థావరాన్ని అధికారులు కనుగొన్నారు. రెండు మేగజైన్లతో ఉన్న ఏకే-47 రైఫిల్​ సహా 150 మందు గుండ్లు, ఒక రాకెట్​ లాంఛర్​, 16 యూబీజీఎల్​ గ్రెనేడ్లు, నాలుగు హ్యాండ్​ గ్రెనేడ్లతో పాటు రేడియో సెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఆయుధాలను సకాలంలో స్వాధీనం చేసుకోవడం ద్వారా దక్షిణ పిర్​ పంజాల్ పర్వత శ్రేణుల్లో​ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అడ్డుకోగలిగామని ఓ సీనియర్​ అధికారి తెలిపారు. ఈ ఘటనపై.. పేలుడు పదార్థాల చట్టం, ఇతర సంబంధిత చట్టాల కింద మహార్​ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:అంబానీ ఇంటి వద్ద 'బాంబుల కారు' కేసులో ట్విస్ట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.