ETV Bharat / bharat

ఈ నెల 22న అసోం, బంగాల్​లో మోదీ పర్యటన

author img

By

Published : Feb 20, 2021, 4:59 PM IST

Updated : Feb 20, 2021, 5:46 PM IST

ఈ నెల 22న అసోం, బంగాల్​లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. అసోం​లో చమురు, గ్యాస్​ ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితమివ్వనున్నారు. బంగాల్​లో వివిధ రైల్వే ప్రాజెక్టులకు ఆయన శంకు స్థాపన చేయనున్నారు.

PM to visit Assam and West Bengal on 22nd February
ఈ నెల 22న అసోం, బంగాల్​లో మోదీ పర్యటన

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఈ నెల 22న(సోమవారం) బంగాల్​, అసోంలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు అసోం దేమాజీ జిల్లాలోని శిలపతార్​లో చమురు, గ్యాస్​ ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం ఇవ్వనున్నారు. ఇంజినీరింగ్​ కళాశాలలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సాయంత్రం 4:30 గంటలకు బంగాల్​లోని హూగ్లీలో వివిధ రైల్వే ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు.

అసోంలో మోదీ..

దిబ్రుగఢ్​లోని మధువన్​ వద్ద ఇండియన్​ ఆయిల్​కు చెందిన ఇండ్​మ్యాక్స్​ యూనిట్​ను ప్రధాని.. జాతికి అంకితం ఇవ్వనున్నారు. దేమాజీ ఇంజినీరింగ్​ కళాశాలతో పాటు, సువాల్‌కుచి ఇంజనీరింగ్ కళాశాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి, అసోం ముఖ్యమంత్రి, గవర్నర్​ పాల్గొననున్నారు.

బంగాల్​లో మోదీ..

బంగాల్​లో నోపారా నుంచి దక్షిణేశ్వర్ వరకు విస్తరించిన మెట్రో రైల్వేను జెండా ఊపి ప్రధాని ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించిన రూ.464 కోట్లతో 4.1 కి.మీ మేర ఈ ప్రాజెక్టును విస్తరించారు. సౌత్​ ఈస్టర్న్​ రైల్వేకు చెందిన ​ కలైకుండ-ఝార్​గ్రామ్​ మధ్య మూడో రైల్వేను ప్రధాని ప్రారంభించనున్నారు. రూ.1,312 కోట్లతో ఈ రైల్వే లైన్​ను నిర్మించారు. దాంతోపాటుగా వివిధ రోడ్డు, రైల్వే ప్రాజెక్టులను ఆయన ప్రారంభించి, జాతికి అంకితమివ్వనున్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఈ నెల 22న(సోమవారం) బంగాల్​, అసోంలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు అసోం దేమాజీ జిల్లాలోని శిలపతార్​లో చమురు, గ్యాస్​ ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం ఇవ్వనున్నారు. ఇంజినీరింగ్​ కళాశాలలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సాయంత్రం 4:30 గంటలకు బంగాల్​లోని హూగ్లీలో వివిధ రైల్వే ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు.

అసోంలో మోదీ..

దిబ్రుగఢ్​లోని మధువన్​ వద్ద ఇండియన్​ ఆయిల్​కు చెందిన ఇండ్​మ్యాక్స్​ యూనిట్​ను ప్రధాని.. జాతికి అంకితం ఇవ్వనున్నారు. దేమాజీ ఇంజినీరింగ్​ కళాశాలతో పాటు, సువాల్‌కుచి ఇంజనీరింగ్ కళాశాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి, అసోం ముఖ్యమంత్రి, గవర్నర్​ పాల్గొననున్నారు.

బంగాల్​లో మోదీ..

బంగాల్​లో నోపారా నుంచి దక్షిణేశ్వర్ వరకు విస్తరించిన మెట్రో రైల్వేను జెండా ఊపి ప్రధాని ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించిన రూ.464 కోట్లతో 4.1 కి.మీ మేర ఈ ప్రాజెక్టును విస్తరించారు. సౌత్​ ఈస్టర్న్​ రైల్వేకు చెందిన ​ కలైకుండ-ఝార్​గ్రామ్​ మధ్య మూడో రైల్వేను ప్రధాని ప్రారంభించనున్నారు. రూ.1,312 కోట్లతో ఈ రైల్వే లైన్​ను నిర్మించారు. దాంతోపాటుగా వివిధ రోడ్డు, రైల్వే ప్రాజెక్టులను ఆయన ప్రారంభించి, జాతికి అంకితమివ్వనున్నారు.

Last Updated : Feb 20, 2021, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.