ETV Bharat / bharat

'సీఎం తల్లినే అవమానించిన వారు మహిళల్ని గౌరవిస్తారా?'

author img

By

Published : Mar 30, 2021, 3:03 PM IST

Updated : Mar 30, 2021, 3:21 PM IST

డీఎంకే, కాంగ్రెస్​కు మహిళల పట్ల గౌరవం లేదని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ. సీఎం పళనిస్వామి తల్లిని అవమానించిన వారు అధికారంలోకి వస్తే ఇంకా అనేక మంది మహిళలకు అదే పరిస్థితి ఎదురవుతుందన్నారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన డీఎంకే కూటమిపై ధ్వజమెత్తారు.

pm narendra modi poll campaign in tamilnadu
'సీఎం తల్లినే అవమానించిన వారు మహిళల్ని గౌరవిస్తారా?'

తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమిపై విమర్శలతో విరుచుకుపడ్డారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. సీఎం పళనిస్వామి తల్లినే అవమానించిన వారు అధికారంలోకి మహిళలను గౌరవిస్తారా? అని ప్రశ్నించారు. తమిళ ప్రజలు ఈ విషయాలను గమనిస్తున్నారని కాంగ్రెస్​, డీఎంకే గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర మహిళలను అవమానిస్తే తమిళులు సహించరని పేర్కొన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులో ధారాపురంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు మోదీ. పళనిస్వామి తల్లిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత ఏ రాజా పేరును ప్రస్తావించకుండా పరోక్ష విమర్శలు గుప్పించారు. కేంద్ర మాజీమంత్రిని ఉద్దేశించి 'కాలం చెల్లిన 2జీ మిసైల్'​ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమిళ మహిళలే లక్ష్యంగా ఆ మిసైల్​ పని చేస్తోందని దుయ్యబట్టారు.

ఇదీ చూడండి: 'తల్లిని దూషించడం తప్పే.. క్షమించండి'

బంగాల్​లో శోభ మజుందార్ అనే వృద్ధురాలు మరణించిన విషయాన్ని కూడా మోదీ ప్రస్తావించారు. "భావజాలాల వేరుగా ఉన్నాయనే కారణంతో టీఎంసీ గూండాలు దారుణంగా ఆమెపై దాడి చేశారు" అని ఆరోపించారు. కాంగ్రెస్, డీఎంకే, వామపక్షాలు ఆమె మృతి పట్ల సానుభూతి చూపాయా? అని ప్రశ్నించారు.

ఇదీ చూడండి: నందిగ్రామ్ నాది.. ఇక్కడే ఉంటా: దీదీ

తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమిపై విమర్శలతో విరుచుకుపడ్డారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. సీఎం పళనిస్వామి తల్లినే అవమానించిన వారు అధికారంలోకి మహిళలను గౌరవిస్తారా? అని ప్రశ్నించారు. తమిళ ప్రజలు ఈ విషయాలను గమనిస్తున్నారని కాంగ్రెస్​, డీఎంకే గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర మహిళలను అవమానిస్తే తమిళులు సహించరని పేర్కొన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులో ధారాపురంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు మోదీ. పళనిస్వామి తల్లిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత ఏ రాజా పేరును ప్రస్తావించకుండా పరోక్ష విమర్శలు గుప్పించారు. కేంద్ర మాజీమంత్రిని ఉద్దేశించి 'కాలం చెల్లిన 2జీ మిసైల్'​ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమిళ మహిళలే లక్ష్యంగా ఆ మిసైల్​ పని చేస్తోందని దుయ్యబట్టారు.

ఇదీ చూడండి: 'తల్లిని దూషించడం తప్పే.. క్షమించండి'

బంగాల్​లో శోభ మజుందార్ అనే వృద్ధురాలు మరణించిన విషయాన్ని కూడా మోదీ ప్రస్తావించారు. "భావజాలాల వేరుగా ఉన్నాయనే కారణంతో టీఎంసీ గూండాలు దారుణంగా ఆమెపై దాడి చేశారు" అని ఆరోపించారు. కాంగ్రెస్, డీఎంకే, వామపక్షాలు ఆమె మృతి పట్ల సానుభూతి చూపాయా? అని ప్రశ్నించారు.

ఇదీ చూడండి: నందిగ్రామ్ నాది.. ఇక్కడే ఉంటా: దీదీ

Last Updated : Mar 30, 2021, 3:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.