ఉత్తరప్రదేశ్లో ఇళ్ల పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ (పీఎంఏవై-జీ) కింద యూపీకి రూ.2,691 కోట్లు విడుదల చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు మోదీ.
పీఎంఏవై-జీ ద్వారా యూపీలో 6.1 లక్షలమంది గ్రామీణ పేదలకు లబ్ధి చేకూరనుంది. తొలి విడతలో 5.30 లక్షలు, రెండో విడతలో 80 వేలమంది లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు.
ఇదీ చూడండి:ఈనెల 30న ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష భేటీ