ETV Bharat / bharat

రాష్ట్ర విభజన తర్వాత రిజర్వేషన్​పై సుప్రీం కీలక తీర్పు

రాష్ట్రాల పునర్విభజన జరిగిన తర్వాత రిజర్వేషన్​ల అమలు ఎలా ఉండాలి అనే అంశంపై కీలక తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు. కొత్తగా ఏర్పడే రాష్ట్రాల్లో ఏదైనా ఒక దాంట్లోనే అభ్యర్థులకు రిజర్వేషన్ వర్తిస్తుందని తెలిపింది. కోటా లబ్ధిని ఒకే సమయంలో రెండు చోట్లా పొందలేరని స్పష్టంచేసింది.

author img

By

Published : Aug 20, 2021, 4:42 PM IST

supreme court
రిజర్వేషన్

రిజర్వేషన్​లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. రాష్ట్ర పునర్విభజన జరిగిన తర్వాత ఏర్పడిన కొత్త రాష్ట్రాల్లో ఏదైనా ఒకదానిలోనే అభ్యర్థులు రిజర్వేషన్ లబ్ధిని పొందగలరని తేల్చిచెప్పింది. ఒకేసారి రెండు రాష్ట్రాల్లో కోటా వర్తించదని స్పష్టం చేసింది. పంకజ్​ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్​పై..​ జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ అజయ్ రస్తోగీతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పుచెప్పింది.

ఏం జరిగిందంటే..

ఝార్ఖండ్​లో నివాసముండే పంకజ్​.. 2007లో ఆ రాష్ట్ర సివిల్ సర్వీస్ పరీక్ష రాశారు. అయితే ఆయన నియామకాన్ని నిరాకరించింది ఆ రాష్ట్ర హైకోర్టు. ఆయన శాశ్వత చిరునామా బిహార్ అని ఉండటమే అందుకు కారణం. దీనిని సుప్రీంలో సవాలు చేశారు షెడ్యూల్డ్​ తరగతికి చెందిన పంకజ్.

ఈ వ్యవహారంపై విచారణ చేపట్టింది సుప్రీం ధర్మాసనం. రిజర్వేషన్​కు అర్హులైనవారు 2000 నవంబరులో రాష్ట్ర విభజన అనంతరం.. బిహార్​, ఝార్ఖండ్​లో ఏదైనా ఒక్క రాష్ట్రంలోనే దాని లబ్ధి పొందగలరని తీర్పు చెప్పింది. ఒకేసారి కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాల్లోనూ కోటాకు అవకాశం లేదని స్పష్టంచేసింది. అయితే కొత్తగా ఏర్పడిన బిహార్​కు చెందిన రిజర్వేషన్​ అర్హులు ఝార్ఖండ్​లో జనరల్​ కేటగిరీలో పోడీపడవచ్చని తెలిపింది. ఝార్ఖండ్​కు చెందినవారు బిహార్​లో జనరల్​ కోటా కిందకు వస్తారని తేల్చిచెప్పింది.

ఇదీ చూడండి: 'రిజర్వేషన్​లలో 50శాతం పరిమితిని ఎత్తేయండి'

రిజర్వేషన్​లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. రాష్ట్ర పునర్విభజన జరిగిన తర్వాత ఏర్పడిన కొత్త రాష్ట్రాల్లో ఏదైనా ఒకదానిలోనే అభ్యర్థులు రిజర్వేషన్ లబ్ధిని పొందగలరని తేల్చిచెప్పింది. ఒకేసారి రెండు రాష్ట్రాల్లో కోటా వర్తించదని స్పష్టం చేసింది. పంకజ్​ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్​పై..​ జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ అజయ్ రస్తోగీతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పుచెప్పింది.

ఏం జరిగిందంటే..

ఝార్ఖండ్​లో నివాసముండే పంకజ్​.. 2007లో ఆ రాష్ట్ర సివిల్ సర్వీస్ పరీక్ష రాశారు. అయితే ఆయన నియామకాన్ని నిరాకరించింది ఆ రాష్ట్ర హైకోర్టు. ఆయన శాశ్వత చిరునామా బిహార్ అని ఉండటమే అందుకు కారణం. దీనిని సుప్రీంలో సవాలు చేశారు షెడ్యూల్డ్​ తరగతికి చెందిన పంకజ్.

ఈ వ్యవహారంపై విచారణ చేపట్టింది సుప్రీం ధర్మాసనం. రిజర్వేషన్​కు అర్హులైనవారు 2000 నవంబరులో రాష్ట్ర విభజన అనంతరం.. బిహార్​, ఝార్ఖండ్​లో ఏదైనా ఒక్క రాష్ట్రంలోనే దాని లబ్ధి పొందగలరని తీర్పు చెప్పింది. ఒకేసారి కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాల్లోనూ కోటాకు అవకాశం లేదని స్పష్టంచేసింది. అయితే కొత్తగా ఏర్పడిన బిహార్​కు చెందిన రిజర్వేషన్​ అర్హులు ఝార్ఖండ్​లో జనరల్​ కేటగిరీలో పోడీపడవచ్చని తెలిపింది. ఝార్ఖండ్​కు చెందినవారు బిహార్​లో జనరల్​ కోటా కిందకు వస్తారని తేల్చిచెప్పింది.

ఇదీ చూడండి: 'రిజర్వేషన్​లలో 50శాతం పరిమితిని ఎత్తేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.