ETV Bharat / bharat

ఈ నెల 12, 13 తేదీల్లో జీ7 సదస్సుకు ప్రధాని

author img

By

Published : Jun 10, 2021, 10:14 PM IST

జీ7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఈ నెల​ 12, 13 తేదీల్లో జరిగే సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్​గా పాల్గొంటారని విదేశాంగ శాఖ వెల్లడించింది. జీ7 సదస్సుకు హాజరు కావడం ప్రధానికి ఇది రెండోసారి.

g7 summit pm modi, జీ7 సదస్సు ప్రధాని మోదీ
విదేశాంగ శాఖ ప్రకటించింది

జీ7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఈ నెల 12, 13 తేదీల్లో జరిగే సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్​గా హాజరు కానున్నారని విదేశాంగ శాఖ గురువారం వెల్లడించింది. ఈ సదస్సులో భాగంగా సభ్య దేశాలు మహమ్మారి కట్టడి, ఆరోగ్యం, వాతావరణ మార్పులపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని విదేశాంగ ప్రతినిధి అరిందమ్​ బాగ్చి తెలిపారు. 'బిల్డ్​ బ్యాక్​ బెటర్​' అనే ఇతివృత్తంతో సదస్సు జరగనుందని వెల్లడించారు.

బ్రిటన్​లో జరగనున్న ఈ సదస్సుకు ప్రధానికి ఆహ్వానం అందినా.. కరోనా కారణంగా ఈ కార్యక్రమానికి వర్చువల్​గానే హాజరవుతారని విదేశాంగ శాఖ ఇదివరకే స్పష్టం చేసింది. జీ7 సదస్సుకు హాజరు కావడం ప్రధానికి ఇది రెండోసారి. అంతకుముందు ఫ్రాన్స్​ ఆహ్వానం మేరకు 2019లో జరిగిన సదస్సులో పాల్గొన్నారు.

జీ7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఈ నెల 12, 13 తేదీల్లో జరిగే సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్​గా హాజరు కానున్నారని విదేశాంగ శాఖ గురువారం వెల్లడించింది. ఈ సదస్సులో భాగంగా సభ్య దేశాలు మహమ్మారి కట్టడి, ఆరోగ్యం, వాతావరణ మార్పులపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని విదేశాంగ ప్రతినిధి అరిందమ్​ బాగ్చి తెలిపారు. 'బిల్డ్​ బ్యాక్​ బెటర్​' అనే ఇతివృత్తంతో సదస్సు జరగనుందని వెల్లడించారు.

బ్రిటన్​లో జరగనున్న ఈ సదస్సుకు ప్రధానికి ఆహ్వానం అందినా.. కరోనా కారణంగా ఈ కార్యక్రమానికి వర్చువల్​గానే హాజరవుతారని విదేశాంగ శాఖ ఇదివరకే స్పష్టం చేసింది. జీ7 సదస్సుకు హాజరు కావడం ప్రధానికి ఇది రెండోసారి. అంతకుముందు ఫ్రాన్స్​ ఆహ్వానం మేరకు 2019లో జరిగిన సదస్సులో పాల్గొన్నారు.

ఇదీ చదవండి : జీ-7కు ఆహ్వానం- భారత్​కు సదవకాశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.