తమిళనాడులో కలకలం రేపిన పొల్లాచ్చి కేసుకు సంబంధించిన ముగ్గురు నిందితులను కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది.
ఇదీ జరిగింది..
ఓ కళాశాల విద్యార్థినిని నలుగురు యువకులు లైంగికంగా వేధించారు. ఆమె అశ్లీల చిత్రాలు తీసి సామజిక మాధ్యమాల్లో వాటిని పోస్ట్ చేస్తామంటూ మానసికంగా ఒత్తిడి తెచ్చారు.
ఇదీ చదవండి:పొల్లాచ్చి కేసు సీబీఐకి బదిలీ
ఫిబ్రవరి 12న కోయింబత్తూరు జిల్లాలో... లైంగిక వేధింపులతో పాటు బంగారు నగలు దొంగతనం చేశారంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, లైంగిక వేధింపులకు సంబంధించి నలుగురిపై మొదటి కేసు నమోదైంది. ఫిబ్రవరి 26న బాధితురాలి సోదరుడిపై జరిగిన దాడి విషయంలో మరో నలుగురు నిందితులపై కేసు నమోదైంది.
సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లో... శబరి రాజన్, తిరునవుకరాసు, సతీష్, వసంతకుమార్, సెంతిల్, బాబు, మణి, వసంతకుమార్ను నిందితులుగా పేర్కొంది.
ఇదీ చదవండి:'వలస పక్షులతోనే బర్డ్ ఫ్లూ- అప్రమత్తంగా కేంద్రం'