ETV Bharat / bharat

'ఉద్యమాన్ని విరమించి.. పరీక్షలు చేయించుకోండి'

author img

By

Published : May 14, 2021, 5:41 AM IST

దేశంలో కరోనా రెండో దశ విజృంభిస్తున్న క్రమంలో.. రైతులు ఉద్యమాన్ని విరమించాలని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​లాల్ ఖట్టర్​ కోరారు. రైతుల ఉద్యమం, ధర్నాల వల్ల వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.

Manohar Lal Khattar
మనోహర్​లాల్ ఖట్టర్​

దేశంలో కరోనా సెకండ్​వేవ్​ ఉద్ధృతి దృష్ట్యా రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం సాగిస్తున్న అన్నదాతలు.. నిరసనలు, ధర్నాలను విరమించాలని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​లాల్ ఖట్టర్​ కోరారు. రైతులు, రైతుసంఘాల నాయకులు కొవిడ్ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఉద్యమం వల్ల గ్రామాల్లో వైరస్​ వ్యాప్తి చెందుతుందన్నారు.

"ఉద్యమాన్ని కొనసాగించాలంటే.. పరిస్థితి అదుపులోకి వచ్చాక మళ్లీ ప్రారంభించండి. గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఉద్యమం, ధర్నాలో పాల్గొంటున్నారు. దీనివల్ల పల్లెల్లో కరోనా వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుత పరిస్థితిని రైతుసంఘాల నాయకులు అర్థం చేసుకోవాలి. రైతులు, రైతు నాయకులు కరోనా పరీక్షలు చేసుకోవాలి. లేకుంటే వైరస్ ఉందో లేదో ఎలా తెలుస్తుంది?"

-- మనోహర్​లాల్ ఖట్టర్, హరియాణా ముఖ్యమంత్రి

కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. ఉద్యమాన్ని విరమించాలని తాను నెల రోజుల ముందే రైతు సంఘాల నాయకులను కోరానని ఖట్టర్ గుర్తుచేశారు. ఈ సమావేశంలో ఖట్టర్​తో పాటు హరియాణా వైద్యశాఖ మంత్రి అనిల్ విజ్​ పాల్గొన్నారు.

ఇదీ చదవండి : ఆ ఆస్పత్రిలో మరో 15 మంది కొవిడ్​ రోగులు మృతి

దేశంలో కరోనా సెకండ్​వేవ్​ ఉద్ధృతి దృష్ట్యా రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం సాగిస్తున్న అన్నదాతలు.. నిరసనలు, ధర్నాలను విరమించాలని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​లాల్ ఖట్టర్​ కోరారు. రైతులు, రైతుసంఘాల నాయకులు కొవిడ్ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఉద్యమం వల్ల గ్రామాల్లో వైరస్​ వ్యాప్తి చెందుతుందన్నారు.

"ఉద్యమాన్ని కొనసాగించాలంటే.. పరిస్థితి అదుపులోకి వచ్చాక మళ్లీ ప్రారంభించండి. గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఉద్యమం, ధర్నాలో పాల్గొంటున్నారు. దీనివల్ల పల్లెల్లో కరోనా వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుత పరిస్థితిని రైతుసంఘాల నాయకులు అర్థం చేసుకోవాలి. రైతులు, రైతు నాయకులు కరోనా పరీక్షలు చేసుకోవాలి. లేకుంటే వైరస్ ఉందో లేదో ఎలా తెలుస్తుంది?"

-- మనోహర్​లాల్ ఖట్టర్, హరియాణా ముఖ్యమంత్రి

కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. ఉద్యమాన్ని విరమించాలని తాను నెల రోజుల ముందే రైతు సంఘాల నాయకులను కోరానని ఖట్టర్ గుర్తుచేశారు. ఈ సమావేశంలో ఖట్టర్​తో పాటు హరియాణా వైద్యశాఖ మంత్రి అనిల్ విజ్​ పాల్గొన్నారు.

ఇదీ చదవండి : ఆ ఆస్పత్రిలో మరో 15 మంది కొవిడ్​ రోగులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.