ETV Bharat / bharat

కొవిడ్​ నుంచి కోలుకున్న వారిలో కొత్త రకం వ్యాధి! - కరోనా వైరస్​

కొవిడ్​ మహమ్మారి నుంచి కోలుకున్న వారు పేగు సంబంధిత వ్యాధి(గ్యాంగ్రీన్​)తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. కరోనా రెండో దశలో ఈ కేసులు బయటపడుతున్నాయని తెలిపారు. ఇప్పటికే ముంబయిలో 25 మంది గ్యాంగ్రీన్​తో బాధపడుతున్నట్లు తెలిసింది.

Intestinal Gangrene
గ్యాంగ్రీన్​ వ్యాధి
author img

By

Published : Jun 6, 2021, 8:24 PM IST

కొవిడ్​-19 మహమ్మారి కేవలం ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపటం లేదు. ఈ వ్యాధి బారిన పడిన వారిలో చిన్న పేగులు సైతం తీవ్రంగా దెబ్బతింటున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారు పేగు సంబంధిత వ్యాధి(గ్యాంగ్రీన్​)తో బాధపడుతున్నట్లు బయటపడింది.

కొవిడ్​ బారిన పడిన వారు ఇతర వ్యాధుల నుంచి కూడా రక్షించుకోవాలని, ముఖ్యంగా బ్లాక్ ఫంగస్​ రాకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా కేవలం ఊపిరితిత్తులనే కాకుండా, పొట్టను సైతం దెబ్బతీస్తోందని.. అది గ్యాంగ్రీన్​కు దారి తీస్తోందని తెలిపారు. గ్యాంగ్రీన్​గా మారితే.. అలాంటి పేగులను తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు.

15 శాతం కొవిడ్​ బాధితుల్లో...

ఇలాంటి కేసు తొలిసారి బెంగళూరులో గత ఏడాది బయటపడింది. సెయింట్​ జాన్స్​ ఆసుపత్రిలో ఓ రోగికి దెబ్బతిన్న చిన్న పేగులను తొలగించారు వైద్యులు. ప్రస్తుతం కొవిడ్​ రెండో దశలో అలాంటి కేసులు వెలుగు చూస్తున్నాయి. సుమారు 10-15 శాతం మంది కొవిడ్​ రోగుల్లో ఈ సమస్య తలెత్తుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ముంబయిలో ఇప్పటికే 25కు పైగా కేసులు వచ్చాయి.

గ్యాంగ్రీన్​ అంటే ఏమిటి?

ఏసీఈ2 గ్రాహకం అనేది శరీరంలోని కణాల్లోకి కొవిడ్​ వైరస్​ ప్రవేశించేందుకు సాయపడుతుంది. అలాంటి ఏసీఈ2 గ్రాహకాలు పేగుల్లోనూ ఉంటాయి. ముక్కు ద్వారా ప్రవేశించిన కొవిడ్​ వైరస్​ పేగుల వరకు చేరుతుంది. ఆ తర్వాత రక్త నాళాలను మూసివేస్తుంది. పేగుల్లో గ్యాంగ్రీన్​ ఏర్పడేందుకు కారణమవుతుంది. ఈ వ్యాధి పెరిగినకొద్దీ పొట్టలో భరించలేని నొప్పి వస్తుంది.

సీటీ స్కాన్​ ద్వారా దీనిని గుర్తించవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఇదీ చూడండి: Live Video: చిన్నారులకు కరెంట్ షాక్.. ఆ తర్వాత...

కొవిడ్​-19 మహమ్మారి కేవలం ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపటం లేదు. ఈ వ్యాధి బారిన పడిన వారిలో చిన్న పేగులు సైతం తీవ్రంగా దెబ్బతింటున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారు పేగు సంబంధిత వ్యాధి(గ్యాంగ్రీన్​)తో బాధపడుతున్నట్లు బయటపడింది.

కొవిడ్​ బారిన పడిన వారు ఇతర వ్యాధుల నుంచి కూడా రక్షించుకోవాలని, ముఖ్యంగా బ్లాక్ ఫంగస్​ రాకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా కేవలం ఊపిరితిత్తులనే కాకుండా, పొట్టను సైతం దెబ్బతీస్తోందని.. అది గ్యాంగ్రీన్​కు దారి తీస్తోందని తెలిపారు. గ్యాంగ్రీన్​గా మారితే.. అలాంటి పేగులను తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు.

15 శాతం కొవిడ్​ బాధితుల్లో...

ఇలాంటి కేసు తొలిసారి బెంగళూరులో గత ఏడాది బయటపడింది. సెయింట్​ జాన్స్​ ఆసుపత్రిలో ఓ రోగికి దెబ్బతిన్న చిన్న పేగులను తొలగించారు వైద్యులు. ప్రస్తుతం కొవిడ్​ రెండో దశలో అలాంటి కేసులు వెలుగు చూస్తున్నాయి. సుమారు 10-15 శాతం మంది కొవిడ్​ రోగుల్లో ఈ సమస్య తలెత్తుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ముంబయిలో ఇప్పటికే 25కు పైగా కేసులు వచ్చాయి.

గ్యాంగ్రీన్​ అంటే ఏమిటి?

ఏసీఈ2 గ్రాహకం అనేది శరీరంలోని కణాల్లోకి కొవిడ్​ వైరస్​ ప్రవేశించేందుకు సాయపడుతుంది. అలాంటి ఏసీఈ2 గ్రాహకాలు పేగుల్లోనూ ఉంటాయి. ముక్కు ద్వారా ప్రవేశించిన కొవిడ్​ వైరస్​ పేగుల వరకు చేరుతుంది. ఆ తర్వాత రక్త నాళాలను మూసివేస్తుంది. పేగుల్లో గ్యాంగ్రీన్​ ఏర్పడేందుకు కారణమవుతుంది. ఈ వ్యాధి పెరిగినకొద్దీ పొట్టలో భరించలేని నొప్పి వస్తుంది.

సీటీ స్కాన్​ ద్వారా దీనిని గుర్తించవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఇదీ చూడండి: Live Video: చిన్నారులకు కరెంట్ షాక్.. ఆ తర్వాత...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.