రెమ్డెసివిర్ ఔషధాలను ఉత్పత్తి చేసే అన్ని సంస్థలను దేశీయ మార్కెట్లో విక్రయించేందుకు అనుమతించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై అభిప్రాయం తెలియజేయాలని కేంద్రాన్ని, వివిధ ఫార్మా సంస్థలను దిల్లీ హైకోర్టు ఆదేశించింది.
రెమ్డెసివిర్ ఔషధ ఎగమతులపై కేంద్రం నిషేధం విధించినప్పటికీ.. 6 నుంచి 8 సంస్థలు మాత్రమే దేశీయ మార్కెట్లో తమ ఉత్పత్తులను విక్రయించేందుకు అనుమతించారని.. పిటిషనర్ దిన్కర్ బజాజ్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. మరో 25కుపైగా సంస్థలు.. విదేశాలకు ఎగుమతి చేసేందుకు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ, కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ సహా వివిధ ఫార్మా సంస్థలకు నోటీసులు జారీ చేసింది.
ఇదీ చూడండి: 'టీకాలు కొనట్లేదనే వార్తలన్నీ అవాస్తవాలు'