కేరళ-కర్ణాటక జాతీయ రహదారిపై సినీఫక్కీలో జరిగిన చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి వేళ హైవేపై ప్రయాణిస్తున్న కేరళకు చెందిన వ్యాపారి వద్ద నుంచి కోటి రూపాయలు దోచుకెళ్లారు దొంగలు.
బంగారం వ్యాపారి..
కేరళకు చెందిన సూరజ్ బంగారం దుకాణం నడుపుతున్నారు. ఈ నెల 15న బంగారం విక్రయించేందుకు బెంగళూరు వచ్చి అదేరోజు రాత్రి రూ.కోటి నగదుతో కేరళకు బయలుదేరాడు. అర్ధరాత్రి సమయంలో జాతీయ రహదారిపై డ్రైవర్తో పాటు ప్రయాణిస్తున్న అతను యశోదరాపురం వద్ద మూత్రవిసర్జన కోసం ఆగాడు. ఈ సమయంలో రెండు ఇన్నోవా కార్లలో వచ్చిన ఏడుగురు వ్యక్తులు బంగారం వ్యాపారిని, అతని కారు డ్రైవర్ను చితకబాది రూ.కోటి నగదుతో పరారయ్యారు. సెల్ఫోన్లనూ ఎత్తుకెళ్లారు. హునసూరు గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గాయాలతో బయటపడ్డ సూరజ్, అతని డ్రైవర్ స్థానికుల సహాయంతో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చిసన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇదీ చదవండి: రూ.60 కోట్లు విలువ చేసే హెరాయిన్ పట్టివేత