పంజాబ్ అమృత్సర్లోని నౌషరా నంగ్లీ గ్రామంలో నిహాంగ్ వర్గానికి చెందిన ఇద్దరు దొంగలు.. ఓ ఉద్యోగి చేయి నరికి రూ.1,500 చోరీ చేశారు. దొంగలు ద్విచక్రవాహనంపై వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి.
ఏం జరిగింది?
బంగాల్కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి.. కంబోజ్ ప్రాంతంలోని ఆకాశ్ అవెన్యూలో నివాసం ఉంటున్నాడు. ద్విచక్రవాహనంపై వచ్చిన నిహాంగ్ వర్గానికి చెందిన ఇద్దరు దుండగులు ఉద్యోగి చేయి నరికి.. రూ. 1500 దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
బాధితుడు ప్రస్తుతం అమృత్సర్లోని అమన్దీప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కంబోజ్ పోలీస్ అధికారి పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి : కూలిన 15 అడుగుల గేటు- ఇద్దరు దుర్మరణం