ETV Bharat / bharat

ఆ రెస్టారెంట్​లో సిబ్బంది మొత్తం దివ్యాంగులే! - specially-abled persons as staff in Pune Restaurant

ఆ రెస్టారెంట్​లో పని చేసే సిబ్బందికి మాటలు రావు. వినపడుదు. అయినా వినియోగదారుడు అడిగిన ఆర్డర్​ నిమిషాల్లోనే తీసుకొస్తారు. వారికి భాషతో పని లేదు. అంతా సైగలతోనే. ఇంతకీ ఆ రెస్టారెంట్​ ఎక్కడుందో తెలుసా! పుణెలో. మరి దాని గురించి తెలుసుకుందామా..?

Pune Restaurant employs specially-abled persons to serve customers
ఆ రెస్టారెంట్​లో దివ్యాంగులే సిబ్బంది!
author img

By

Published : Mar 25, 2021, 1:34 PM IST

Updated : Mar 25, 2021, 7:23 PM IST

ఆ రెస్టారెంట్​లో సిబ్బంది మొత్తం దివ్యాంగులే!

దివ్యాంగులు తమ పని చేసుకోవడానికే ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అయితే అటువంటి వారే మహారాష్ట్ర పుణెలోని ఓ రెస్టారెంట్​లో సిబ్బందిగా పని చేస్తున్నారు. ఒక్కరో ఇద్దరో అనుకుంటే పొరపాటే. అందులో పని చేసి సిబ్బంది దాదాపు అందరూ దివ్యాంగులే. వారికి భాషతో పనిలేదు. శరీర హావభావాలే వారి భాష. సైగల సాయంతోనే వినియోగదారులు చేసిన ఆర్డర్​ మేరకు సర్వీసు చేస్తున్నారు.

Pune Restaurant employs specially-abled persons to serve customers
వినియోగదారుల వద్ద ఆర్డర్ తీసుకుంటున్న సిబ్బంది

ప్రత్యేక మెనూ కార్డు

ఆ రెస్టారెంట్​లో మెనూ కార్డు ప్రత్యేకంగా ఉంటుంది. ఒక్కో ఆహార పదార్థానికి ఒక్కో సంజ్ఞ ఉంటుంది. ఆ సంకేతాల ద్వారా వారికి ఏం కావాలో ఆర్డర్ చేసుకోవచ్చు. "వినియోగదారుల సౌకర్యం కోసం సైగలతో కూడిన మెనూ కార్డును రూపొందించాం. వారికి కావాల్సిన ఆహారాన్ని ఆ సైగ ద్వారా ఆర్డర్​ చేయవచ్చు. దీంతో ఇరువురి మధ్య సంభాషణ చాలా సులభమవుతుంది" అని రెస్టారెంట్​ యజమాని సోనాం కాప్సే తెలిపారు.

Pune Restaurant employs specially-abled persons to serve customers
మెనూ కార్డు

"ఈ రెస్టారెంట్​లో 20 మంది వినికిడి శక్తి లేని, మాటలు రానివారు పని చేస్తున్నారు. అటువంటి వారినే నియమించుకుంటాం. వారు స్వతహాగా సంపాదించుకోవడానికి ఈ వేదిక తోడ్పడుతుంది. అందరూ సమానమనే భావన వారిలో కలిగించడమే మా లక్ష్యం. సాధారణంగా ఇటువంటి వారికి తెర వెనుక ఉండే ఉద్యోగాలనే ఇస్తారు. కిచెన్​లో పని చేయడానికే నియమించుకుంటారు. అందుకే సామాజిక దృక్పథంతో ఓ అడుగు ముందుకేశాం."

- సోనాం కాప్సే, రెస్టారెంట్ యజమాని​

"ఇక్కడి వాతావరణం చాలా బాగుంది. సంజ్ఞ విధానంలో తెలియజేసే అనుభూతి కొత్తగా ఉంది. ఇటువంటిది ముంబయిలో ఇప్పటికే ఉంది. అయితే పుణెలో ఇదే తొలిసారి. ఆహారం కూడా రుచికరంగా ఉంది. ఇలాంటి వాటిని తప్పనిసరిగా ప్రొత్సహించాలి" అని ఓ వినియోగదారుడు చెప్పుకొచ్చాడు.

ఇదీ చూడండి: 'ఆర్గానిక్ కిచెన్ గార్డెన్' అమలులో ఆ పాఠశాల భేష్​

ఆ రెస్టారెంట్​లో సిబ్బంది మొత్తం దివ్యాంగులే!

దివ్యాంగులు తమ పని చేసుకోవడానికే ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అయితే అటువంటి వారే మహారాష్ట్ర పుణెలోని ఓ రెస్టారెంట్​లో సిబ్బందిగా పని చేస్తున్నారు. ఒక్కరో ఇద్దరో అనుకుంటే పొరపాటే. అందులో పని చేసి సిబ్బంది దాదాపు అందరూ దివ్యాంగులే. వారికి భాషతో పనిలేదు. శరీర హావభావాలే వారి భాష. సైగల సాయంతోనే వినియోగదారులు చేసిన ఆర్డర్​ మేరకు సర్వీసు చేస్తున్నారు.

Pune Restaurant employs specially-abled persons to serve customers
వినియోగదారుల వద్ద ఆర్డర్ తీసుకుంటున్న సిబ్బంది

ప్రత్యేక మెనూ కార్డు

ఆ రెస్టారెంట్​లో మెనూ కార్డు ప్రత్యేకంగా ఉంటుంది. ఒక్కో ఆహార పదార్థానికి ఒక్కో సంజ్ఞ ఉంటుంది. ఆ సంకేతాల ద్వారా వారికి ఏం కావాలో ఆర్డర్ చేసుకోవచ్చు. "వినియోగదారుల సౌకర్యం కోసం సైగలతో కూడిన మెనూ కార్డును రూపొందించాం. వారికి కావాల్సిన ఆహారాన్ని ఆ సైగ ద్వారా ఆర్డర్​ చేయవచ్చు. దీంతో ఇరువురి మధ్య సంభాషణ చాలా సులభమవుతుంది" అని రెస్టారెంట్​ యజమాని సోనాం కాప్సే తెలిపారు.

Pune Restaurant employs specially-abled persons to serve customers
మెనూ కార్డు

"ఈ రెస్టారెంట్​లో 20 మంది వినికిడి శక్తి లేని, మాటలు రానివారు పని చేస్తున్నారు. అటువంటి వారినే నియమించుకుంటాం. వారు స్వతహాగా సంపాదించుకోవడానికి ఈ వేదిక తోడ్పడుతుంది. అందరూ సమానమనే భావన వారిలో కలిగించడమే మా లక్ష్యం. సాధారణంగా ఇటువంటి వారికి తెర వెనుక ఉండే ఉద్యోగాలనే ఇస్తారు. కిచెన్​లో పని చేయడానికే నియమించుకుంటారు. అందుకే సామాజిక దృక్పథంతో ఓ అడుగు ముందుకేశాం."

- సోనాం కాప్సే, రెస్టారెంట్ యజమాని​

"ఇక్కడి వాతావరణం చాలా బాగుంది. సంజ్ఞ విధానంలో తెలియజేసే అనుభూతి కొత్తగా ఉంది. ఇటువంటిది ముంబయిలో ఇప్పటికే ఉంది. అయితే పుణెలో ఇదే తొలిసారి. ఆహారం కూడా రుచికరంగా ఉంది. ఇలాంటి వాటిని తప్పనిసరిగా ప్రొత్సహించాలి" అని ఓ వినియోగదారుడు చెప్పుకొచ్చాడు.

ఇదీ చూడండి: 'ఆర్గానిక్ కిచెన్ గార్డెన్' అమలులో ఆ పాఠశాల భేష్​

Last Updated : Mar 25, 2021, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.