ETV Bharat / bharat

'విద్యార్థులూ.. ఈ మూడింటిపై దృష్టి పెట్టండి'

author img

By

Published : Feb 23, 2021, 1:21 PM IST

కరోనా సమయంలో ఐఐటీలు అభివృద్ధి చేసిన సాంకేతికత వైరస్​పై పోరాడటంలో ఉపయోగపడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఐఐటీ ఖరగ్​పుర్ 66వ స్నాతకోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ప్రజల జీవితాలను మార్చేందుకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.

modi kharagpur
'విద్యార్థులూ.. ఈ మూడింటిపై దృష్టి పెట్టండి'

21వ శతాబ్దపు భారతదేశం పూర్తిగా మారిపోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐఐటీ ఖరగ్​పుర్ 66వ స్నాతకోత్సవానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన ఆయన.. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఐఐటీ అంటే ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాత్రమే కాదని, ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండిజీనియస్ టెక్నాలజీ(స్వదేశీ సాంకేతిక సంస్థ) అని పేర్కొన్నారు. విద్యార్థులందరూ ఆత్మవిశ్వాసం, నిస్వార్థత, స్వీయ అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.

"భారత్​లోని 130 కోట్ల ప్రజల ఆకాంక్షలకు మీరు(విద్యార్థులు) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రజల జీవితాలను మార్చేందుకు మీరు అంకురాలుగా పనిచేయాలి. ఆత్మవిశ్వాసం, నిస్వార్థత, స్వీయ అవగాహన.. ఈ మూడు విషయాలపై మీరు దృష్టిసారించాలి."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఉత్తరాఖండ్ జలప్రళయం నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ. విపత్తు నిర్వహణకు సంబంధించి మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడంపై దృష్టిసారించాలని అన్నారు. కరోనా సమయంలో ఐఐటీలు అభివృద్ధి చేసిన సాంకేతికత.. వైరస్​పై పోరాడేందుకు ఉపయోగపడిందని చెప్పారు.

ఇదీ చదవండి: 'ఆరోగ్య భారత్​కు నాలుగు సూత్రాలు'

21వ శతాబ్దపు భారతదేశం పూర్తిగా మారిపోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐఐటీ ఖరగ్​పుర్ 66వ స్నాతకోత్సవానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన ఆయన.. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఐఐటీ అంటే ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాత్రమే కాదని, ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండిజీనియస్ టెక్నాలజీ(స్వదేశీ సాంకేతిక సంస్థ) అని పేర్కొన్నారు. విద్యార్థులందరూ ఆత్మవిశ్వాసం, నిస్వార్థత, స్వీయ అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.

"భారత్​లోని 130 కోట్ల ప్రజల ఆకాంక్షలకు మీరు(విద్యార్థులు) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రజల జీవితాలను మార్చేందుకు మీరు అంకురాలుగా పనిచేయాలి. ఆత్మవిశ్వాసం, నిస్వార్థత, స్వీయ అవగాహన.. ఈ మూడు విషయాలపై మీరు దృష్టిసారించాలి."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఉత్తరాఖండ్ జలప్రళయం నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ. విపత్తు నిర్వహణకు సంబంధించి మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడంపై దృష్టిసారించాలని అన్నారు. కరోనా సమయంలో ఐఐటీలు అభివృద్ధి చేసిన సాంకేతికత.. వైరస్​పై పోరాడేందుకు ఉపయోగపడిందని చెప్పారు.

ఇదీ చదవండి: 'ఆరోగ్య భారత్​కు నాలుగు సూత్రాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.