ETV Bharat / bharat

కుటుంబ సమేతంగా కాశీలో పర్యటించనున్న రాష్ట్రపతి

author img

By

Published : Mar 13, 2021, 5:15 AM IST

కుటుంబ సమేతంగా కాశీలో పర్యటించనున్నారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్. మూడు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో భాగంగా ఉత్తర్​ప్రదేశ్​లోని వివిధ ప్రాంతాలను సందర్శించనున్నారు.

kasi
కుటుంబ సమేతంగా రాష్ట్రపతి కాశీ పర్యటన

మూడు రోజుల పర్యటన నిమిత్తం.. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ నేడు​ ఉత్తర్​ప్రదేశ్​కు చేరుకోనున్నారు. పర్యటనలో భాగంగా మొదట కాశీలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు కుటుంబ సమేతంగా కాశీకి చేరుకుని గంగా నది ఒడ్డున పూజలు నిర్వహిస్తారు. అనంతరం స్థానిక విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకుంటారు.

ఈ పర్యటనలో కోవింద్.. వివిధ ప్రాంతాలను సందర్శించనున్నారు. ఇది రాష్ట్రపతి వ్యక్తిగత పర్యటన కావడం గమనార్హం.

రాష్ట్రపతి రాక నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. గంగా ఘాట్​ సహా సమీప ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కరోనా దృష్ట్యా గంగా హారతి నిర్వహించే అర్చకులతో పాటు 40 మందికి పైగా సిబ్బందికి కొవిడ్​ పరీక్షలు నిర్వహించారు.

ఇదీ చదవండి : 'విద్యావంతులైన యువతే విప్లవాత్మక మార్పు తేగలరు'

మూడు రోజుల పర్యటన నిమిత్తం.. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ నేడు​ ఉత్తర్​ప్రదేశ్​కు చేరుకోనున్నారు. పర్యటనలో భాగంగా మొదట కాశీలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు కుటుంబ సమేతంగా కాశీకి చేరుకుని గంగా నది ఒడ్డున పూజలు నిర్వహిస్తారు. అనంతరం స్థానిక విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకుంటారు.

ఈ పర్యటనలో కోవింద్.. వివిధ ప్రాంతాలను సందర్శించనున్నారు. ఇది రాష్ట్రపతి వ్యక్తిగత పర్యటన కావడం గమనార్హం.

రాష్ట్రపతి రాక నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. గంగా ఘాట్​ సహా సమీప ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కరోనా దృష్ట్యా గంగా హారతి నిర్వహించే అర్చకులతో పాటు 40 మందికి పైగా సిబ్బందికి కొవిడ్​ పరీక్షలు నిర్వహించారు.

ఇదీ చదవండి : 'విద్యావంతులైన యువతే విప్లవాత్మక మార్పు తేగలరు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.