ETV Bharat / bharat

ఉగ్రవాదానికి చెక్ పెట్టేలా 'నాట్​గ్రిడ్' వ్యవస్థ.. త్వరలోనే...

ఉగ్రవాదానికి చెక్​పెట్టే నాట్​గ్రిడ్ వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. కరోనా లేకపోయి ఉంటే ఇప్పటికే ఇది ప్రారంభమై ఉండేదని ఇటీవల హోంమంత్రి అమిత్​షా ఓ కార్యక్రమంలో చెప్పారు. నాట్​గ్రిడ్​తో ఉగ్రవాదుల సమాచారంతో పాటు ఆర్థిక నేరాలు, ఇతర కీలక విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు.

author img

By

Published : Sep 13, 2021, 11:45 AM IST

NATGRID to curb terror soon
ఉగ్రవాదానికి చెక్​ పెట్టే 'నాట్​గ్రిడ్' వ్యవస్థకు త్వరలో శ్రీకారం!

ఉగ్రవాదంపై పోరులో భారత్ మరో ముండడుగు వేయనుంది. ఉగ్రకార్యకలాపాలపై పటిష్ఠ నిఘా వహించే నేషనల్​ ఇంటెలిజెన్స్ గ్రిడ్​- NATGRIDను ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 26/11 ముంబయి ఉగ్రదాడుల అనంతరం ఇలాంటి పటిష్ఠ నిఘా వ్యవస్థ ఏర్పాటుపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ గ్రిడ్ ద్వారా ముష్కరుల కదలికలను పసిగట్టి.. ఉగ్రదాడులను నియంత్రించవచ్చు. ఉగ్రవాదుల సమాచారంతో పాటు ఆర్థిక నేరాలు, ఇతర కీలక విషయాలు దీని ద్వారా తెలుస్తాయని హోంమంత్రి అమిత్ షా తెలిపారు.

ఈనెల 4న బ్యూరో ఆఫ్​ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్​మెంట్​ 51 వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు షా. కరోనా రాకపోయి ఉంటే నాట్​గ్రిడ్​ను ఇప్పటికే ప్రధాని దేశానికి అంకితం చేసేవారని తెలిపారు. త్వరలోనే దీన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

ఏంటీ నాట్​గ్రిడ్​?

నాట్​గ్రిడ్​లో వలసలు, బ్యాంకింగ్​, ఆర్థిక లావాదేవీలు, క్రెడిట్​ కార్డు వినియోగం, టెలికాం, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, విమాన- రైల్వే సర్వీసు సహా ఇతర నిఘా వ్యవస్థకు సంబంధించిన డేటా ఉంటుంది. తొలిదశలో 10 యూజర్​ ఏజెన్సీలు(ఐబీ, సీబీఐ వంటివి), 21 సర్వీసు ప్రొవైడర్లు ఈ గ్రిడ్​తో అనుసంధానమవుతారు. మరో దశలో 950 సంస్థలు, రానున్న సంవత్సరాల్లో 1000 కంపెనీలు గ్రిడ్​లో భాగమవుతాయి.

సీబీఐ, డీఆర్​ఐ, ఈడీ, సీబీఐటీ, సీబీడీటీ, కేబినెట్ సెక్రెటేరియేట్​, ఐబీ, జీఎస్టీ ఇంటెలిజెన్స్​ డైరెక్టరేట్ జనరల్​, ఎన్​సీబీ, ఎఫ్​ఐబీ, ఎన్​ఐఏ వంటి సంస్థలను నాట్​గ్రిడ్​ను వినియోగించేందుకు అనుమతించనున్నారు.

రూ.3,400 కోట్లతో నాట్​గ్రిడ్ ప్రాజెక్టుకు 2010లో కేబినెట్​ కమిటీ(భద్రత) ఆమోదం తెలిపింది. 2012 తర్వాత దీని ప్రక్రియ నెమ్మదించింది. 2014లో మోదీ అధికారంలోకి వచ్చాక మళ్లీ పునర్​ ప్రారంభించారు.

2006-2009 మధ్య కాలంలో అమెరికాకు చెందిన తీవ్రవాది డేవిడ్ హెడ్లీ కదలికలను నిఘా సంస్థలు పసిగట్టలేకపోయాయి. ఆ సమయంలోనే అతడు లష్కరే తొయిబా ఉగ్రసంస్థకు కీలక సమాచారం, వీడియోలను చేరవేశాడు. ఆ సంస్థే ముంబయి దాడులకు పాల్పడి 166 మందిని బలిగొంది. అప్పుడే నాట్​గ్రిడ్ ఏర్పాటుకు బీజం పడింది.

ఇదీ చదవండి: 'కాంగ్రెస్​లో మేం కోరుకున్న ప్రక్షాళన మొదలైంది'

ఉగ్రవాదంపై పోరులో భారత్ మరో ముండడుగు వేయనుంది. ఉగ్రకార్యకలాపాలపై పటిష్ఠ నిఘా వహించే నేషనల్​ ఇంటెలిజెన్స్ గ్రిడ్​- NATGRIDను ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 26/11 ముంబయి ఉగ్రదాడుల అనంతరం ఇలాంటి పటిష్ఠ నిఘా వ్యవస్థ ఏర్పాటుపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ గ్రిడ్ ద్వారా ముష్కరుల కదలికలను పసిగట్టి.. ఉగ్రదాడులను నియంత్రించవచ్చు. ఉగ్రవాదుల సమాచారంతో పాటు ఆర్థిక నేరాలు, ఇతర కీలక విషయాలు దీని ద్వారా తెలుస్తాయని హోంమంత్రి అమిత్ షా తెలిపారు.

ఈనెల 4న బ్యూరో ఆఫ్​ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్​మెంట్​ 51 వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు షా. కరోనా రాకపోయి ఉంటే నాట్​గ్రిడ్​ను ఇప్పటికే ప్రధాని దేశానికి అంకితం చేసేవారని తెలిపారు. త్వరలోనే దీన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

ఏంటీ నాట్​గ్రిడ్​?

నాట్​గ్రిడ్​లో వలసలు, బ్యాంకింగ్​, ఆర్థిక లావాదేవీలు, క్రెడిట్​ కార్డు వినియోగం, టెలికాం, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, విమాన- రైల్వే సర్వీసు సహా ఇతర నిఘా వ్యవస్థకు సంబంధించిన డేటా ఉంటుంది. తొలిదశలో 10 యూజర్​ ఏజెన్సీలు(ఐబీ, సీబీఐ వంటివి), 21 సర్వీసు ప్రొవైడర్లు ఈ గ్రిడ్​తో అనుసంధానమవుతారు. మరో దశలో 950 సంస్థలు, రానున్న సంవత్సరాల్లో 1000 కంపెనీలు గ్రిడ్​లో భాగమవుతాయి.

సీబీఐ, డీఆర్​ఐ, ఈడీ, సీబీఐటీ, సీబీడీటీ, కేబినెట్ సెక్రెటేరియేట్​, ఐబీ, జీఎస్టీ ఇంటెలిజెన్స్​ డైరెక్టరేట్ జనరల్​, ఎన్​సీబీ, ఎఫ్​ఐబీ, ఎన్​ఐఏ వంటి సంస్థలను నాట్​గ్రిడ్​ను వినియోగించేందుకు అనుమతించనున్నారు.

రూ.3,400 కోట్లతో నాట్​గ్రిడ్ ప్రాజెక్టుకు 2010లో కేబినెట్​ కమిటీ(భద్రత) ఆమోదం తెలిపింది. 2012 తర్వాత దీని ప్రక్రియ నెమ్మదించింది. 2014లో మోదీ అధికారంలోకి వచ్చాక మళ్లీ పునర్​ ప్రారంభించారు.

2006-2009 మధ్య కాలంలో అమెరికాకు చెందిన తీవ్రవాది డేవిడ్ హెడ్లీ కదలికలను నిఘా సంస్థలు పసిగట్టలేకపోయాయి. ఆ సమయంలోనే అతడు లష్కరే తొయిబా ఉగ్రసంస్థకు కీలక సమాచారం, వీడియోలను చేరవేశాడు. ఆ సంస్థే ముంబయి దాడులకు పాల్పడి 166 మందిని బలిగొంది. అప్పుడే నాట్​గ్రిడ్ ఏర్పాటుకు బీజం పడింది.

ఇదీ చదవండి: 'కాంగ్రెస్​లో మేం కోరుకున్న ప్రక్షాళన మొదలైంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.