ETV Bharat / bharat

ఈ మామిడి పండ్లు డజన్​ రూ.4వేలు.. ఎందుకంత ధరంటే... - పుణె మార్కెట్​లో హపూస్​ మామిడి

Hapus mangoes: కింగ్​ ఆఫ్​ మ్యాంగోగా పేరొందిన రత్నగిరి హపూస్​ మామిడి పండ్లు.. సీజన్​ కంటే ముందుగానే మార్కెట్​లో వచ్చాయి. సాధారణంగా ఏటా ఇవి మకర సంక్రాంతి తరువాత వస్తాయి. కానీ ఈ ఏడాదిలో మాత్రం జనవరి మొదటి వారంలోనే విక్రయానికి వచ్చినట్లు వ్యాపారులు చెప్తున్నారు.

Hapus mangoes
హపూస్​ మామిడి కాయలు
author img

By

Published : Jan 3, 2022, 5:20 PM IST

Hapus mangoes: రత్నగిరి హపూస్​ మామిడి పళ్లు ఈ ఏడాది ముందుగానే మార్కెట్​లోకి వచ్చాయి. 'కొంకణ్ రాజు'గా ప్రసిద్ధి చెందిన ఈ మామిడి పండ్లు పుణె మార్కెట్​లో నాలుగు డజన్లు సుమారు రూ. 15 వేలకు అమ్ముడు అవుతున్నట్లు వ్యాపారులు చెప్తున్నారు.

Hapus mangoes
హపూస్​ మామిడి కాయలు

సాధారణంగా అయితే ఈ రత్నగిరి హపూస్ రకం మామిడి పండ్లు ఏటా మకర సంక్రాంతికి అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ఏడాది మాత్రం ముందుగానే మార్కెట్​లోకి వచ్చాయి. వాతావరణ మార్పుల కారణంగా జనవరి మొదటి వారంలోనే వచ్చినట్లు విక్రయదారులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ పండ్ల సీజన్​ ప్రారంభం అయ్యేందుకు ఇంకా రెండు, మూడు నెలల సమయం ఉంది.

Hapus mangoes
ముందుగా వచ్చి హపూస్​ మామిడి రకాన్ని చూపిస్తున్న వ్యాపారీ

ఈ ఏడాది మామిడికి మంచి గిరాకీ...

కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి మామిడి పండ్లు మార్కెట్​లోకి రాలేదని వ్యాపారులు చెప్పారు. ఈ ఏడాది మాత్రం రత్నగిరి రకం మామిడి కాయలు ముందుగానే వచ్చినట్లు పుణెలోని దేశాయ్ బ్రదర్స్ దుకాణం యజమాని మందర్ దేశాయ్ తెలిపారు.

Hapus mangoes
నాలుగు డజన్లు.. రూ. 15 వేలు

లాక్‌డౌన్‌ ఉంటే సప్లైపై ప్రభావం...

ఈ ఏడాదిలో మామిడి పండ్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారని అనుకుంటున్నాం. ఈ క్రమంలోనే డిమాండ్​ కూడా పెరిగింది. గత రెండేళ్లుగా కరోనా కారణంగా డిమాండ్​, సప్లైల మధ్య తేడా కనిపించింది. ఈ సారి కూడా కేసులు పెరుగుతున్నాయి. లాక్​డౌన్​ విధిస్తే సుమారు 10 నుంచి 15 శాతం మేర సప్లైపై పై ప్రభావం పడే అవకాశం ఉంది.

- మందర్​ దేశాయ్​, దేశాయ్​ బ్రదర్స్​ షాపు యజమాని

ఇదీ చూడండి:

జల్లికట్టు జరుగుతుండగా బైక్​ ప్రయాణం- చావుబతుకుల్లో మహిళ!

Hapus mangoes: రత్నగిరి హపూస్​ మామిడి పళ్లు ఈ ఏడాది ముందుగానే మార్కెట్​లోకి వచ్చాయి. 'కొంకణ్ రాజు'గా ప్రసిద్ధి చెందిన ఈ మామిడి పండ్లు పుణె మార్కెట్​లో నాలుగు డజన్లు సుమారు రూ. 15 వేలకు అమ్ముడు అవుతున్నట్లు వ్యాపారులు చెప్తున్నారు.

Hapus mangoes
హపూస్​ మామిడి కాయలు

సాధారణంగా అయితే ఈ రత్నగిరి హపూస్ రకం మామిడి పండ్లు ఏటా మకర సంక్రాంతికి అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ఏడాది మాత్రం ముందుగానే మార్కెట్​లోకి వచ్చాయి. వాతావరణ మార్పుల కారణంగా జనవరి మొదటి వారంలోనే వచ్చినట్లు విక్రయదారులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ పండ్ల సీజన్​ ప్రారంభం అయ్యేందుకు ఇంకా రెండు, మూడు నెలల సమయం ఉంది.

Hapus mangoes
ముందుగా వచ్చి హపూస్​ మామిడి రకాన్ని చూపిస్తున్న వ్యాపారీ

ఈ ఏడాది మామిడికి మంచి గిరాకీ...

కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి మామిడి పండ్లు మార్కెట్​లోకి రాలేదని వ్యాపారులు చెప్పారు. ఈ ఏడాది మాత్రం రత్నగిరి రకం మామిడి కాయలు ముందుగానే వచ్చినట్లు పుణెలోని దేశాయ్ బ్రదర్స్ దుకాణం యజమాని మందర్ దేశాయ్ తెలిపారు.

Hapus mangoes
నాలుగు డజన్లు.. రూ. 15 వేలు

లాక్‌డౌన్‌ ఉంటే సప్లైపై ప్రభావం...

ఈ ఏడాదిలో మామిడి పండ్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారని అనుకుంటున్నాం. ఈ క్రమంలోనే డిమాండ్​ కూడా పెరిగింది. గత రెండేళ్లుగా కరోనా కారణంగా డిమాండ్​, సప్లైల మధ్య తేడా కనిపించింది. ఈ సారి కూడా కేసులు పెరుగుతున్నాయి. లాక్​డౌన్​ విధిస్తే సుమారు 10 నుంచి 15 శాతం మేర సప్లైపై పై ప్రభావం పడే అవకాశం ఉంది.

- మందర్​ దేశాయ్​, దేశాయ్​ బ్రదర్స్​ షాపు యజమాని

ఇదీ చూడండి:

జల్లికట్టు జరుగుతుండగా బైక్​ ప్రయాణం- చావుబతుకుల్లో మహిళ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.