ETV Bharat / bharat

బొగ్గు కేసుల విచారణకు ఇద్దరు ప్రత్యేక జడ్జీలు

బొగ్గు కుంభకోణం కేసుల విచారణకు ఇద్దరు ప్రత్యేక జడ్జీలను నియమిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. 2014 నుంచి 41కేసులపై ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న ప్రత్యేక జడ్డి భరత్​ పరాషర్​ ఆరేళ్ల పాటు అదే పదవిలో ఉండగా.. కొత్త వారిని నియమించాల్సి వచ్చింది.

author img

By

Published : Apr 6, 2021, 8:55 AM IST

SC
సుప్రీంకోర్టు

బొగ్గు కుంభకోణం కేసుల విచారణకు ఇద్దరు ప్రత్యేక జడ్జీలను నియమిస్తూ సుప్రీంకోర్టు సోమవారం నిర్ణయం తీసుకుంది. దిల్లీ హైకోర్టు అయిదుగురు పేర్లను పంపించగా వాటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​.ఎ. బోబ్డే, జస్టిస్​ ఎ.ఎస్​.బోపన్న, జస్టిస్​ వి. రామసుబ్రమణియన్​లోతో కూడిన ధర్మాసనం పరిశీలించింది.

అందరూ మంచివారేనని పేర్కొన్న ధర్మాసనం వారిలో అరుణ్​ భరద్వాజ్​, సంజయ్​ బన్సల్​లను ఎంపిక చేసింది. 2014 నుంచి 41కేసులపై ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న ప్రత్యేక జడ్డి భరత్​ పరాషర్​ ఆరేళ్ల పాటు అదే పదవిలో కొనసాగడంతో కొత్త వారిని నియమించాల్సి వచ్చింది. కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున రెండు కోర్టులు ఏర్పాటు చేసి, ఇద్దరు ప్రత్యేక జడ్జీలను నియమించాలని ప్రత్యేక పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ ఆర్​. ఎస్​. చీమా కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది.

బొగ్గు కుంభకోణం కేసుల విచారణకు ఇద్దరు ప్రత్యేక జడ్జీలను నియమిస్తూ సుప్రీంకోర్టు సోమవారం నిర్ణయం తీసుకుంది. దిల్లీ హైకోర్టు అయిదుగురు పేర్లను పంపించగా వాటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​.ఎ. బోబ్డే, జస్టిస్​ ఎ.ఎస్​.బోపన్న, జస్టిస్​ వి. రామసుబ్రమణియన్​లోతో కూడిన ధర్మాసనం పరిశీలించింది.

అందరూ మంచివారేనని పేర్కొన్న ధర్మాసనం వారిలో అరుణ్​ భరద్వాజ్​, సంజయ్​ బన్సల్​లను ఎంపిక చేసింది. 2014 నుంచి 41కేసులపై ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న ప్రత్యేక జడ్డి భరత్​ పరాషర్​ ఆరేళ్ల పాటు అదే పదవిలో కొనసాగడంతో కొత్త వారిని నియమించాల్సి వచ్చింది. కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున రెండు కోర్టులు ఏర్పాటు చేసి, ఇద్దరు ప్రత్యేక జడ్జీలను నియమించాలని ప్రత్యేక పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ ఆర్​. ఎస్​. చీమా కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది.

ఇదీ చదవండి: ఓట్ల పండగ షురూ- పోలింగ్​ కేంద్రాలకు తరలిన ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.