ETV Bharat / bharat

'18 ప్లస్​'కు టీకా రిజిస్ట్రేషన్ షురూ

దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారు కరోనా టీకా పొందేందుకు రిజిస్ట్రేషన్​ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. కొవిన్ పోర్టల్ సహా, ఆరోగ్య సేతు అప్లికేషన్​లో అర్హులైన వారు రిజిస్టర్ చేసుకోవచ్చు.

author img

By

Published : Apr 28, 2021, 5:00 PM IST

covid vaccination
'18 ప్లస్​'కు టీకా

దేశవ్యాప్తంగా 18 ఏళ్లు దాటిని వారు కొవిడ్​ టీకా పొందేందుకు రిజిస్ట్రేషన్​ ప్రక్రియ బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమైంది. కరోనా ఉగ్రరూపం దాల్చి.. రికార్డు స్థాయిలో కొత్త కేసుల నమోదుకు కారణం అవుతోంది. మరోవైపు టీకా పంపిణీ కార్యక్రమం సైతం వేగంగా సాగుతోంది. ఈ క్రమంలో 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరినీ టీకా అర్హుల జాబితాలో చేర్చిన కేంద్రం.. వారికి మే 1 నుంచి వ్యాక్సిన్ అందించనుంది. ఇందుకోసం కొవిన్ పోర్టల్ సహా, ఆరోగ్య సేతు అప్లికేషన్​లో రిజిస్టర్ అవ్వొచ్చు.

కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ఇలా..

  • మొదట కొవిన్ పోర్టల్‌(cowin.gov.in)లో లాగిన్ అయి, మొబైల్ నంబర్ నమోదుచేయాలి. ఆ వెంటనే ఫోన్‌కు ఓటీపీ వస్తుంది.
  • ఓటీపీని ఎంటర్ చేసి, వెరిఫై బటన్‌ను క్లిక్ చేయాలి. అంతా ఓకే అయితే 'రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సినేషన్' పేజ్‌ ఓపెన్ అవుతోంది.
  • దాంట్లో ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేసి, రిజిస్టర్ అనే బటన్‌పై క్లిక్ చేయాలి.
  • ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే, టీకా వేయించుకునేందుకు తేదీని ఎంచుకునే సౌలభ్యం ఏర్పడుతుంది. దానికోసం పక్కనే ఉన్న షెడ్యూల్ బటన్‌ను క్లిక్ చేయాలి.
  • పిన్‌కోడ్ ఎంటర్ చేసి, వెతికితే దాని పరిధిలోకి టీకా కేంద్రాల జాబితా కనిపిస్తుంది. వాటి ఆధారంగా తేదీ, సమయాన్ని ఎంచుకొని కన్ఫర్మ్ బటన్‌పై క్లిక్ చేయాలి.

ఒక్క లాగిన్‌పై నలుగురికి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. అలాగే తేదీలను మార్చుకొనే వెసులుబాటు కూడా ఉంది. అంతేకాకుండా టీకా కోసం ఆరోగ్య సేతు, ఉమాంగ్​ యాప్‌లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది.

ఇదీ చూడండి: కరోనా మృతులకు 'మెర్సీ ఏంజెల్స్' అంత్యక్రియలు

ఇదీ చూడండి: కొవిడ్​ పోరులో 24x7 సహాయ చర్యలు: ఐఏఎఫ్​

దేశవ్యాప్తంగా 18 ఏళ్లు దాటిని వారు కొవిడ్​ టీకా పొందేందుకు రిజిస్ట్రేషన్​ ప్రక్రియ బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమైంది. కరోనా ఉగ్రరూపం దాల్చి.. రికార్డు స్థాయిలో కొత్త కేసుల నమోదుకు కారణం అవుతోంది. మరోవైపు టీకా పంపిణీ కార్యక్రమం సైతం వేగంగా సాగుతోంది. ఈ క్రమంలో 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరినీ టీకా అర్హుల జాబితాలో చేర్చిన కేంద్రం.. వారికి మే 1 నుంచి వ్యాక్సిన్ అందించనుంది. ఇందుకోసం కొవిన్ పోర్టల్ సహా, ఆరోగ్య సేతు అప్లికేషన్​లో రిజిస్టర్ అవ్వొచ్చు.

కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ఇలా..

  • మొదట కొవిన్ పోర్టల్‌(cowin.gov.in)లో లాగిన్ అయి, మొబైల్ నంబర్ నమోదుచేయాలి. ఆ వెంటనే ఫోన్‌కు ఓటీపీ వస్తుంది.
  • ఓటీపీని ఎంటర్ చేసి, వెరిఫై బటన్‌ను క్లిక్ చేయాలి. అంతా ఓకే అయితే 'రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సినేషన్' పేజ్‌ ఓపెన్ అవుతోంది.
  • దాంట్లో ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేసి, రిజిస్టర్ అనే బటన్‌పై క్లిక్ చేయాలి.
  • ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే, టీకా వేయించుకునేందుకు తేదీని ఎంచుకునే సౌలభ్యం ఏర్పడుతుంది. దానికోసం పక్కనే ఉన్న షెడ్యూల్ బటన్‌ను క్లిక్ చేయాలి.
  • పిన్‌కోడ్ ఎంటర్ చేసి, వెతికితే దాని పరిధిలోకి టీకా కేంద్రాల జాబితా కనిపిస్తుంది. వాటి ఆధారంగా తేదీ, సమయాన్ని ఎంచుకొని కన్ఫర్మ్ బటన్‌పై క్లిక్ చేయాలి.

ఒక్క లాగిన్‌పై నలుగురికి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. అలాగే తేదీలను మార్చుకొనే వెసులుబాటు కూడా ఉంది. అంతేకాకుండా టీకా కోసం ఆరోగ్య సేతు, ఉమాంగ్​ యాప్‌లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది.

ఇదీ చూడండి: కరోనా మృతులకు 'మెర్సీ ఏంజెల్స్' అంత్యక్రియలు

ఇదీ చూడండి: కొవిడ్​ పోరులో 24x7 సహాయ చర్యలు: ఐఏఎఫ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.