ETV Bharat / bharat

'ఉగ్రవాదులు కాదు.. ఆ మృతదేహాల్ని అప్పగించండి'

author img

By

Published : Jan 4, 2021, 8:45 PM IST

Updated : Jan 4, 2021, 10:03 PM IST

పారంపొరాలో జరిగిన ఎన్​కౌంటర్​లో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు యువకుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని కశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్​ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ డిమాండ్​ చేశారు. ఆ ముగ్గురు అమాయకులని కుటుంబ సభ్యులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఎన్​కౌంటర్​పై నిష్పాక్షిక, పారదర్శక దర్యాప్తు జరగాలన్నారు.

Srinagar encounter: Families protest in Srinagar, demand bodies of their slain sons
'ఉగ్రవాదులు కాదు.. మృతదేహాలు అప్పగించండి'

జమ్ముకశ్మీర్​ శ్రీనగర్​ సమీపంలోని పారంపొరాలో గతవారం జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని నేషనల్​ కాన్ఫరెన్స్​ నాయకుడు, కశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా డిమాండ్​ చేశారు. ఈ ముగ్గురు అమాయకులని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నట్లు తెలిపారు. ఈ ఎన్​కౌంటర్​పై నిష్పాక్షిక, పారదర్శక దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ అబ్దుల్లా ట్వీట్ చేశారు.

" ఈ ఎన్​కౌంటర్​పై వీలైనంత త్వరగా దర్యాప్తు జరపడం చాలా ముఖ్యం. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఇప్పటికే హామీ ఇచ్చినట్లు పారదర్శక విచారణ జరగాలి. అప్పుడే బాధిత కుటంబ సభ్యులకు న్యాయం జరిగినట్లు అవుతుంది. "

-ఒమర్ అబ్దుల్లా ట్వీట్​.

పీడీపీ అధినేత్రి, కశ్మీర్​ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కూడా ఇదే డిమాండ్​ చేశారు. భద్రతా దళాల ఎన్​కౌంటర్లో మరణించిన వారి మృతదేహాలను అప్పగించే విధానాన్ని సమీక్షించాలని, కేంద్రం, జమ్ముకశ్మీర్​ పరిపాలనా విభాగాన్ని కోరారు.

ఎన్​కౌంటర్లో మరణించిన ముగ్గురు యువకులు ఉగ్రవాదులో, కాదో అనే విషయంపై స్పష్టత లేదన్నారు ముఫ్తీ. ఈ విషయంలో లెఫ్టినెంట్​ గవర్నర్​ జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు.

అమాయకులు..

ముగ్గురు యువకుల మృతదేహాలను అప్పగించాలని వారి కుటుంబ సభ్యులూ డిమాండ్ చేశారు. ఎన్​కౌంటర్​పై దర్యాప్తు చేపట్టి వాస్తవాలు వెలుగులోకి తేవాలన్నారు. 'మాకు న్యాయం చేయాలి', 'అమాయకులను చంపడం అపేయండి' అని ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు.

డిసెంబర్​ 31న పారంపోరాలో ఎన్​కౌంటర్​ జరిగింది. భద్రతా దళాల కాల్పుల్లో అజాజ్​ మక్బూల్​ గనై, జుబేర్​ అహ్మద్​ లోనె, అథార్ ముష్తక్​ వాని అనే ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు మరణించారు. వారు తీవ్రవాదుల జాబితాలో లేరని, ఇద్దరికి మాత్రం చట్టవ్యతిరేక ఆలోచనలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

బాధిత కుటుంబ సభ్యులు మాత్రం ముగ్గురు యువకులూ అమాయకులు అని చెబుతున్నారు.

జమ్ముకశ్మీర్​ శ్రీనగర్​ సమీపంలోని పారంపొరాలో గతవారం జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని నేషనల్​ కాన్ఫరెన్స్​ నాయకుడు, కశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా డిమాండ్​ చేశారు. ఈ ముగ్గురు అమాయకులని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నట్లు తెలిపారు. ఈ ఎన్​కౌంటర్​పై నిష్పాక్షిక, పారదర్శక దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ అబ్దుల్లా ట్వీట్ చేశారు.

" ఈ ఎన్​కౌంటర్​పై వీలైనంత త్వరగా దర్యాప్తు జరపడం చాలా ముఖ్యం. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఇప్పటికే హామీ ఇచ్చినట్లు పారదర్శక విచారణ జరగాలి. అప్పుడే బాధిత కుటంబ సభ్యులకు న్యాయం జరిగినట్లు అవుతుంది. "

-ఒమర్ అబ్దుల్లా ట్వీట్​.

పీడీపీ అధినేత్రి, కశ్మీర్​ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కూడా ఇదే డిమాండ్​ చేశారు. భద్రతా దళాల ఎన్​కౌంటర్లో మరణించిన వారి మృతదేహాలను అప్పగించే విధానాన్ని సమీక్షించాలని, కేంద్రం, జమ్ముకశ్మీర్​ పరిపాలనా విభాగాన్ని కోరారు.

ఎన్​కౌంటర్లో మరణించిన ముగ్గురు యువకులు ఉగ్రవాదులో, కాదో అనే విషయంపై స్పష్టత లేదన్నారు ముఫ్తీ. ఈ విషయంలో లెఫ్టినెంట్​ గవర్నర్​ జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు.

అమాయకులు..

ముగ్గురు యువకుల మృతదేహాలను అప్పగించాలని వారి కుటుంబ సభ్యులూ డిమాండ్ చేశారు. ఎన్​కౌంటర్​పై దర్యాప్తు చేపట్టి వాస్తవాలు వెలుగులోకి తేవాలన్నారు. 'మాకు న్యాయం చేయాలి', 'అమాయకులను చంపడం అపేయండి' అని ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు.

డిసెంబర్​ 31న పారంపోరాలో ఎన్​కౌంటర్​ జరిగింది. భద్రతా దళాల కాల్పుల్లో అజాజ్​ మక్బూల్​ గనై, జుబేర్​ అహ్మద్​ లోనె, అథార్ ముష్తక్​ వాని అనే ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు మరణించారు. వారు తీవ్రవాదుల జాబితాలో లేరని, ఇద్దరికి మాత్రం చట్టవ్యతిరేక ఆలోచనలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

బాధిత కుటుంబ సభ్యులు మాత్రం ముగ్గురు యువకులూ అమాయకులు అని చెబుతున్నారు.

Last Updated : Jan 4, 2021, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.