ETV Bharat / bharat

దిల్లీలో లాక్​డౌన్ కష్టాలు- సొంతూళ్లకు కూలీలు

author img

By

Published : May 18, 2021, 1:21 PM IST

Updated : May 18, 2021, 3:53 PM IST

పదేపదే లాక్​డౌన్ పొడగింపుతో దిల్లీలో వలసకూలీలు ఇక్కట్లు పడుతున్నారు. కంపెనీలన్నీ మూతపడటం వల్ల చేసేందుకు ఏ పనీ లేదని ఆవేదన చెందుతున్నారు. రాజధాని విడిచి స్వస్థలాలకు పయనమవుతున్నారు.

DELHI LOCKDOWN MIGRANTS
దిల్లీలో లాక్​డౌన్ కష్టాలు- సొంతూళ్లకు కూలీలు
లాక్​డౌన్​తో మళ్లీ సొంతూళ్లకు..

దేశ రాజధాని దిల్లీలో వలసకార్మికులను లాక్​డౌన్ కష్టాలు వెంటాడుతున్నాయి. కరోనా కట్టడికి విధించిన ఆంక్షలను కేజ్రీ సర్కారు పదేపదే పొడగిస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు దిల్లీలోనే ఉన్న వలసకూలీలు స్వగ్రామాల బాట పడుతున్నారు.

DELHI LOCKDOWN MIGRANTS
సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు కూలీలు, వారి పిల్లల పడిగాపులు
DELHI LOCKDOWN MIGRANTS
కూలీలు, వారి పిల్లలు

కంపెనీలు మూసివేయడం, ఇతర పనులేవీ దొరకపోవడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే సొంత రాష్ట్రానికి పయనమవుతున్నట్టు చెబుతున్నారు. దీంతో దిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ వలసకూలీలతో కిక్కిరిసిపోయింది.

"ఇక్కడ పని ఆగిపోయింది. మేం పేదవాళ్లం. మా అమ్మ పరిస్థితి విషమంగా ఉంది. తిండికి ఇబ్బందులు ఉన్నాయి. కంపెనీలు మూసేశారు. ఇక్కడే ఎన్నిరోజులు ఆకలితో ఉండాలి. అందుకే ఇంటికి వెళ్లిపోతున్నాం."

-రామ్​జీ, వలసకూలీ

"యజమానికి కిరాయి కావాలి. అతనికి డబ్బులు ఎలాగైనా కావాలి. చివరకు సమస్యలన్నీ కూలీలకే. పోలీసులు మాపైనే దౌర్జన్యం చేస్తారు. ధనవంతులను ఏం చేయరు. సమస్య ఇది."

-వలసకూలీ

DELHI LOCKDOWN MIGRANTS
వలసకూలీ

స్వస్థలాలకు వెళ్లే బస్సుల కోసం మహిళలు, చిన్నారులు సైతం గంటల పాటు పడిగాపులు కాస్తున్నారు. రోడ్లపైనే తింటున్నారు. ఫుట్​పాత్​లపైనే నిద్రిస్తున్నారు. కూలీ చేస్తేనే రోజు గడవని ఆ ఆభాగ్యుల దుస్థితి తీవ్రంగా కలచివేస్తోంది.

ఇదీ చదవండి: కరోనాను జయించిన వందేళ్ల బామ్మ

లాక్​డౌన్​తో మళ్లీ సొంతూళ్లకు..

దేశ రాజధాని దిల్లీలో వలసకార్మికులను లాక్​డౌన్ కష్టాలు వెంటాడుతున్నాయి. కరోనా కట్టడికి విధించిన ఆంక్షలను కేజ్రీ సర్కారు పదేపదే పొడగిస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు దిల్లీలోనే ఉన్న వలసకూలీలు స్వగ్రామాల బాట పడుతున్నారు.

DELHI LOCKDOWN MIGRANTS
సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు కూలీలు, వారి పిల్లల పడిగాపులు
DELHI LOCKDOWN MIGRANTS
కూలీలు, వారి పిల్లలు

కంపెనీలు మూసివేయడం, ఇతర పనులేవీ దొరకపోవడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే సొంత రాష్ట్రానికి పయనమవుతున్నట్టు చెబుతున్నారు. దీంతో దిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ వలసకూలీలతో కిక్కిరిసిపోయింది.

"ఇక్కడ పని ఆగిపోయింది. మేం పేదవాళ్లం. మా అమ్మ పరిస్థితి విషమంగా ఉంది. తిండికి ఇబ్బందులు ఉన్నాయి. కంపెనీలు మూసేశారు. ఇక్కడే ఎన్నిరోజులు ఆకలితో ఉండాలి. అందుకే ఇంటికి వెళ్లిపోతున్నాం."

-రామ్​జీ, వలసకూలీ

"యజమానికి కిరాయి కావాలి. అతనికి డబ్బులు ఎలాగైనా కావాలి. చివరకు సమస్యలన్నీ కూలీలకే. పోలీసులు మాపైనే దౌర్జన్యం చేస్తారు. ధనవంతులను ఏం చేయరు. సమస్య ఇది."

-వలసకూలీ

DELHI LOCKDOWN MIGRANTS
వలసకూలీ

స్వస్థలాలకు వెళ్లే బస్సుల కోసం మహిళలు, చిన్నారులు సైతం గంటల పాటు పడిగాపులు కాస్తున్నారు. రోడ్లపైనే తింటున్నారు. ఫుట్​పాత్​లపైనే నిద్రిస్తున్నారు. కూలీ చేస్తేనే రోజు గడవని ఆ ఆభాగ్యుల దుస్థితి తీవ్రంగా కలచివేస్తోంది.

ఇదీ చదవండి: కరోనాను జయించిన వందేళ్ల బామ్మ

Last Updated : May 18, 2021, 3:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.