ETV Bharat / bharat

'ఇంక్విలాబ్‌' ఊపిరిగా.. సంపూర్ణ స్వరాజ్యమే ఆశగా..

author img

By

Published : Mar 13, 2022, 9:17 AM IST

Syed Fazal ul Hasan Story: 'ఇంక్విలాబ్‌ జిందాబాద్‌'.. వందేమాతరంతో పాటు జాతీయోద్యమంలో జోరుగా వినిపించిన నినాదమిది. దాని సృష్టికర్త సయ్యద్‌ ఫజల్‌ ఉల్‌ హసన్‌! కాంగ్రెస్‌.. ముస్లింలీగ్‌.. కమ్యూనిస్టు పార్టీల్లో ఉంటూ సంపూర్ణ స్వరాజ్యం కోసం అందరికంటే ముందే నినదించారాయన. హజ్‌ యాత్రకు వెళ్లే హసన్‌ ఏటా మథురలో కృష్ణాష్టమికీ హాజరయ్యేవారు. దేశవిభజన వద్దని జిన్నాతో పోరాడిన ఈ సమరయోధుడు ముస్లింలీగ్‌కు రాజీనామా చేసి భారత్‌లోనే ఉండిపోయారు.

AZADI KA AMRIT MAHOTSAV
సయ్యద్‌ ఫజల్‌ ఉల్‌ హసన్‌

Syed Fazal ul Hasan Story: యునైటెడ్‌ ప్రావిన్స్​లోని (ప్రస్తుత ఉత్తర్‌ప్రదేశ్‌) ఉన్నావ్‌ జిల్లా మోహన్‌ గ్రామంలో 1875లో జన్మించిన ఫజల్‌ ఉల్‌ హసన్‌...తన ఊరిపేరునే కలం పేరుగా మార్చుకొని హస్రత్‌ మొహానిగా పేరొందారు. మహమ్మదీన్‌ ఆంగ్లో ఓరియెంటల్‌ కాలేజీ (ప్రస్తుత అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ) నుంచి పట్టభద్రుడైన ఆయన ఆది నుంచీ ఆంగ్లేయులను విమర్శించేవారు. దీంతో కాలేజీ నుంచి మూడుసార్లు బహిష్కరణకు గురయ్యారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం ఉన్నా బ్రిటిష్‌వారికి గులాంగిరీ చేయనంటూ.. జర్నలిస్టుగా మారారు. ఉర్దూ -ఎ- ముల్లా అనే మేగజీన్‌ నడిపారు. జాతీయ కాంగ్రెస్‌లో చేరి.. అరబిందో ఘోష్‌, బాల గంగాధర్‌ తిలక్‌ల బాటలో నడిచి అతివాదిగా ముద్రవేసుకున్నారు. ఆయన భార్య బేగం నిషాతున్నీసా కూడా అదే బాటలో పయనించారు. బ్రిటిష్‌ సర్కారును విమర్శిస్తూ రాసినందుకు భర్తను ఆంగ్లేయులు అరెస్టు చేస్తే ఆమే మేగజీన్‌ నడిపించారు. ముస్లింలీగ్‌ ఏర్పడ్డాక అందులోనూ చేరిన మొహానీ 1919లో దాని అధ్యక్షుడయ్యారు. ముస్లింలీగ్‌లో ఉంటూనే కాంగ్రెస్‌లో కూడా కొనసాగిన ఆయన 1921 అహ్మదాబాద్‌ సదస్సులోనే సంపూర్ణ స్వరాజ్యం కోసం తీర్మానం చేయాలని పట్టుబట్టారు. అప్పుడే ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అని నినదించారు. నిషాతున్నీసా కూడా భర్త బాటలో సంపూర్ణ స్వరాజ్యం కోసం పట్టుబట్టారు. అప్పటికి కాంగ్రెస్‌ ఇంకా స్వయం ప్రతిపత్తిని మాత్రమే కోరుతోంది. మొహానీ దంపతుల చొరవ, పట్టుదలను గాంధీజీ మెచ్చుకున్నారు. అయితే మరో 8 సంవత్సరాలకుగాని కాంగ్రెస్‌ ఈ తీర్మానం ఆమోదించలేదు.

జిన్నాతో వాదించి..

కాంగ్రెస్‌ తీరు నచ్చని మొహానీ 1925లో ఏర్పడ్డ భారత కమ్యూనిస్టు పార్టీ వైపు మొగ్గు చూపారు. సీపీఐ వ్యవస్థాపకుల్లో ఒకరిగా వ్యవహరించారు. తర్వాతికాలంలో వారితో సైద్ధాంతిక విభేదాలు వచ్చి బయటకు వచ్చేశారు. కానీ ఆయన ఆలోచనలు మాత్రం విప్లవాత్మకంగానే సాగేవి.

ముస్లింలీగ్‌లో క్రియాశీలకంగానే ఉన్నా.. మహమ్మద్‌ అలీ జిన్నాతో ఆయన విభేదించారు. ముఖ్యంగా దేశవిభజనపై. బ్రిటిష్‌వారు వెళ్లిపోయాక భారతావని తూర్పు పాకిస్థాన్‌, పశ్చిమ పాకిస్థాన్‌, సెంట్రల్‌ ఇండియా, ఆగ్నేయ భారత్‌, హైదరాబాద్‌, దక్కన్‌.. లుగా ఆరు రాష్ట్రాల సమాఖ్యగా ఉండాలని ఆయన ప్రతిపాదించారు. దేశ విభజన ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదన్నారు. జిన్నాతో వాదించారు. ఎంత చెప్పినా వినకపోవటంతో ముస్లింలీగ్‌ను వీడి.. స్వాతంత్య్రానంతరం భారత్‌లోనే ఉండిపోయారు.

భారత రాజ్యాంగ సభలో సభ్యుడైన మొహానీ చివరకు రాజ్యాంగ ప్రతిపై సంతకం చేయటానికి నిరాకరించారు. కారణం- బ్రిటిష్‌ హయాంలో కొంతమంది ఓట్లతో (అప్పుడు ప్రజలందరికీ ఓటు హక్కు ఉండేది కాదు) ఎంపికైన ప్రతినిధులతో కాకుండా.. భారత ప్రజలందరి ఓట్లతో ఎంపికైన వారు రాజ్యాంగం రాస్తే సమగ్రంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రానంతరం కూడా ఆయనెన్నడూ ప్రభుత్వమిచ్చే సౌకర్యాలను తీసుకోలేదు. తనకు కేటాయించిన గృహాన్ని కూడా వాడుకోలేదు. మసీదులో ఉంటూ.. సామాన్యులతో కలసి గుర్రపుబగ్గీలో రాజ్యాంగసభకు వెళ్లేవారు. సంప్రదాయ ముస్లింలా జీవిస్తూ.. హజ్‌ యాత్రలకు వెళ్లే మొహానీకి కృష్ణుడంటే అపార ప్రేమ, భక్తి. ఏటా మథురలో జన్మాష్టమి వేడుకలకు హాజరయ్యే ఆయన... కృష్ణుడిపై కవితలు కూడా రాశారు. మతాచారాలను పాటించినా వాటికతీతంగా మానవత్వాన్ని నమ్మారు. అందుకే 1951 మేలో కన్నుమూసిన మొహానీకి భారత్‌లోనే కాకుండా అటు పాకిస్థాన్‌లోనూ స్మారకాలు వెలవడం విశేషం.

ఇదీ చదవండి: ఆ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం.. సాయం కోసం!

Syed Fazal ul Hasan Story: యునైటెడ్‌ ప్రావిన్స్​లోని (ప్రస్తుత ఉత్తర్‌ప్రదేశ్‌) ఉన్నావ్‌ జిల్లా మోహన్‌ గ్రామంలో 1875లో జన్మించిన ఫజల్‌ ఉల్‌ హసన్‌...తన ఊరిపేరునే కలం పేరుగా మార్చుకొని హస్రత్‌ మొహానిగా పేరొందారు. మహమ్మదీన్‌ ఆంగ్లో ఓరియెంటల్‌ కాలేజీ (ప్రస్తుత అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ) నుంచి పట్టభద్రుడైన ఆయన ఆది నుంచీ ఆంగ్లేయులను విమర్శించేవారు. దీంతో కాలేజీ నుంచి మూడుసార్లు బహిష్కరణకు గురయ్యారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం ఉన్నా బ్రిటిష్‌వారికి గులాంగిరీ చేయనంటూ.. జర్నలిస్టుగా మారారు. ఉర్దూ -ఎ- ముల్లా అనే మేగజీన్‌ నడిపారు. జాతీయ కాంగ్రెస్‌లో చేరి.. అరబిందో ఘోష్‌, బాల గంగాధర్‌ తిలక్‌ల బాటలో నడిచి అతివాదిగా ముద్రవేసుకున్నారు. ఆయన భార్య బేగం నిషాతున్నీసా కూడా అదే బాటలో పయనించారు. బ్రిటిష్‌ సర్కారును విమర్శిస్తూ రాసినందుకు భర్తను ఆంగ్లేయులు అరెస్టు చేస్తే ఆమే మేగజీన్‌ నడిపించారు. ముస్లింలీగ్‌ ఏర్పడ్డాక అందులోనూ చేరిన మొహానీ 1919లో దాని అధ్యక్షుడయ్యారు. ముస్లింలీగ్‌లో ఉంటూనే కాంగ్రెస్‌లో కూడా కొనసాగిన ఆయన 1921 అహ్మదాబాద్‌ సదస్సులోనే సంపూర్ణ స్వరాజ్యం కోసం తీర్మానం చేయాలని పట్టుబట్టారు. అప్పుడే ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అని నినదించారు. నిషాతున్నీసా కూడా భర్త బాటలో సంపూర్ణ స్వరాజ్యం కోసం పట్టుబట్టారు. అప్పటికి కాంగ్రెస్‌ ఇంకా స్వయం ప్రతిపత్తిని మాత్రమే కోరుతోంది. మొహానీ దంపతుల చొరవ, పట్టుదలను గాంధీజీ మెచ్చుకున్నారు. అయితే మరో 8 సంవత్సరాలకుగాని కాంగ్రెస్‌ ఈ తీర్మానం ఆమోదించలేదు.

జిన్నాతో వాదించి..

కాంగ్రెస్‌ తీరు నచ్చని మొహానీ 1925లో ఏర్పడ్డ భారత కమ్యూనిస్టు పార్టీ వైపు మొగ్గు చూపారు. సీపీఐ వ్యవస్థాపకుల్లో ఒకరిగా వ్యవహరించారు. తర్వాతికాలంలో వారితో సైద్ధాంతిక విభేదాలు వచ్చి బయటకు వచ్చేశారు. కానీ ఆయన ఆలోచనలు మాత్రం విప్లవాత్మకంగానే సాగేవి.

ముస్లింలీగ్‌లో క్రియాశీలకంగానే ఉన్నా.. మహమ్మద్‌ అలీ జిన్నాతో ఆయన విభేదించారు. ముఖ్యంగా దేశవిభజనపై. బ్రిటిష్‌వారు వెళ్లిపోయాక భారతావని తూర్పు పాకిస్థాన్‌, పశ్చిమ పాకిస్థాన్‌, సెంట్రల్‌ ఇండియా, ఆగ్నేయ భారత్‌, హైదరాబాద్‌, దక్కన్‌.. లుగా ఆరు రాష్ట్రాల సమాఖ్యగా ఉండాలని ఆయన ప్రతిపాదించారు. దేశ విభజన ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదన్నారు. జిన్నాతో వాదించారు. ఎంత చెప్పినా వినకపోవటంతో ముస్లింలీగ్‌ను వీడి.. స్వాతంత్య్రానంతరం భారత్‌లోనే ఉండిపోయారు.

భారత రాజ్యాంగ సభలో సభ్యుడైన మొహానీ చివరకు రాజ్యాంగ ప్రతిపై సంతకం చేయటానికి నిరాకరించారు. కారణం- బ్రిటిష్‌ హయాంలో కొంతమంది ఓట్లతో (అప్పుడు ప్రజలందరికీ ఓటు హక్కు ఉండేది కాదు) ఎంపికైన ప్రతినిధులతో కాకుండా.. భారత ప్రజలందరి ఓట్లతో ఎంపికైన వారు రాజ్యాంగం రాస్తే సమగ్రంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రానంతరం కూడా ఆయనెన్నడూ ప్రభుత్వమిచ్చే సౌకర్యాలను తీసుకోలేదు. తనకు కేటాయించిన గృహాన్ని కూడా వాడుకోలేదు. మసీదులో ఉంటూ.. సామాన్యులతో కలసి గుర్రపుబగ్గీలో రాజ్యాంగసభకు వెళ్లేవారు. సంప్రదాయ ముస్లింలా జీవిస్తూ.. హజ్‌ యాత్రలకు వెళ్లే మొహానీకి కృష్ణుడంటే అపార ప్రేమ, భక్తి. ఏటా మథురలో జన్మాష్టమి వేడుకలకు హాజరయ్యే ఆయన... కృష్ణుడిపై కవితలు కూడా రాశారు. మతాచారాలను పాటించినా వాటికతీతంగా మానవత్వాన్ని నమ్మారు. అందుకే 1951 మేలో కన్నుమూసిన మొహానీకి భారత్‌లోనే కాకుండా అటు పాకిస్థాన్‌లోనూ స్మారకాలు వెలవడం విశేషం.

ఇదీ చదవండి: ఆ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం.. సాయం కోసం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.