ETV Bharat / bharat

సాగు చట్టాలపై రాష్ట్రపతి వద్దకు కాంగ్రెస్​

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2 కోట్ల మందికిపైగా సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ఇవాళ రాష్ట్రపతికి సమర్పించనుంది రాహుల్​ నేతృత్వంలోని కాంగ్రెస్​ బృందం. సాగు చట్టాలను రద్దు చేయాలని కోరనుంది.

author img

By

Published : Dec 24, 2020, 5:51 AM IST

Rahul Gandhi-led delegation to meet President with 20 million signatures against farm laws
సాగు చట్టాలపై రాష్ట్రపతి వద్దకు కాంగ్రెస్​

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను నేడు కలవనుంది రాహుల్​ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్​ బృందం. సాగు చట్టాలకు వ్యతిరేకంగా 2 కోట్ల మంది సంతకాలు చేసిన మెమోరాండంను ఆయనకు సమర్పించనున్నారు. రాహుల్​ అధ్యక్షతన కాంగ్రెస్​ ఎంపీలు, ఇతర నాయకులు రాష్ట్రపతిని కలిసి ఈ వినతిపత్రాన్ని సమర్పించడంతో పాటు, ప్రజాసంక్షేమం దృష్ట్యా ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని కోరనున్నారు.

కేంద్రం తెచ్చిన చట్టాల రద్దులో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని, సెప్టెంబర్​ నుంచి కాంగ్రెస్​ సంతకాల సేకరణ మొదలుపెట్టింది. కూలీలు, రైతులు, వ్యాపారుల నుంచి మొత్తం 2 కోట్లకుపైగా సంతకాలు సేకరించింది. ఇప్పటికే రాహుల్​గాంధీ అధ్యక్షతన పంజాబ్​, హరియాణాలో 'ట్రాక్టర్​ ర్యాలీ'ని నిర్వహించింది.

''లక్షలాది రైతులు అత్యంత శీతల వాతావరణంలో.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. కానీ.. మోదీ ప్రభుత్వం మాత్రం కొంతమంది పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ఆ చట్టాలను తెచ్చింది. శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులను దిల్లీ రాకుండా అడ్డుకుంటున్నారు.''

- కేసీ వేణుగోపాల్​, ఏఐసీసీ​ ప్రధాన కార్యదర్శి

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్​ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోట్లేదని, ఇప్పటికే 44 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: అభయ కేసు దోషులకు జీవితఖైదు

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను నేడు కలవనుంది రాహుల్​ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్​ బృందం. సాగు చట్టాలకు వ్యతిరేకంగా 2 కోట్ల మంది సంతకాలు చేసిన మెమోరాండంను ఆయనకు సమర్పించనున్నారు. రాహుల్​ అధ్యక్షతన కాంగ్రెస్​ ఎంపీలు, ఇతర నాయకులు రాష్ట్రపతిని కలిసి ఈ వినతిపత్రాన్ని సమర్పించడంతో పాటు, ప్రజాసంక్షేమం దృష్ట్యా ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని కోరనున్నారు.

కేంద్రం తెచ్చిన చట్టాల రద్దులో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని, సెప్టెంబర్​ నుంచి కాంగ్రెస్​ సంతకాల సేకరణ మొదలుపెట్టింది. కూలీలు, రైతులు, వ్యాపారుల నుంచి మొత్తం 2 కోట్లకుపైగా సంతకాలు సేకరించింది. ఇప్పటికే రాహుల్​గాంధీ అధ్యక్షతన పంజాబ్​, హరియాణాలో 'ట్రాక్టర్​ ర్యాలీ'ని నిర్వహించింది.

''లక్షలాది రైతులు అత్యంత శీతల వాతావరణంలో.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. కానీ.. మోదీ ప్రభుత్వం మాత్రం కొంతమంది పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ఆ చట్టాలను తెచ్చింది. శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులను దిల్లీ రాకుండా అడ్డుకుంటున్నారు.''

- కేసీ వేణుగోపాల్​, ఏఐసీసీ​ ప్రధాన కార్యదర్శి

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్​ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోట్లేదని, ఇప్పటికే 44 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: అభయ కేసు దోషులకు జీవితఖైదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.